సజ్జల నన్ను ఘోరంగా అవమానించారు.. అందుకే వైకాపా నుంచి బయటకు వచ్చా: డొక్కా

వైకాపా తనను ఘోరంగా అవమానించినందునే ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరినట్టు డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు.

Published : 27 Apr 2024 16:41 IST

వైకాపా తనను ఘోరంగా అవమానించినందునే ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరినట్టు డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. తాడికొండ సీటు తనకు కేటాయిస్తామని చెప్పి చివరి నిమిషంలో సుచరితకు ఇచ్చారన్నారు. రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నేతలు ఎలాంటి హామీ ఇవ్వకపోగా తనను ఘోరంగా అవమానించారని ఆయన ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా అవమానించడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని డొక్కా తెలిపారు.

Tags :

మరిన్ని