Rishi Sunak: రిషి సునాక్కు మరో సవాల్.. సొంత పార్టీ నుంచే తొలి ‘అవిశ్వాసం’
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై సొంత పార్టీకి చెందిన ఓ ఎంపీ అవిశ్వాస లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. సువెల్లా బ్రేవర్మన్పై వేటును తీవ్రంగా వ్యతిరేకించిన ఆ ఎంపీ.. సునాక్పై అవిశ్వాసం ప్రకటించారు.
లండన్: యూకే (UK) ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak)కు మరో సవాల్ ఎదురైంది. సొంత పార్టీ ఎంపీయే ఆయనకు వ్యతిరేకంగా ‘అవిశ్వాస’ లేఖ (no confidence letter)ను సమర్పించారు. సువెల్లా బ్రేవర్మన్ను మంత్రి పదవి నుంచి తప్పిస్తూ.. కేబినెట్లో మార్పులు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై ‘అవిశ్వాస’ గళం వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రిషి సునాక్ (Rishi Sunak)కు వ్యతిరేకంగా టోరీ (Tory) ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ సోమవారం అవిశ్వాస లేఖను ప్రయోగించారు. హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహరాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్ గ్రాహమ్ బ్రాడీకి ఆమె ఈ లేఖను సమర్పించారు. ఈ విషయాన్ని ఆండ్రియా ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. అవిశ్వాస లేఖను పోస్ట్ చేశారు. ‘‘జరిగింది చాలు. నా అవిశ్వాస లేఖను సమర్పించా. రిషి సునాక్ను పదవి నుంచి దింపి.. ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చింది’’ అని ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చారు.
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు నమ్మిన వ్యక్తిగా పేరున్న ఆండ్రియా.. కేబినెట్ నుంచి సువెల్లా బ్రేవర్మన్ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆమె ఈ ‘అవిశ్వాస’ లేఖను సమర్పించారు. రిషి సునాక్ తన కేబినెట్లో నిజాలు మాట్లాడే ఏకైక వ్యక్తి సువెల్లాపై వేటు వేశారని, దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. రిషి సునాక్ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస లేఖలు సమర్పించాలని తోటి టోరీ ఎంపీలను ఆమె అభ్యర్థించారు.
బ్రిటన్ హోం మంత్రి సువెల్లాకు ఉద్వాసన.. విదేశాంగ మంత్రిగా డేవిడ్ కామెరూన్
రిషి.. అవిశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సిందేనా?
కాగా.. రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి. అయితే, దీనిపై ఇప్పుడే ఆయన అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో 15శాతం మంది తాము కొత్త నాయకుడిని కోరుకుంటున్నామంటూ లేఖలు పంపితే అప్పుడు కన్జర్వేటివ్ పార్టీలో రిషి నాయకత్వంపై విశ్వాస పరీక్ష ఓటింగ్ నిర్వహిస్తారు.
గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్న సువెల్లా బ్రేవర్మన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు రిషి సునాక్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ పదవిని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి కట్టబెట్టింది. ఇక, మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్కు కేబినెట్లో చోటు కల్పించింది. ఆయనకు విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల శాఖ’ బాధ్యతలు అప్పగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కత్తితో విచక్షణారహిత దాడి..ఉలిక్కిపడిన లండన్
కత్తితో దూసుకొచ్చిన ఓ దుండగుడు ప్రజలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. లండన్ (London)లో ఈ ఘటన జరిగింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.