Pawan Kalyan: కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి: పవన్ కల్యాణ్
వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్ ఇవాళ
అనంతపురం: వైకాపా పాలనలో రాష్ట్రంలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టిన పవన్ ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించారు. కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందజేసిన తర్వాత మన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు.
‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అనేక బాధలు పడుతున్నారు. కౌలు రైతులు అప్పుల పాలవుతున్నారు. వారి కష్టం కళ్లారా చూశా. మరో దారి లేకపోతేనే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే. ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతూనే ఉంటుంది. రైతు కష్టం తెలుసుగనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నా. కౌలు రైతుల కష్టాలను పంచుకుంటాం. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాం. పరామర్శకు వస్తున్నానని తెలిసి రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారు. రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. వారి బాధ్యత తీసుకుంటాం. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టి ఏడుస్తుంటే... ఏసీ గదుల్లో కూర్చుని బతకాలంటే చాలా తప్పు చేసినట్టు అవుతుంది. చనిపోయిన కౌలు రైతుల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. ఆ నిధి ప్రభుత్వంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడే.. ఈ క్షణమే ఏర్పాటు చేస్తున్నాం. సంక్షేమ నిధిలో సగం డబ్బు నేనిస్తాను, మిగిలిన సగం మా పార్టీ నేతలు ఇస్తామని మాట ఇచ్చారు.
కౌలు రైతుల ఆత్మహత్యలను రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు తొలుత మా దృష్టికి తీసుకొచ్చారు. ఎంతమంది చనిపోయారని మేం ఆర్టీఐ ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్నాం. జనసేన కార్యకర్తల ద్వారా పూర్తి వివరాలు సేకరించాం. వీటన్నింటినీ క్రోడీకరించాం. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులు ఎంతమంది చనిపోయారు అంటే.. ఆ జాబితా జనసేన వద్ద ఉంది. ప్రభుత్వం వద్ద కూడా లేదు. అధికారంలోకి వస్తే మీ కన్నీరు తుడుస్తాం. నన్ను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే.. జగన్ను సీబీఐ దత్తపుత్రుడు అంటాం. వైకాపా నాయకులు చాలా మందిని సీబీఐ ప్రేమగా దత్తత తీసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేం ఎవరికీ బీ టీమ్ కాదు.. ఇంకోసారి అలా అంటే చర్లపల్లి షటిల్ టీమ్ అనాల్సి వస్తుంది. నేను ఎవరికీ భయపడను. నాకు స్వార్థం లేదు’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..