Earthquake: రాజస్థాన్‌లో మూడు సార్లు కంపించిన భూమి.. భయంతో జనం పరుగులు

రాజస్థాన్‌లో ఈరోజు ఉదయం అరగంట వ్యవధిలో మూడు సార్లు భూమి (Earthquake) కంపించింది. భూప్రకంపనల వల్ల భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 4 గంటలకు తొలి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

Published : 21 Jul 2023 11:41 IST

రాజస్థాన్‌లో ఈరోజు ఉదయం అరగంట వ్యవధిలో మూడు సార్లు భూమి (Earthquake) కంపించింది. భూప్రకంపనల వల్ల భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 4 గంటలకు తొలి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 3.1 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. మరో 5 నిమిషాల వ్యవధిలోనే 3.4 తీవ్రతతో మూడో భూకంపం నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.

Tags :

మరిన్ని