చైనాలో అమెరికా పెద్దాయన ఏం చేస్తున్నట్లు?
ఆయన వయసు వందేళ్లు! ఆరోగ్యంగా ఇంట్లో కూర్చోగలిగితే గొప్ప అనుకునే దశ! అలాంటి వయసులో ఆ అమెరికా పెద్దమనిషి ఖండాలు దాటుకుంటూ ఏకంగా చైనా వెళ్లాడు.
ఆయన వయసు వందేళ్లు! ఆరోగ్యంగా ఇంట్లో కూర్చోగలిగితే గొప్ప అనుకునే దశ! అలాంటి వయసులో ఆ అమెరికా పెద్దమనిషి ఖండాలు దాటుకుంటూ ఏకంగా చైనా వెళ్లాడు. చైనా ప్రభుత్వంలోని పెద్దల్ని కలిసి ముచ్చట్లు మొదలెట్టాడు! వాళ్లు కూడా ఆయనకు పెద్దపీట వేస్తున్నారు. ఒకవంక అమెరికా ప్రభుత్వమేమో చైనాతో సై అంటే సై అంటుంటే ఈ వృద్ధుడు మాత్రం జిన్పింగ్ సర్కారుకు స్నేహహస్తం చాస్తున్నాడు. ఇంతకూ ఎవరీ వృద్ధుడు? ఏంటీ పర్యటన అంతరార్థం!
నాడు స్నేహం కుదిర్చి..
హెన్రీ కిసింజర్... ఈ తరంలో చాలామందికి తెలియని పేరు! అమెరికా మాజీ విదేశాంగ మంత్రి. ఆ దేశ చరిత్రలో లింకన్లాంటి మాజీ అధ్యక్షులకు ఉన్నంత పేరు ప్రఖ్యాతులున్న రాజకీయ శక్తి! ఇప్పటికీ చైనా ఎంతో గౌరవించే దౌత్యయుక్తి కిసింజర్! కారణం- 1970ల్లో ప్రచ్ఛన్నయుద్ధం వేళ... కమ్యూనిస్టు సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా మావోయిస్టు చైనాతో క్యాపిటలిస్టు అమెరికాకు స్నేహం కుదిర్చింది ఆయనే! 1971లో అమెరికా జాతీయ భద్రత సలహాదారు హోదాలో బీజింగ్లో పర్యటించిన కిసింజర్ రెండు దేశాల మధ్య బంధానికి బీజం వేశారు. 1979లో అమెరికా, చైనా పరస్పరం గుర్తించుకొని.. దౌత్యబంధాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చాయి. నాడు ఆయన వేసిన స్నేహ విత్తనమే మొలకెత్తి దాదాపు 50 ఏళ్లపాటు కొనసాగింది. ఆనాడు భౌగోళిక రాజకీయ, ఆర్థిక కారణాలతో ఒకటైన ఈ రెండు దేశాలు అవే కారణాలతో వైరి శిబిరాలుగా మారటం నడుస్తున్న చరిత్ర! ఇప్పుడు అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్షీణించి మరో ప్రచ్ఛన్నయుద్ధానికి దారితీస్తున్న వేళ... కిసింజర్ మళ్లీ అలుపెరగని రాయబారం మొదలెట్టారు!
కీలక నేతలతో మంతనాలు
అనూహ్యంగా చైనాలో అడుగుపెట్టిన కిసింజర్.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రక్షణమంత్రి లి షాంగ్ఫు, చైనా విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి వాంగ్ యీలతో విడివిడిగా భేటీ అయ్యారు. ‘‘చైనాకు ఆయనకు పాత మిత్రుడు. రెండు దేశాల మధ్య చరిత్రాత్మక బంధానికి ఆద్యుడు. చైనాతో విధానాల విషయంలో అమెరికాకు కిసింజర్ తరహా దౌత్యనీతి, నిక్సన్ తరహా రాజకీయ ధైర్యం అవసరం’’ అని కిసింజర్తో భేటీ అనంతరం వాంగ్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మాటలంటూనే... ‘‘చైనా అభివృద్ధి వెనక బలమైన స్వదేశీ పునాది ఉంది. అలాంటి చైనాను బయటి నుంచి బలవంతంగా మార్చాలని ప్రయత్నించటం కుదరని పని. అంతేకాదు చైనాను చుట్టుముట్టాలని, కట్టడి చేయాలని అనుకోవటం దుస్సాహసమే అవుతుంది’’ అని వాంగ్ స్పష్టం చేశారు. తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండాలని కిసింజర్కు ఆయన కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. చైనా నేతలకు కిసింజర్ ఏం చెప్పారనేది మాత్రం తెలియరాలేదు. ఆ పెద్దాయన సైతం- ‘‘అబ్బే... నేను చైనా మిత్రుడిగా ఇక్కడికి వచ్చానంతే’’ అంటూనే.. ‘‘చైనా, అమెరికా తమ మధ్య ఉన్న అపోహలను తొలగించుకోవాలి. విభేదాలు దూరం చేసుకొని కలిసి నడవాలి. అవి పరస్పరం పోరాడితే ఎలాంటి లాభం ఉండదు. వాటి మధ్య యుద్ధమే వస్తే... పరిణామాలు దారుణంగా ఉంటాయి’’ అని హెచ్చరించారు.
చైనా కఠిన స్వరం
అనధికార రాయబారాల్లో భాగంగానే ఆయన చైనాకు వెళ్లి ఉండొచ్చనేది విశ్లేషకుల అంచనా! ఎందుకంటే... రాజకీయాల నుంచి వైదొలగినా చైనాతో, ఆ దేశ అధికార పక్షంతో కిసింజర్ సంబంధాలు కొనసాగిస్తునే వస్తున్నారు. నాలుగేళ్ల కిందట కూడా బీజింగ్ వెళ్లారు. చేతికర్ర పట్టుకొని నడుస్తూ వెళ్లి అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. చైనా, అమెరికాల మధ్య దౌత్యసంబంధాలు మెరుగయ్యేందుకు ఈ వృద్ధరాయబారి చేస్తున్న ప్రయత్నాలు భేష్ అంటూ జిన్పింగ్ కొనియాడారు కూడా. తాజాగా మాత్రం... అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ విషయంలో చైనా గట్టిగానే పట్టుబడుతోంది. ‘సమస్థాయిలో... ఇచ్చిపుచ్చుకునేట్లయితేనే రెండు దేశాల మధ్య సమస్యలకు పరిష్కారం సాధ్యం’ అని అమెరికాకు తామేమాత్రం తీసిపోయేది లేమని చెప్పకనే చెబుతోంది. మరి 52 ఏళ్లకిందట చైనాతో దోస్తీ కుదిర్చిన కిసింజర్ దౌత్యనీతి ఈసారి ఎంతమేరకు పనిచేస్తుందో చూడాలి!
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
Taiwan: తైవాన్లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కిర్గిస్థాన్ (Kyrgyzstan) రాజధానిలో మూక హింస చెలరేగడంతో.. భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. -
మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. -
అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ పోటీ!
పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా (47) మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సహచరులు భావిస్తున్నారు. -
2050 నాటికి పెరగనున్న ఆయుర్దాయం
ప్రపంచవ్యాప్తంగా 2022 నుంచి 2050 మధ్య ఆయుర్దాయం పురుషుల్లో 5 సంవత్సరాలు, మహిళల్లో 4 ఏళ్లు పెరుగుతుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం అంచనా వేసింది. -
ఉత్తర గాజాలో హోరాహోరీ
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర గాజాలో జబాలియా కేంద్రంగా దాడులు, ప్రతిదాడులు భారీస్థాయిలో కొనసాగుతున్నాయి. -
ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్వో
అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ సైమా వాజెడ్ చెప్పారు. -
ఖర్కీవ్ను ఆక్రమించే ప్రణాళికల్లేవ్
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. -
నరమేధానికి పాల్పడలేదు
గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి
యువకుడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. ఎట్టకేలకు ఓ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా బాధితుడిని రక్షించారు. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా ధ్రువీకరించింది. -
పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు
పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
Elon Musk: మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ