Health tip: స్తంభన సమస్యా..? వీటితో చెక్ పెట్టండి!
స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజ పప్పులు, మసాలాలు, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం,
స్తంభన లోపాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజ పప్పులు, మసాలాలు, చేపలు, రొయ్యల వంటి సముద్ర ఆహారం, ఆలివ్ నూనె ప్రధానంగా ఉండేలా చూసుకోండి. పాలు, పాల పదార్థాలు, గుడ్లు, ఛీజ్ మితంగా.. మాంసం అరుదుగా తినండి. మిఠాయిలు, తీపి పానీయాలు, ప్యాకెట్లలో అమ్మే మాంసం ఉత్పత్తుల జోలికి అసలే వెళ్లకండి. మధ్యధరా సముద్రం చుట్టుపక్కల దేశాల్లో ఒకప్పుడు తినే ఇలాంటి ఆహార పద్ధతితో పురుషుల్లో స్తంభన లోపం తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఏథెన్స్ అధ్యయనం పేర్కొంటోంది. మధ్యవయసులో అధిక రక్తపోటు, స్తంభన లోపంతో బాధపడేవారికిది బాగా ఉపయోగపడుతుండటం విశేషం. ఈ ఆహార పద్ధతి రక్తనాళాల పనితీరును మెరుగు పరచటం, టెస్టోస్టీరాన్ తగ్గకుండా చూడటం ద్వారా మేలు చేస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయులు మాత్రమే కాదు.. వ్యాయామ సామర్థ్యమూ ఇనుమడిస్తున్నట్టు తేలింది. ఆహార నియమాలతో పాటు ఉప్పు తగ్గించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిదనీ పరిశోధకులు సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం