Imran khan: లాహోర్లో హైడ్రామా.. పాక్ సర్కార్పై ఇమ్రాన్ తీవ్ర ఆరోపణలు
లాహోర్లోని ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. అరెస్టు వారెంట్తో వచ్చిన పోలీసులు తాము ఖాళీ చేతులతో వెళ్లేది లేదని చెబుతుండగా.. ఆయన్ను అరెస్టు చేస్తే ఆందోళనల్ని ఉద్ధృతం చేస్తామంటూ పీటీఐ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
లాహోర్: పాకిస్థాన్(pakistan)మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. లాహోర్లో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు జమాన్ పార్క్ రెసిడెన్సీకి రావడం.. దీంతో ముందుగానే పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ షెహబాజ్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశాధినేతలు చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడకపోతే దేశం బానిసగా మారుతుందన్నారు. అవినీతికి పాల్పడి అరెస్టు అవ్వాల్సిన నేతను ప్రధానిని చేయడం వల్లే తమ దేశ పతనానికి దారితీసిందని ఆరోపించారు.
అగ్ర నేతలే నేరస్థులైతే..
‘‘భారతదేశ ఛానళ్లను చూడండి.. పాకిస్థాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు విమర్శలకు గురవుతుందో తెలుసుకోండి. అవినీతికి పాల్పడి అరెస్టవుతున్న నేతను ప్రధానిని చేయడం వల్లే పాకిస్థాన్ దిగజారిపోయింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా ఆయన్ను కాపాడి.. ప్రధానిని చేశారు. ఇంటీరియర్ మినిస్టర్ పైనా హత్యారోపణలు ఉన్నాయి. అసిఫ్ జర్దారీ ఓ హంతకుడు. ప్రభుత్వంలోని అగ్ర నేతలే నేరస్థులైతే.. ఇక దేశం ఏమవుతుంది? ఇలాంటి తప్పులకు వ్యతిరేకంగా నిలబడకపోతే దేశం బానిసగా మారుతుంది. పాకిస్థాన్ ఇప్పుడు బెగ్గర్లా మారింది. ప్రపంచవ్యాప్తంగా అవమానాలకు గురవుతోంది. దేశానికి ఇదో గడ్డు కాలం. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాకిస్థాన్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు నలిగిపోతున్నారు. ప్రభుత్వాధి నేతలు తమ సంపదను విదేశాల్లో ఎంత దాచుకున్నారో ప్రపంచానికి తెలుసు. వజీరాబాద్లో నాపై జరిగిన హత్యాయత్నం వెనుక అధికారంలో ఉన్నవారంతా ఉన్నారు’’ అంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇంటీరియర్ మంత్రి రానా సనావుల్లా, ఇంటెలిజెన్స్ అధికారుల పేర్లను ఇమ్రాన్ ప్రముఖంగా ప్రస్తావించారు.
ఖాళీ చేతులతో వెళ్లేది లేదు.. పోలీసులు
ఇమ్రాన్ఖాన్ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఈ కేసుకు సంబంధించిన మూడు సార్లు విచారణకు పిలిచినా ఇమ్రాన్ హాజరుకాకపోవడంతో సెషన్సు కోర్టు ఆయనపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఖాన్ను మార్చి 7వ తేదీ నాటికి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ను అరెస్టు చేసేందుకు ఇస్లామాబాద్ పోలీసులు లాహోర్లోని జమాన్ పార్క్ రెసిడెన్సీకి చేరుకున్నారు. అప్పటికే పీటీఐ నేత ఫవాద్ చౌధరి ఇచ్చిన పిలుపుతో వందలమంది పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్ నివాసం ఎదుట గుమిగూడారు. అయతే, ఎవరైనా తమను అడ్డుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాము ఖాళీ చేతులతో వెళ్లేది లేదని ఇస్లామాబాద్ పోలీస్ చీఫ్ తేల్చి చెప్పారు. ఒకవేళ అరెస్టు చేస్తే మాత్రం నిరసనల్ని మరింత ఉద్ధృతం చేస్తామని పార్టీ శ్రేణులు చెప్పాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇమ్రాన్ తన పార్టీ శ్రేణులతో ప్రసంగిస్తున్నంత సేపూ పోలీసులు ఆయన నివాసం బయటే ఉండిపోయారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అందుబాటులో లేరని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఇదే అంశంపై ఇంటీరియర్ మంత్రి రానా సనావుల్లా మాట్లాడుతూ.. ఇమ్రాన్ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది తప్ప ప్రభుత్వం కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం