Rishi Sunak: రిషి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ.. రెండుస్థానాల్లో ఓటమి..!
బ్రిటన్ ప్రధాని రుషి సునాక్కు భారీ షాక్ తగిలింది. తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని పార్టీ కీలక స్థానాలను కోల్పోయింది.
ఇంటర్నెట్డెస్క్: బ్రిటన్లో రిషి సునాక్ (Rishi Sunak) నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం మూడు పార్లమెంట్ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల పార్టీ ఓటమి పాలైంది. ఉత్తర ఇంగ్లాండ్లోని సెల్బే-అయిన్స్టీ సీటులో లేబర్ పార్టీ గెలుపొందింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ భారీ మెజార్టీని పొందింది. ఇక మరో స్థానమైన సోమర్టన్-ఫ్రోమ్ను లిబరల్ డెమోక్రటిక్ పార్టీ గెలుచుకొంది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఉక్స్బ్రిడ్జ్-సౌత్ రూయిస్లిప్ సీటును మాత్రం దక్కించుకొంది. గతంలో ఇది బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గెలిచిన స్థానం. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ పార్టీ గతంలో కంటే బలపడింది.
చైనాలో అమెరికా పెద్దాయన ఏం చేస్తున్నట్లు?
ఈ ఫలితాలు సునాక్ నాయకత్వంపై ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఓటములతో వచ్చే జనరల్ ఎలక్షన్స్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి పెనుసవాళ్లను తీసుకురానున్నాయి. సునాక్ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లో పార్టీ నాయకులు పలు వివాదాలు, కుంభకోణాల్లో చిక్కుకున్నారు. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ఒత్తిడి వంటివి పార్టీ పాపులారిటీని తీవ్రంగా దెబ్బతీశాయి.
ఈ ఫలితాలను చూసిన విశ్లేషకులు వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కెయిర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ నుంచి అధికార పక్షానికి గట్టిపోటీ తప్పదని చెబుతున్నారు. 2025లో బ్రిటన్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఓటర్లు పోలింగ్కు పెద్దగా మొగ్గు చూపని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బ్రిటన్లో దాదాపు 65శాతం మంది ఓటర్లు సునాక్కు ప్రతికూలంగా ఉండగా.. 25శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నట్లు ఇటీవల సర్వే పేర్కొంది. ‘యూ గవ్ పోల్’ పేరిట నిర్వహించిన సర్వేలో దాదాపు 2,151 మంది బ్రిటన్ వాసుల అభిప్రాయాలను సేకరించారు. ఆయనపై ఉన్న సానుకూల దృక్పథం దాదాపు 40శాతం తగ్గిందని కంపెనీ పేర్కొంది. ఇక గత నెలతో పోల్చుకొంటే 6 శాతం తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.