Sweden: ‘నాటో’ 32వ సభ్యదేశంగా స్వీడన్
‘నాటో (NATO)’లో 32వ సభ్యదేశంగా స్వీడన్ అధికారికంగా చేరింది.
వాషింగ్టన్: పశ్చిమ దేశాల సైనిక కూటమి ‘నాటో (NATO)’లో 32వ సభ్యదేశంగా స్వీడన్ (Sweden) అధికారికంగా చేరింది. స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్లు ఓ కార్యక్రమంలో ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. తద్వారా రెండో ప్రపంచ యుద్ధానంతరం దశాబ్దాల తరబడి కొనసాగించిన తటస్థ వైఖరికి స్వీడన్ వీడ్కోలు పలికినట్లయ్యింది.
2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి పరిణామాలతో ‘నాటో’లో చేరిక దిశగా స్వీడన్ ముందడుగు వేసింది. ఈ దేశం చేరికపై తుర్కియే, హంగరీలు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ‘నాటో’ సభ్యదేశంగా స్వీడన్ ఉండటం.. అమెరికా, దాని మిత్రపక్షాలను భద్రతాపరంగా మరింత సురక్షితం చేస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. నాటో విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రష్యా.. ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. గతేడాది 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ చేరికను తమ భద్రత, జాతీయ ప్రయోజనాల ఉల్లంఘనగా క్రెమ్లిన్ పేర్కొంది.
విస్తరిస్తోంది చూడు.. నాటో.. నాటో..
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదాల్చింది. కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలవడంతోపాటు సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. ఒక దేశం నాటోలో చేరాలనుకుంటే.. ముందుగా కూటమిలోని అన్ని సభ్యత్వ దేశాలు దానికి అంగీకరించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.