News in images : చిత్రం చెప్పే సంగతులు(02-03-2024/1)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 02 Mar 2024 14:25 IST
1/11
ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో శనివారం సాయిబాబా మందిరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో అభిషేకాలు, అర్చనలు, కాగడ హారతి వంటి పూజలు చేసి సాయిబాబా విగ్రహాన్ని పలు రకాల పూలతో అలంకరించారు.
2/11
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న అతిపెద్ద చెరువుల్లో ధర్మవరం చెరువు ఒకటి. రెండు వేల ఎకరాల విస్తీర్ణంతో ఈ చెరువును రాయల కాలంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని కింద రెండు వేల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. వర్షాధారంతోపాటు గత ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలతో ఈ చెరువుని నింపేవారు.
3/11
వరంగల్ జిల్లా నెక్కొండ నుంచి నర్సంపేటకు వెళ్లే మార్గంలో అమీన్పేట సమీపంలో గతంలో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. వసంత రుతువు సమీపిస్తుండడంతో ఓ చెట్టు ఆకులన్నీ రాలిపోగా.. చెట్టు నిండా కాసిన పసుపు వర్ణం కాయలు పత్రాలను తలపిస్తూ కనువిందు చేస్తున్నాయి.
4/11
మార్చి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఇది గమనించిన మొక్కల ప్రేమికులు ఓ ఉపాయం ఆలోచించారు. పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఇంటిముందు పెంచిన మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు మొక్కలపై వస్త్రాన్ని కప్పి నీళ్లు జల్లుతున్నారు. దీంతో అవి ఎండల అపాయం నుంచి తప్పించుకొని ఏపుగా పెరుగుతున్నాయి.
5/11
ఇదేంటి ట్రాక్టర్ ట్రాలీని చీరతో సింగారించారనుకోకండి. ఇసుక గాలికి ఎగిరి వాహనదారులపై పడకుండా ఇలా కట్టారంతే. జాతీయ రహదారిపై ఎర్రవల్లి వైపు ఇసుకలోడుతో వెళ్తున్న ట్రాక్టర్లలో ఒక దానికి ఇలా కన్పించింది. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరగా పలువురు చర్చించుకోవడం విన్పించింది.
6/11
భారత- మలేసియా దేశాల మధ్య ‘సముద్ర లక్ష్మణ’ పేరిట విశాఖపట్నం తీరంలో ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు ప్రారంభమైనట్టు నేవీ వర్గాలు తెలిపాయి. గత నెల 28 నుంచి ఈనెల 2వ తేదీ వరకు హార్బర్ విన్యాసాలు జరుగుతున్నాయని, భారత్కు చెందిన ఐఎన్ఎస్ కిల్తాన్, రాయల్ మలేసియాకు చెందిన కేడీ.లెకిర్ నౌకలు సంయుక్తంగా పాల్గొన్నాయని స్పష్టం చేశాయి.
7/11
ఉచిత విద్యుత్తుకు సంబంధించి గృహజ్యోతి పథకం అమలు మొదలైంది. ఈ సందర్భంగా మింట్ కాంపౌండ్ ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆవరణలో బల్బు నమూనాతో ఏర్పాటు చేసిన కటౌట్ ఆకట్టుకుంటోంది.
8/11
నిలోఫర్ ఆసుపత్రి పాతభవనం కొత్తరూపు సంతరించుకుంది. భవనం నిర్మించి పాతికేళ్లు దాటడంతో దానికి ఇబ్బందులు కలగకుండా ఇనుముతో నిర్మాణాన్ని చేపట్టారు. కార్పొరేట్ ఆసుపత్రిలా ముందుభాగాన్ని తీర్చిదిద్దారు. నూతనంగా మరో అంతస్తు నిర్మించారు. రోగులకు అనుకూలంగా ఉండేందుకు పాదచారుల వంతెన ఏర్పాటుచేశారు.
9/11
బెంగళూరులో పేలుళ్ల నేపథ్యంలో నగరంలో పోలీసులు అప్రమత్తమైనా.. రద్దీపరంగా కీలకమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్ బస్స్టేషన్లలో మాత్రం భద్రత వెలవెలబోతూ కనిపించింది.
10/11
పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలతో మహారాష్ట్రలోని అమరావతి ప్రాంత రామ్మేఘ ఇంజినీరింగ్ కళాశాల పరిశోధకులు సీసీ రోడ్లు నిర్మించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువకాలం మన్నిక ఉండేలా రూపొందిన ఈ పరిశోధనకు భారత ప్రభుత్వం నుంచి పేటెంటు హక్కు లభించింది.
11/11
మానవ మనుగడకు మూలాధారమైన పచ్చని చెట్లపై ట్రాన్స్కో సిబ్బంది వేటు వేస్తున్నారు. విద్యుత్తు తీగలకు తాకుతున్నాయంటూ తరచూ పాదబాటలపై ఉన్న చెట్ల కొమ్మలను నరికేస్తున్నారు. గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని ప్రధాన రహదారి పక్కన ఓ కంపెనీ ముందున్న మర్రి చెట్టు కొమ్మలను పూర్తిగా నరికేసీనతీరు పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు