India-Canada: కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది: భారత్పై ఆరోపణలకు అమెరికా నిపుణుల హెచ్చరిక
భారత్పై కెనడా (Canada) ప్రధాని ట్రూడో (Justin Trudeau) చేసిన తీవ్ర ఆరోపణలను అమెరికా విదేశాంగశాఖ నిపుణులు ఖండించారు. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని, అందులో వాషింగ్టన్ జోక్యం చేసుకోకూడదని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ (India) హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై పలు దేశాలు స్పందిస్తున్నాయి. అమెరికా (USA)లోని కొంతమంది నిపుణులు.. ట్రూడో తీరును తీవ్రంగా ఖండించారు. కెనడా చర్య ‘సిగ్గుచేటు’ అని దుయ్యబట్టారు. అటు ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్ట్రేలియా.. భారత్పై కెనడా ఆరోపణలు ఆందోళనకరమని పేర్కొంది.
భారత్-కెనడా (India-Canada) మధ్య చోటు చేసుకొన్న పరిణామాలపై వాషింగ్టన్లో హడ్సన్ ఇన్స్టిట్యూట్ చర్చాకార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. ‘‘ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారు. ఖలిస్థానీ నేత హత్యలోకి భారత్ను లాగుతూ అతడు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఇది రాజకీయంగా ట్రూడోకు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తుందేమో గానీ.. నాయకత్వ లక్షణం మాత్రం కాదు. ఈ వ్యవహారంలో అమెరికా నేతలు ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నాం. ఎందుకంటే కెనడా నిప్పుతో చెలగాటమాడుతోంది’’ అని ట్రూడో తీరుపై మండిపడ్డారు.
భారత్-కెనడా ఢీ అంటే ఢీ.. దౌత్యవేత్తలపై పరస్పరం బహిష్కరణాస్త్రాలు
ట్రూడో వ్యాఖ్యలు ఆందోళనకరం: ఆస్ట్రేలియా
‘‘భారత్పై కెనడా ఆరోపణలు ఆందోళనకరం. అయితే, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మా భాగస్వామ్య పక్షాలతో కలిసి తాజా పరిణామాలను మేం సునిశితంగా పరిశీలిస్తున్నాం. మా ఆందోళనలను భారత్తో కూడా పంచుకున్నాం. దీనిపై ఇంతకంటే మేం మాట్లాడలేం’’ అని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ విలేకరులతో అన్నారు.
అటు బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ కూడా దీనిపై ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘కెనడా వ్యాఖ్యలు ఆందోళనకరం. దీనిపై యూకే ప్రభుత్వంతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. న్యాయం జరగాలి’’ అని పేర్కొన్నారు.
ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా, బదులుగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాసీం సులేమానీ హత్యకు 50 బిలియన్ల డాలర్లు చెల్లించండి..అమెరికాకు ఇరాన్ కోర్టు ఆదేశం
నాలుగేళ్ల క్రితం ఇరాన్(Iran)కు చెందిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసీం సులేమానీ అమెరికా దాడిలో మృతి చెందాడు. దీనిపై అమెరికా(USA) నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
Hamas: దాడులకు ముందు భారీగా షార్ట్ సెల్లింగ్.. రూ.కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు!
హమాస్ దాడి సమాచారం ముందే తెలిసిన కొందరు ఇన్వెస్టర్లు ఐదు రోజుల ముందు ఇజ్రాయెల్ కంపెనీల షేర్లను (Short Selling) భారీగా కొనుగోలు చేశారట. -
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రస్తుత, మాజీ అధ్యక్షులు బైడెన్, ట్రంప్ రంగంలోకి దిగారు. -
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడాన్ని ఖండిస్తున్న మానవ, మహిళా హక్కుల సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై దాడులు జరిగినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. -
Pakistan: పాక్లో ఆగని ఉగ్రవాదుల హత్యలు.. హఫీజ్ సయీద్ అనుచరుడి కాల్చివేత
Pakistan: పాక్లో ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. -
Israel: లెబనాన్కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం..!
ఇజ్రాయెల్ పొరపాటున జరిపిన దాడిలో లెబనాన్ సైనికుడు మృతి చెందాడు. దీనికి ఐడీఎఫ్ క్షమాపణ చెప్పింది. -
Kim Jong Un: ‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
Kim Jong Un: కిమ్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. తన కఠిన ఆంక్షలతో ప్రజలను వణికిస్తోన్న ఈ నియంత.. కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
థాయ్లాండ్లో చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి
థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 49 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. -
కెన్యాకు రూ.2,084 కోట్ల రుణం
వ్యవసాయరంగ ఆధునికీకరణకుగాను కెన్యాకు రూ.2,084 కోట్లు (250 మిలియన్ డాలర్లు) సమకూర్చాలని భారత్ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. -
ప్రపంచ సగటులో భారత్ ఉద్గారాలు సగమే
కార్బన్ డయాక్సైడ్ (సీవో2) వెలువరించడంలో 2022లో భారతదేశ సగటు 5% మేర పెరిగినా అది ప్రపంచ సరాసరిలో సగం కంటే తక్కువేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కూడిన ‘గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు’ తేల్చింది. -
అలబామా వర్సిటీలో నేడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య చర్చ
అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య బుధవారం జరిగే చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి కూడా పాల్గొంటున్నారు. -
ఇజ్రాయెల్ది మానవ హననం
గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతోందని, ఆ దేశం తీరుతో పశ్చిమాసియా ప్రమాదంలో పడుతోందని ఖతార్, తుర్కియే ధ్వజమెత్తాయి. -
భారత్పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నకిలీ ఫేస్బుక్ ఖాతాలు
భారత్పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా నుంచి పుట్టుకొస్తున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాల ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. -
మళ్లీ పేలిన ఇండోనేసియా అగ్నిపర్వతం
పశ్చిమ ఇండోనేసియాలోని మౌంట్ మెరపి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఆదివారం సంభవించిన దుర్ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే సోమవారం మరో విస్ఫోటనం చోటుచేసుకుంది. -
రష్యా దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ వాసుల మృతి
ఉక్రెయిన్ దక్షిణ నగరం ఖేర్సన్పై రష్యా మంగళవారం జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
ఖాన్ యూనిస్ రక్తసిక్తం
గాజాలోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేయడంతో అల్లకల్లోలమైంది. -
ఖలిస్థానీ ఉగ్రవాది లక్బిర్సింగ్ పాకిస్థాన్లో మృతి
పాకిస్థాన్లో నక్కిన మరో ఖలిస్థానీ ఉగ్రవాది మరణించాడు. నిషేధిత ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ నేత లక్బిర్సింగ్ అలియాస్ రోడే పాకిస్థాన్లోని రావల్పిండిలో తీవ్ర గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. -
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేలా బిల్లు
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు, దేశాల వారీగా వివక్షను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి స్వస్తి పలికే దిశగా ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు యూఎస్ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. -
శాకాహారంతో అల్జీమర్స్కు కళ్లెం!
భారత్, జపాన్, చైనాల్లో తినే శాకాహారం, సంప్రదాయ భోజనంతో అల్జీమర్స్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. -
WHO: ఆల్కహాల్, తీపిపానియాల వాడకాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్వో కొత్త సిఫార్సు
ఆల్కహాల్, తీపి పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంఖ్య కొత్త సిఫార్సు చేసింది. వీటి ఉత్పత్తులపై అధిక పన్నును విధించాలని ఒక మాన్యువల్ను విడుదల చేసింది. -
Hamas: ‘బందీలకు మత్తుమందు ఇచ్చి.. కృత్రిమ నవ్వులు తెప్పించి!’
బందీలు సంతోషంగా, ప్రశాంతంగా కనిపించేలా హమాస్ మిలిటెంట్లు వారికి మత్తుమందు ఇచ్చారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Tirumala: తిరుమలలో ముగ్గురు చిన్నారుల అదృశ్యం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
NTR 31: ఎన్టీఆర్తో సినిమా.. అంచనాలు పెంచేలా ప్రశాంత్ నీల్ అప్డేట్
-
Apply Now: ఫ్యాషన్ ప్రపంచం వైపు వెళ్తారా? ఇదిగో గొప్ప ఛాన్స్!
-
Apple: యూఎస్బీ-సి టైప్ నుంచి మినహాయింపు కోరిన యాపిల్
-
వాగుదాటుతూ ముగ్గురు గల్లంతు.. అల్లూరి జిల్లాలో గురువారం కూడా విద్యాసంస్థలకు సెలవు
-
Social Look: శ్రీదేవి డ్రెస్లో మెరిసిన ఖుషి కపూర్.. మృణాల్ ఠాకూర్ స్పెషల్ పోస్ట్