TSPSC Group 4 Results: గ్రూప్- 4 పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష ఫలితాలు వచ్చేశాయి.
TSPSC Group 4 Results | హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు (TSPSC Group 4 Results) విడుదలయ్యాయి. అభ్యర్థుల ర్యాంకుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) శుక్రవారం రాత్రి వెల్లడించింది. అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో ర్యాంకులు చూసుకోవాలని TSPSC సూచించింది. ధ్రువపత్రాల వెరిఫికేషన్కు ఎంపికైన వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. తెలంగాణలో గ్రూప్-4 సర్వీసుల్లో 8,180 పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) గతేడాది జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 80శాతం మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
ర్యాంకుల జాబితా కోసం క్లిక్ చేయండి
జాబితాలో మొత్తం 726837 మంది అభ్యర్థుల ర్యాంకులు ఉన్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. కమిషన్ నిబంధనలు ఆధారంగా జాబితా రూపొందించినట్లు పేర్కొంది. తిరస్కరణకు గురైనవారి వివరాలను ర్యాకింగ్స్లో చేర్చనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తం 300 మార్కులకు అత్యధికంగా 220.458 మార్కులతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థి ప్రథమస్థానంలో నిలిచారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.