Switzerland: గ్రామంపై కూలిపోనున్న కొండచరియ.. వందల ఏళ్ల జ్ఞాపకాలతో ఖాళీ చేస్తున్న ప్రజలు!
ఆల్ఫ్ పర్వతశ్రేణుల్లోని కొండచరియ కారణంగా ఓ గ్రామం పూర్తిగా కనుమరుగు కానుంది. ఎప్పుడు ఊడిపడుతుందో తెలియకపోవడంతో అధికారులు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జెనీవా: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రభుత్వ యంత్రాగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. కొద్దిరోజులు తమ ప్రాంతాన్ని వీడి వెళ్లాలంటే అక్కడి ప్రజలు ఎంతో ఆవేదన చెందుతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లి.. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి వస్తుంటారు. తాజాగా, ఓ కొండచరియ కారణంగా ఓ గ్రామం పూర్తిగా కనుమరుగు కానుంది. ఎప్పుడు ఊడిపడుతుందో తెలియకపోవడంతో అధికారులు గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఎన్నో వందల ఏళ్లుగా అక్కడ జీవిస్తున్న వందల కుటుంబాలు ఆ ప్రాంతంతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గ్రామాన్ని ఖాళీ చేస్తున్నాయి. కార్లు, ట్రక్లు, పికప్ ట్రక్ల సాయంతో చిన్నా, పెద్దా.. తమ పెంపుడు జంతువులతో సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోతున్నారు.
తూర్పు స్విట్జర్లాండ్(Switzerland)లో బ్రియేంజ్ (Brienz) ప్రాంతంలోని ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లో ఓ గ్రామంలో ప్రజలు ఎన్నో వందల ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గ్రామం దగ్గర్లో భూమిలో వింత శబ్దాలు రావడంతో భూగర్భ శాస్త్రవేత్తలు (Geologists) ఆ ప్రాంతాన్ని పరీక్షించారు. తర్వాత కొద్దిరోజులకు ఆల్ఫ్ పర్వతశ్రేణుల్లోని రెండు మిలియన్ క్యూబిక్ మీటర్ వ్యాసం కలిగిన ఓ కొండచరియ విరిగి గ్రామంపై పడబోతోందని గుర్తించారు. ‘‘కొండచరియలు చిన్న చిన్న రాళ్లుగా గ్రామంపై పడేందుకు 60 శాతం అవకాశం ఉంది. కానీ పెద్ద రాయిగా గ్రామంపై జారిపడేందుకు 10 శాతం అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం’’ అని క్రిస్టియన్ గ్రాట్మన్ అనే అధికారి తెలిపారు. ఈ గ్రామంలో జర్మన్, రోమన్ మూలాలు కలిగిన ప్రజలు నివస్తిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా హిమనీనదాలు కరిగిపోవడం వల్ల పర్వత శ్రేణుల్లోని భూగర్భ శిలజాలాలు కదిలిపోయి కొండచరియలు విరిగిపడిపోతున్నాయని గ్రాట్మన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం