వేయిపూలు వికసించనీ...
పరమాత్మ సృష్టి చాలా విచిత్రమైంది. సముద్రాలు, నదులు, పర్వతాలు, పచ్చని చెట్టు చేమలతో అనంత వైవిధ్యంతో అందమైన సృష్టి. కోట్ల జీవరాశులు. విభిన్న గుణాలు కలిగిన జంతుజాలం.
పరమాత్మ సృష్టి చాలా విచిత్రమైంది. సముద్రాలు, నదులు, పర్వతాలు, పచ్చని చెట్టు చేమలతో అనంత వైవిధ్యంతో అందమైన సృష్టి. కోట్ల జీవరాశులు. విభిన్న గుణాలు కలిగిన జంతుజాలం. మనిషికి హాని చేసేవేగాక మేలు చేసే జంతువులు, కీటకాలు. ఆకాశంలో విహరిస్తూ చెట్లపై నివసిస్తూ భిన్న స్వరాలు వినిపించే పక్షులు. చిన్న గడ్డిపోచ నుంచి పెద్ద వటవృక్షం వరకు నాలుగు లక్షల రకాల చెట్లు భూమ్మీద పెరుగుతున్నాయని వృక్ష శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పూలుపూస్తూ, పళ్లనిస్తూ మానవ జాతికి మహోపకారం చేస్తున్నాయి ఈ వృక్షాలు.
భగవంతుడి సృష్టిలో భారతావని మహోన్నతమైన నేలగా మన రుషులు కొనియాడారు. సృష్టిలోని వైచిత్రిలాగే ఈ భారత భూమిలోనూ గొప్ప వైవిధ్యం అబ్బురపరుస్తుంది. సహజ సిద్ధమైన ఎల్లలతో ఏర్పడింది భారతదేశం. ప్రకృతిలో ఔన్నత్యానికి, ధైర్యానికి సంకేతం పర్వతం. గాంభీర్యానికి, ఆర్ద్రతకు ప్రతిబింబం సముద్రం. ఒకవైపున ప్రపంచంలోకెల్లా ఎత్తయిన హిమాలయాలు, మూడు వైపులా సముద్రాలు హద్దులుగా ఉండి ఈ దేశ భౌగోళిక సమైక్యతను చాటి చెబుతున్నాయి. దేశంలో ఒక వైపున ఎడారి, భూభాగం మధ్య పీఠభూములు, మైదానాలు, నదీపరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఈ దేశంలో విభిన్న జాతులు, మతాల వారు, పలు భాషలు మాట్లాడేవారు ఉన్నారు. విభిన్న సంస్కృతులకు, సంప్రదాయాలకు చక్కని తార్కాణంగా భారతదేశం నిలుస్తోంది. అనేకత్వంలోని ఏకత్వానికి నిదర్శనంగా పూసల్లో దారంలా అంతర్లీనంగా సాంస్కృతిక సమైక్యత నెలకొని ఉంది. వివిధ ప్రాంతాల మనుషుల శరీర నిర్మాణం భిన్నంగా ఉండి జాతుల వైవిధ్యమూ ఏర్పడిందని మానవ శరీర శాస్త్రజ్ఞులంటున్నారు.
వేదకాలం నుంచి నేటి వరకు ఈ నేలమీద ఎన్నో సిద్ధాంతాలు, భావనలు ఆవిర్భవించాయి. వేదధర్మం ప్రసిద్ధంగా వ్యాప్తిలో ఉండగానే జైన బౌద్ధాలు, నాస్తిక దర్శనమైన చార్వాకం మనుగడ సాగించాయి. ఇవి నేటికీ నిలిచే ఉన్నాయి. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, వీరశైవం, శాక్తేయం, రాధాకృష్ణతత్వం, కృష్ణచైతన్య సంప్రదాయం- ఇంకా ఎన్నో తాత్విక చింతనాశాఖలు భారతీయ ఆధ్యాత్మిక రంగాన్ని సుసంపన్నం చేశాయి. గౌతమబుద్ధుణ్ని మొదట అవహేళన చేసివారే తరవాత ఆయన శిష్యులయ్యారు. ఆదిశంకరులు ఇతర ఆధ్యాత్మికవేత్తలతో వాదనలు సాగించి తన ధర్మాన్ని ప్రతిష్ఠించారు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు సామాజిక సంస్కరణలకు దోహదం చేశాయి.
పరాయి గడ్డపై వేళ్లూనుకొన్న మతాలూ దేశంలో వ్యాపించాయి. చారిత్రక సామాజిక కారణాలవల్ల ఈ దేశవాసులు ఆయా ధర్మాలను స్వీకరించారు. ఈ ధర్మబాహుళ్యం ఆధ్యాత్మిక సమైక్యతకు చిహ్నమైంది. జాతీయోద్యమంలో విభిన్న మతాల వారూ దేశ విముక్తి కోసం పోరాడారు. వేదాలు, ఉపనిషత్తుల కాలం నుంచి నిర్మాణాత్మకమైన ధార్మిక చర్చలు భరత ఖండంలో జరుగుతూనే ఉన్నాయి. భారతీయుల సహనశీలత వల్లనే ఎన్నో మతాలు, దర్శనాలు, ధర్మాలు ఇక్కడ నిలదొక్కుకోగలిగాయి. ‘క్షమయా ధరిత్రి’ అని చెప్పినవారు భారతీయ రుషులే. భూదేవి మనందరినీ భరిస్తోంది. ‘సహనమే సంస్కృతి’ అన్నారు రాధాకృష్ణన్. సహనం, క్షమాగుణం భారతీయ సంస్కృతి వైశిష్ట్యం. ఒకరికి తన అభిప్రాయం వ్యక్తం చేయడానికి హక్కు ఉన్నట్టుగానే ఇతరుల మాటల్ని వినడం, వారి మనోభిప్రాయాన్ని మన్నించడం కర్తవ్యం, విజ్ఞత. ఎవరి విశ్వాసాలకు అనుగుణంగా వారు బతుకుతూ, ఇతరుల జీవన వైఖరుల్నీ సహించగలగడం భారతీయ సంస్కారం. జాతీయ సమైక్యతకు ప్రోదిచేసే ఆచరణాత్మక దృక్పథం అదే.
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి