News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 02(07-04-2023)

Updated : 07 Apr 2023 22:21 IST
1/29
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పోత్సవం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించారు. కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పోత్సవం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించారు.
2/29
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో దావత్‌ ఈ రంజాన్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటి కరీష్మా కపూర్‌ పాల్గొని సందడి చేశారు. నగరవాసులతో సెల్ఫీలు దిగి అలరించారు. హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో దావత్‌ ఈ రంజాన్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటి కరీష్మా కపూర్‌ పాల్గొని సందడి చేశారు. నగరవాసులతో సెల్ఫీలు దిగి అలరించారు.
3/29
4/29
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గానూ ఆస్కార్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌కు ఏప్రిల్ 9న సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదికలో సన్మానం చేయనున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ఈ మేరకు ఓ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్‌’. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు గానూ ఆస్కార్‌ అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌కు ఏప్రిల్ 9న సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదికలో సన్మానం చేయనున్నట్లు చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ఈ మేరకు ఓ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది.
5/29
వరంగల్‌ నిట్‌లో వసంతోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ పాల్గొని ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి..
వరంగల్‌ నిట్‌లో వసంతోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ పాల్గొని ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి..
6/29
ఆకట్టుకున్న విద్యార్థుల కళాఖండం.. ఆకట్టుకున్న విద్యార్థుల కళాఖండం..
7/29
జూబ్లీహిల్స్‌లోని నవోమి రెస్టారంట్‌లో ఫేస్‌ టు ఫేస్‌ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటి రేణు దేశాయ్‌ పాల్గొని ముచ్చటించారు. యువతులు ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. జూబ్లీహిల్స్‌లోని నవోమి రెస్టారంట్‌లో ఫేస్‌ టు ఫేస్‌ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటి రేణు దేశాయ్‌ పాల్గొని ముచ్చటించారు. యువతులు ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.
8/29
ఫేస్‌ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న యువతులు ఫేస్‌ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న యువతులు
9/29
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప.. ది రూల్‌’. ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఓ ఆసక్తికరమైన ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ‘హ్యాపీ బర్త్‌ డే ఐకాన్‌ స్టార్’ అని శుభాకాంక్షలు తెలిపింది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప.. ది రూల్‌’. ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఓ ఆసక్తికరమైన ఫొటోను చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ‘హ్యాపీ బర్త్‌ డే ఐకాన్‌ స్టార్’ అని శుభాకాంక్షలు తెలిపింది.
10/29
బాచుపల్లి నిజాంపేటలోని ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్‌లో సీనియర్‌ సిటిజెన్స్‌ కోసం ‘గోల్డెన్‌ ఏజ్‌ హెల్త్‌ ప్యాకేజీ’ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.. బాచుపల్లి నిజాంపేటలోని ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్‌లో సీనియర్‌ సిటిజెన్స్‌ కోసం ‘గోల్డెన్‌ ఏజ్‌ హెల్త్‌ ప్యాకేజీ’ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు..
11/29
ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌- తిరుపతిల మధ్య నడవనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌- తిరుపతిల మధ్య నడవనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు..
12/29
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ నటి శోభితా ధూళిపాళ ఈ సినిమాలో వనతి పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ ఫొటోను ట్వీట్‌ చేసింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చరిత్రాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ నటి శోభితా ధూళిపాళ ఈ సినిమాలో వనతి పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ ఫొటోను ట్వీట్‌ చేసింది.
13/29
అల్లరి నరేష్‌(Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమాలోని ‘అల్బెలా’ వీడియో పాటను ఏప్రిల్‌ 9న ఉదయం 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అల్లరి నరేష్‌(Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమాలోని ‘అల్బెలా’ వీడియో పాటను ఏప్రిల్‌ 9న ఉదయం 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
14/29
విజయ్‌ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘విడుతలై పార్ట్‌ 1’. ఈ సినిమా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’ గా రానుంది. సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్‌ 8న ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం ఏప్రిల్‌ 15న ప్రేక్షకుల మందుకు రానుంది. విజయ్‌ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తమిళంలో తెరకెక్కించిన చిత్రం ‘విడుతలై పార్ట్‌ 1’. ఈ సినిమా తెలుగులో ‘విడుదల పార్ట్ 1’ గా రానుంది. సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్‌ 8న ఉదయం 11.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం ఏప్రిల్‌ 15న ప్రేక్షకుల మందుకు రానుంది.
15/29
గోపీచంద్ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ సినిమాలోని ‘ఐ ఫోన్‌’ సాంగ్‌ను హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీలో లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం సందడి చేసింది. బ్యూటీ డింపుల్‌ ఇలా మెరిశారు. గోపీచంద్ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ సినిమాలోని ‘ఐ ఫోన్‌’ సాంగ్‌ను హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీలో లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం సందడి చేసింది. బ్యూటీ డింపుల్‌ ఇలా మెరిశారు.
16/29
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం ఎన్‌బీకే108(వర్కింగ్ టైటిల్‌) తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సాంగ్‌ కోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. ఈ సాంగ్ సెట్‌లో భాగంగా శేఖర్‌ మాస్టర్‌, అనిల్‌ రావిపూడి కలిసి దిగిన ఓ ఫొటోను చిత్రబృందం పంచుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం ఎన్‌బీకే108(వర్కింగ్ టైటిల్‌) తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా సినిమాలోని ఓ సాంగ్‌ కోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. ఈ సాంగ్ సెట్‌లో భాగంగా శేఖర్‌ మాస్టర్‌, అనిల్‌ రావిపూడి కలిసి దిగిన ఓ ఫొటోను చిత్రబృందం పంచుకుంది.
17/29
అల్లుఅర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప.. ది రూల్‌’. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది. అల్లుఅర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప.. ది రూల్‌’. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంది.
18/29
కమల్‌ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. తైవాన్‌ దేశంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా శంకర్‌ అక్కడ దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘బై.. బై.. తైపీ’ అని ఆయన ట్వీట్‌ చేశారు. కమల్‌ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. తైవాన్‌ దేశంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా శంకర్‌ అక్కడ దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘బై.. బై.. తైపీ’ అని ఆయన ట్వీట్‌ చేశారు.
19/29
హైదరాబాద్‌లోని కొత్తగూడ పాలపిట్ట సైక్లింగ్ పార్కులో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా హైదరాబాద్ ఆక్టివ్ మోబిలిటీ, హైదరాబాద్ సైక్లింగ్‌ రెవల్యూషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు సైక్లింగ్ నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను తీసుకుని తల్లితండ్రులు, ఔత్సాహికులు భారీగా వచ్చి పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కొత్తగూడ పాలపిట్ట సైక్లింగ్ పార్కులో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా హైదరాబాద్ ఆక్టివ్ మోబిలిటీ, హైదరాబాద్ సైక్లింగ్‌ రెవల్యూషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు సైక్లింగ్ నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను తీసుకుని తల్లితండ్రులు, ఔత్సాహికులు భారీగా వచ్చి పాల్గొన్నారు.
20/29
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ముందుగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ముందుగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.
21/29
సెలవుల నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. సెలవుల నేపథ్యంలో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి.
22/29
నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమలలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా  పాదయాత్రలో బాలయ్య లోకేశ్‌తో కలిసి నడిచారు. అడుగడుగునా ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలయ్య కార్యకర్తల్లో జోష్‌ పెంచారు. నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమలలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాదయాత్రలో బాలయ్య లోకేశ్‌తో కలిసి నడిచారు. అడుగడుగునా ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలయ్య కార్యకర్తల్లో జోష్‌ పెంచారు.
23/29
నెల్లూరు జిల్లా ములాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా ములాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
24/29
నానీ, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. మార్చి 30న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్స్‌ ఆఫీస్‌ వద్ద రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. రెండో వారం కూడా సినిమా జోష్‌ ఎక్కడా తగ్గడం లేదని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా తెలిపింది. నానీ, కీర్తి సురేశ్ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. మార్చి 30న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్స్‌ ఆఫీస్‌ వద్ద రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. రెండో వారం కూడా సినిమా జోష్‌ ఎక్కడా తగ్గడం లేదని చిత్రబృందం ట్విటర్‌ వేదికగా తెలిపింది.
25/29
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ప్రశాంత్‌ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ప్రశాంత్‌ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందించారు.
26/29
నటులు గోపీచంద్‌, అల్లరి నరేశ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి పూజానంతరం తీర్థప్రసాదాలు అందించారు. నటులు గోపీచంద్‌, అల్లరి నరేశ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికి పూజానంతరం తీర్థప్రసాదాలు అందించారు.
27/29
గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో ఏసుక్రీస్తు వేషధారణలో నాటకాన్ని ప్రదర్శించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో ఏసుక్రీస్తు వేషధారణలో నాటకాన్ని ప్రదర్శించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
28/29
అక్కినేని అఖిల్‌, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఏజెంట్‌’. అఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టును చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఏప్రిల్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని అఖిల్‌, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఏజెంట్‌’. అఖిల్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టును చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఏప్రిల్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
29/29
ఇండియా ట్రిప్‌లో ఉన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కుమార్తెతో కలిసి శుక్రవారం ముంబయిలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా ఆమె పంచుకున్నారు. ప్రియాంక తల్లి అయిన తర్వాత మొదటిసారి ఇండియాకు రావడం విశేషం.. ఇండియా ట్రిప్‌లో ఉన్న గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కుమార్తెతో కలిసి శుక్రవారం ముంబయిలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా ఆమె పంచుకున్నారు. ప్రియాంక తల్లి అయిన తర్వాత మొదటిసారి ఇండియాకు రావడం విశేషం..

మరిన్ని