CBSE: ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు: కేంద్రం
నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు (CBSE) పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే విధంగా నేషనల్ కరికులమ్ ఫ్రేమ్వర్క్ (NCF)ను కేంద్ర విద్యాశాఖ రూపొందించింది. 11, 12 తరగతుల విద్యార్థులు తప్పనసరి రెండు భాషలను కచ్చితంగా అభ్యసించాలని, అందులో ఒకటి భారతీయ భాష ఉండాలని ఎన్సీఎఫ్లో కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ విధానానికి అనుగుణంగా 2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను రూపొందిస్తామని వెల్లడించింది.
Published : 24 Aug 2023 11:40 IST
Tags :