PM Modi: విధ్వంసకర వినియోగం ఆపుదాం
తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దీన్ని ప్రపంచ కార్యక్రమంగా
పర్యావరణ అనుకూల జీవనశైలిని అలవర్చుకుందాం
‘పారిస్ సదస్సు’ స్ఫూర్తితో భారత్ మున్ముందుకు
‘కాప్26’ సదస్సులో ప్రధాని మోదీ
గ్లాస్గో: తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దీన్ని ప్రపంచ కార్యక్రమంగా మార్చాలని సూచించారు. సోమవారం ఆయన గ్లాస్గోలో ‘కాప్26’ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలను, ఈ విషయంలో దేశ వైఖరిని ఆయన విస్పష్టం చేశారు.
‘‘నా దృష్టిలో పారిస్ వాతావరణ సదస్సు ఒక శిఖరాగ్ర సమావేశం కాదు. అదొక అంకితభావం. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మనసా, వాచా, కర్మనా ఆచరిస్తున్న భారీ ఆర్థిక వ్యవస్థ భారత్ మాత్రమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. పుడమి జనాభాలో 17% ఉన్న భారత్ది మొత్తం ఉద్గారాల్లో 5% వాటా మాత్రమేనని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల మనుగడకు వాతావరణ మార్పులు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. సవాళ్లు విసురుతున్నాయి. ఈ మార్పుల ప్రభావాలను నియంత్రించడంలో భారత్ శక్తికి మించి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరిస్తూనే ఉంది. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుంటూనే మా దేశం విధానాలను రూపొందించుకుంటోంది. 2030 నాటికి శూన్య ఉద్గార స్థాయికి చేరుకోవాలని భారతీయ రైల్వే సంకల్పించింది. అప్పటికి కార్బన్ ఉద్గారాలను 1 బిలియన్ టన్నుల మేర తగ్గిస్తాం. 2070 నాటికి భారత్ సున్నా ఉద్గారాల స్థాయిని అందుకుంటుంది. ఆ దిశగా శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధన వాడకాన్ని పెంచుతున్నాం. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీలేవీ ఇంతవరకూ నెరవేరలేదు. ఈ విషయంలో విఫలమైన దేశాలపై ఒత్తిడి తేవాల్సిన తరుణమిది. భూతాపాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వీలైనంత త్వరగా లక్ష కోట్ల డాలర్ల నిధులను సమకూర్చాలి’’ అని మోదీ పేర్కొన్నారు.
వాతావరణ సదస్సు వేదిక వద్ద బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఐక్యరాజ్య సమితి
సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్తో మోదీ మాటామంతీ
సర్దుబాటు చర్యలకు ప్రాముఖ్యత
అంతర్జాతీయ చర్చల్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవనాన్ని సర్దుబాటు చేసుకోవడానికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రధాని మోదీ మరో కార్యక్రమంలో తెలిపారు. విపత్తుల అనంతరం ఉపశమనానికి తీసుకునే చర్యల స్థాయిలో దానిపై దృష్టి పెట్టడంలేదని ఆక్షేపించారు. దీనివల్ల దుర్బల దేశాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ‘‘ప్రకృతికి హాని తలపెట్టని రీతిలో జీవనాన్ని సాగించే సంప్రదాయ పద్ధతిపై అనేక జాతులకు మంచి అవగాహన ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే మన విధానాల్లో ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఉండాలి. ఆ విజ్ఞానం భవిష్యత్ తరాలకు అందాలి. పాఠశాలల్లో పాఠ్యాంశంగా వాటిని బోధించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువగా సుమారు పది నిమిషాలు మాట్లాడిన మోదీ... ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమాపణలు కోరారు.
మోదీ-జాన్సన్ భేటీ
కాప్26 సదస్సు వేదిక వద్ద మోదీ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భేటీ అయ్యారు. హరిత హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనాలు, శుద్ధ పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగం వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది మే నెలలో రెండు దేశాల నేతలు నిర్వహించిన వర్చువల్ శిఖరాగ్ర సదస్సులో ఈ అంశంపై అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిధుల సమీకరణ (క్లైమేట్ ఫైనాన్స్), పునరుత్పాదక ఇంధనాలు, అంతర్జాతీయ సౌర సంకీర్ణం (ఐఎస్ఏ), విపత్తులను తట్టుకొనే మౌలిక వసతుల సంకీర్ణం (సీడీఆర్ఐ) వంటి సంయుక్త కార్యక్రమాలపై బ్రిటన్తో కలిసి పనిచేస్తామని మోదీ చెప్పారు. భారత్ను సందర్శించాల్సిందిగా జాన్సన్ను మోదీ ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతల మధ్య ప్రత్యక్ష భేటీ జరగడం ఇదే మొదటిసారి.
ఇండియా గ్రీన్ గ్యారంటీ
భారత్లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 75 కోట్ల పౌండ్లను సమకూర్చుకునేందుకు బ్రిటన్ ‘ఇండియా గ్రీన్ గ్యారంటీ’ని ఇస్తుంది. దీనివల్ల శుద్ధ ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో పర్యావరణ అనుకూల, దృఢ మౌలిక వసతులకు నిధులు లభిస్తాయి. దీనికితోడు ప్రైవేటు మౌలిక వసతుల అభివృద్ధి బృందం (పీఐడీజీ) ద్వారా వర్ధమాన దేశాల్లో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు 21 కోట్ల డాలర్ల పెట్టుబడులకూ బ్రిటన్ సమ్మతించింది. దీనికింద భారత్లో విద్యుత్ వాహనాల ప్రాజెక్టులకూ నిధులు అందుతాయి.
ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
ఐరాస వాతావరణ సదస్సు ‘కాప్26’లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్ నుంచి సోమవారం ఉదయం గ్లాస్గో చేరుకున్నారు. గ్లాస్గోలో స్కాట్లాండ్ బ్యాగ్పైపర్లు బాణీలను ఆలపిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో భారత సంతతి ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. గ్లాస్గో, ఎడిన్బరోకు చెందిన భారత సంతతి ప్రతినిధులు మోదీతో భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ తన శిలా ప్రతిమను ఆవిష్కరించారు. హకీం అనే ప్రవాస భారతీయ వైద్యుడు దీన్ని ప్రధానికి బహుకరించారు. ఈ విగ్రహానికి పెట్టడం కోసం ప్రధాని తన కళ్లద్దాలను ఇచ్చారు. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్ నిర్వహించిన ‘ఎర్త్ షార్ట్ ప్రైజ్’ విజేత, దిల్లీకి చెందిన రీసైక్లింగ్ సంస్థ టకాచార్ వ్యవస్థాపకుడు విద్యుత్ మోహన్, సౌర శక్తితో నడిచే ఇస్త్రీ బండిని రూపొందించిన 14 ఏళ్ల తమిళనాడు బాలిక వినిషా ఉమాశంకర్లను కలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?