స్వగృహ కథ.. మళ్లీ మొదటికి!
క్లస్టర్లుగా ఈ-వేలానికి ముందుకు రాని వైనం
ఫ్లాట్ల వారీగా విక్రయిస్తే ప్రయోజనం
ఈనాడు, హైదరాబాద్: నాగోల్ సమీపంలోని బండ్లగూడ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ఈవేలం కథ మళ్లీ మొదటికి వచ్చింది. క్లస్టర్ల వారీగా వీటిని విక్రయించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఈ-వేలానికి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదరపు అడుగుకు రూ.2500 వరకు ఆప్సెట్ ధరను నిర్ణయించింది. గురువారం ఈ-వేలం నిర్వహించగా...నిర్ణీత సమయం ముగిసే వరకు ఏ సంస్థ కూడా వేలం ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో హెచ్ఎండీఏకు నిరాశే ఎదురైంది. ఇటీవల బహదూర్పల్లి, తొర్రూర్లో రాజీవ్ స్వగృహ లేఅవుట్లలో ప్లాట్ల విక్రయానికి కొనుగోలు దారుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ రెండు లేఅవుట్లలోని భూములను ప్లాట్ల వారీగా ఈ-వేలం వేయగా...ప్రభుత్వానికి రూ.325 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. ఇదే విధమైన డిమాండ్ రాజీవ్ స్వగృహ ఇళ్లకు ఉంటుందని అధికారులు తొలుత యోచించారు. అయితే ఫలితం అందుకు భిన్నంగా రావడంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.
ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించినా..
బండ్లగూడలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలో 15 క్లస్టర్లలో 2500 ఫ్లాట్లను నిర్మించింది. వీటిని ఎప్పటికప్పుడు విక్రయించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొనుగోలుదారుల నుంచి పెద్దగా స్పందన ఉండటం లేదు. తాజాగా ఈ-వేలం వేయాలని నిర్ణయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అన్ని మౌలిక వసతులతోపాటు నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు, డెవలపర్లు ఈ ఫ్లాట్ల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ మేరకు ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించి అన్ని వివరాలు తెలిపినప్పటికీ స్పందన రాకపోవడంతో గమనార్హం. ముఖ్యంగా క్లస్టర్ల వారీగా ఈవేలం ప్రక్రియ చేపట్టడం వల్లే ఎవరూ ఆసక్తి చూపలేదని అంటున్నారు. మధ్యతరగతి జనం ఈ ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తితో ఉన్నప్పటికీ క్లస్టర్ల విధానం వల్ల వీలు కాలేదని అంటున్నారు. ఒక్కో క్లస్టర్లో 70-90 ఫ్లాట్లు ఉన్నాయి. స్థిరాస్తి సంస్థలు, డెవలపర్లు తప్పా...ఇతరులు కొనేందుకు ఆస్కారం లేదు. ఇకముందు ఫ్లాట్ల వారీగా వేలం వేస్తే...ఎలా ఉంటుందనే విషయమై అధికారులు యోచన చేస్తున్నారు. కాగా ఖమ్మంలోని రాజీవ్స్వగృహ ఫ్లాట్ల ఈ-వేలానికి ఇదే పరిస్థితి ఎదురైంది. అక్కడ కూడా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్తో మ్యాచ్కు వర్షం అడ్డంకి.. భారత్ రెండు వికెట్లు డౌన్
-
Business News
Gold: దిగుమతి సుంకం ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.1310 పెరిగిన బంగారం ధర
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Revanth Reddy: ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?: సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
-
Politics News
Telangana News: భాజపా, కాంగ్రెస్ శ్రేణులపై లాఠీఛార్జి.. హనుమకొండలో ఉద్రిక్తత
-
Business News
Hero motocorp: ‘హీరో’ ట్రేడ్ మార్క్ వ్యవహారం.. హీరో మోటోకార్ప్కు ఊరట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..