Ambati Rayudu: ఏపీలో అభివృద్ధి.. కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం: అంబటి రాయుడు

యువతకు ఉద్యోగాలు రావాలన్నా, ఏపీ అభివృద్ధి చెందాలన్నా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని మాజీ క్రికెటర్, జనసేన పార్టీ స్టార్ కాంపెయినర్ అంబటి రాయిడు (Ambati Rayudu) అన్నారు.

Published : 27 Apr 2024 15:53 IST

ఆంధ్రప్రదేశ్‌లో రాచరికం తరహా పాలన సాగుతోందని మాజీ క్రికెటర్, జనసేన పార్టీ స్టార్ కాంపెయినర్ అంబటి రాయిడు (Ambati Rayudu) అన్నారు. ఎన్డీయే కూటమి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలే కలవలేరని అలాంటి వారు ప్రజలకు ఏం మంచి చేస్తారని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని సూచించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.

Tags :

మరిన్ని