Ram Mandir: ప్రపంచంలోనే ఎత్తైన రామ మందిరం.. ఎక్కడో తెలుసా?
రామ భక్తులకు శుభవార్త. ప్రపంచంలోనే ఎత్తయిన రామమందిరాన్ని ఆస్ట్రేలియాలోని పెర్త్లో నిర్మించనున్నారు.
పెర్త్: అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాకారమై ప్రారంభానికి సిద్ధమైన వేళ రామభక్తులకు మరో శుభవార్త. ప్రపంచంలోనే అతి ఎత్తైన రామాలయం నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలోని పెర్త్లో దాదాపు 721 అడుగుల ఎత్తైన రామాలయాన్ని అంతర్జాతీయ శ్రీరామ్ వేదిక్ అండ్ కల్చరల్ ట్రస్ట్ నిర్మించనుంది. ఈ ఆలయ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.600 కోట్లు కాగా.. 150 ఎకరాల విస్తీర్ణంలో సకల హంగులతో నిర్మిస్తున్నారు. సంప్రదాయం కలగలిపి వినూత్నంగా ఆలయ ప్రాంగణంలో సుందరమైన భవనాలు, అధునాతన సదుపాయాలతో దీన్ని తీర్చిదిద్దనున్నట్లు ట్రస్ట్ డిప్యూటీ హెడ్ హరేంద్ర రాణా వెల్లడించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కమ్యూనిటీ కార్యకలాపాలతో కూడిన బహుముఖ కేంద్రంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఆలయ సముదాయంలో విభిన్న భవంతులతో పాటు రామాయణ సదన్ లైబ్రరీ, తులసీదాస్ హాల్, యోగా, ధ్యానం, వేద లెర్నింగ్ సెంటర్, మ్యూజియం వంటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు.
రెండో పెద్ద మతంగా హిందూయిజం
మరోవైపు, ఆస్ట్రేలియాలో హిందూమతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ABS) ప్రకారం.. క్రైస్తవ మతం తర్వాత ఆస్ట్రేలియాలో 3శాతం మంది ప్రజలు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆస్ట్రేలియాకు వలసల నేపథ్యంలో అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతంగానూ హిందూయిజం నిలిచిందని తెలిపింది. తొలిసారి హిందూ వలసదారులు 19వ శతాబ్దంలో ఆస్ట్రేలియాకు వచ్చినట్లు భావిస్తున్నారు. 1970ల నుంచి న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా.. ఇతర రాష్ట్రాలు, భూభాగాల కన్నా హిందూమతంతో మతపరమైన అనుబంధాన్ని ఎక్కువగా కలిగి ఉన్నట్లు ఏబీఎస్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
కరోనా వైరస్ (సార్స్కోవ్-2) జన్యు సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. -
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
గురుపత్వంత్పై హత్యాయత్నం వెనుక ‘రా’!
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. -
కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. -
పారిస్కూ పాకిన విద్యార్థుల ఆందోళనలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ రాజధాని పారిస్నూ కుదిపేస్తున్నాయి. సోమవారం సర్బాన్ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు నిర్వహించారు. -
ఇజ్రాయెల్కు ఐసీసీ వారెంట్ల గుబులు!
కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) గుబులు పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. -
40 రోజుల కాల్పుల విరమణ!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు తెర వెనక జరుపుతున్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఇజ్రాయెల్ తాజా ప్రతిపాదనను ఈ దేశాలు హమాస్కు పంపాయి!.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం