S Jaishankar: కెనడాలో ఖలిస్థానీ అనుకూల ఘటనలు.. స్పందించిన జై శంకర్..!
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటు సంస్థలను ఉద్దేశించి కేంద్రమంత్రి జై శంకర్ స్పందించారు. అలాగే తమ దేశీయుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అడ్వైజరీలు జారీ చేస్తామని చెప్పారు.
కాన్బెర్రా: ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛను మతోన్మాదానికి మద్దతు ఇచ్చే శక్తులు దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సోమవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటు సంస్థలను ఉద్దేశించి స్పందించారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామన్నారు.
‘ఈ అంశంపై ఎప్పటికప్పుడు కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛను మతోన్మాదానికి మద్దతు ఇచ్చే శక్తులు దుర్వినియోగం చేయకుండా చూడాల్సి ఉంది. ఇదే అంశాన్ని మేం కెనడా ప్రభుత్వం వద్ద లేవనెత్తాం. మన దేశంలోనే కాకుండా ఇతర దేశ ప్రజాస్వామ్యాల పనితీరు గురించి కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం’ అన్నారు.
ఇటీవల కెనడాలో ఖలిస్థానీ అనుకూల అతివాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ ఆధ్వర్యంలో ఖలిస్థాన్ ఏర్పాటుపై రెఫరెండం నిర్వహించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రేరేపిత దేశ వ్యతిరేక శక్తులు ఎదుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటు అక్కడి ఓ ఆలయంపైనా దాడి జరిగింది. ఈ విధమైన వరుస ఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం.. అక్కడి భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో విద్వేషపూరిత ఘటనలు(Hate crimes), మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని హెచ్చరించింది.
అందుకు ప్రతిగా కెనడా.. భారత్లో ఆ రాష్ట్రాల్లో జాగ్రత్త అంటూ ఓ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘అనూహ్య భద్రతా పరిస్థితి, మందుపాతరలు, పేలని ఆయుధాల ఉనికి కారణంగా.. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాకిస్థాన్ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో పర్యటనకు ప్రజలు దూరంగా ఉండండి’ అని దానిలో పేర్కొంది.
తాజాగా దీనిపై జై శంకర్కు ప్రశ్న ఎదురైంది. ‘మేం మా ప్రజల భద్రతను ఉద్దేశించి అడ్వైజరీలను జారీ చేస్తాం. వాటిలో అంతకు మించి ఇంకేం వెతకొద్దని నేను కోరుతున్నాను. అలాగే ఇతర దేశాలు కూడా వారి విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి’ అని మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్