Rishi Sunak: సీట్బెల్ట్ వివాదం.. క్షమాపణలు చెప్పిన రిషి సునాక్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) విపక్షాల నుంచి వరుస విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈసారి సీట్బెల్ట్ ఇందుకు కారణమైంది.
లండన్: బ్రిటన్(Britain) ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) క్షమాపణలు చెప్పారు. ఒక వీడియో చిత్రీకరణ కోసం ప్రయాణంలో ఉన్న ఆయన స్వల్ప సమయంపాటు సీట్ బెల్ట్(Seat Belt) తీశారు. ఇది విమర్శలకు తావివ్వడంతో డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి వివరణ ఇచ్చారు.
‘హడావుడిగా నిర్ణయం తీసుకోవడంలో జరిగిన పొరపాటు అది. ఒక చిన్న వీడియో క్లిప్ చిత్రీకరణ కోసం ప్రధాని తన సీట్ బెల్ట్ను తీశారు. అలాచేయడం తప్పని ఆయన అంగీకరించారు. దీనిపై ఆయన క్షమాపణలు తెలియజేశారు. ప్రతిఒక్కరూ తప్పక సీట్బెల్ట్ ధరించాలన్నది ఆయన ఉద్దేశం’ అని వెల్లడించారు.
యూకే నిబంధనల ప్రకారం.. కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకపోతే, అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. ఇక ఆ వ్యవహారం కోర్టు వరకు వెళితే ఆ మొత్తం 500 పౌండ్ల వరకు పెరుగుతుంది. వైద్యపరమైన సమస్యలుంటే మినహాయింపులు ఉంటాయి.
దేశవ్యాప్తంగా 100 ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే ప్రక్రియలో భాగంగా సునాక్ ఆ వీడియో చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై లేబర్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ సీట్ బెల్ట్కు ఆర్థిక వ్యవస్థకు ముడిపెట్టి మండిపడ్డారు. ‘రిషి సునాక్కు తన సీట్ బెల్ట్, డెబిట్ కార్డు, ఆర్థిక వ్యవస్థ,ఈ దేశాన్ని ఎలా నిర్వహించాలో తెలీదు. రోజురోజుకూ ఈ జాబితా పెరిగిపోతోంది’ అని విరుచుకుపడ్డారు. ఇటీవల లండన్ నుంచి లీడ్స్ నగరానికి ఆయన ప్రైవేటు జెట్ను వినియోగించడంపైనా విపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై సునాక్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రధాని సమయాన్ని సమర్థవంతంగా వినియోగించే క్రమంలో అందులో ప్రయాణించినట్లు వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.