Visakhapatnam: కేజీహెచ్లో వెలుగు చూస్తున్న అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు..!
తిరుపతి రుయా ఘటన మరువక ముందే విశాఖ కేజీహెచ్లోని అంబులెన్స్ మాఫియా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. కేజీహెచ్లో అంబులెన్స్ సిబ్బంది దాడి చేశారంటూ ఎస్.రాయవరానికి చెందిన రోగి బంధువులు ఆరోపించారు. తల్లిబిడ్డా ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటి వద్ద దిగబెట్టేందుకు అడగ్గా సిబ్బంది డబ్బులు ఆశిస్తూ దాడి చేశారని బంధువులు ఆరోపించారు. డిశ్చార్జి కాగితాలు సైతం దాచేసి వేధించారని ఆరోపించారు.
Published : 27 Apr 2022 11:54 IST
Tags :