జడ్జీలపై దాడులను అడ్డుకోవాలి
న్యాయాధికారులు, న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో....
భౌతికంగా, సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతున్న దారుణాలు
ఇవి ప్రేరేపితంలా కనిపిస్తున్నాయ్
రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వ్యాఖ్య
న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాలని పిలుపు
ఈనాడు, దిల్లీ: న్యాయాధికారులు, న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడి విజ్ఞాన్భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలోను, అంతకుముందు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘న్యాయాధికారులపై భౌతికదాడులు పెరిగిపోతున్నాయి. మరోవైపు మీడియాలో, మరీ ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థపైనా దాడి జరుగుతోంది. ఇవన్నీ ఎవరి ప్రాయోజికత్వంలోనో జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి’’ అని అన్నారు. వీటిని చట్టాలను అమలుచేసే వ్యవస్థలు, కేంద్ర సంస్థలు, న్యాయవాదులు అడ్డుకోవాలి అని కోరారు. ఏది మంచో, ఏది కాదో చెప్పడానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు అని, న్యాయవాదులు కూడా విస్తృత కుటుంబంలో భాగస్వాములేనని, వారు కోర్టుకు సహకరించాలని కోరారు.
సామాన్యుడికి మరింత చేరువ
దేశ పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలని జస్టిస్ రమణ ఆకాంక్షించారు. ‘‘న్యాయవ్యవస్థలో విస్తృతస్థాయిలో సంస్కరణలు తీసుకురావాలి. ఈ ఉద్దేశంతోనే నేను ‘భారతీయీకరణ’ అన్న పదాన్ని ప్రయోగిస్తున్నాను. ప్రస్తుతం మన దేశంలో కొనసాగుతున్న న్యాయవ్యవస్థ ఇప్పటికీ వలసపాలన గుణాన్నే కలిగి ఉంది. సామాజిక వాస్తవాలు, స్థానిక పరిస్థితులను అది పరిగణలోకి తీసుకోవడంలేదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వాదనలు, తీర్పుల్లో ఉపయోగించే భాష, అందులో ఇమిడి ఉన్న అధిక ఖర్చులు సామాన్యుడిని న్యాయవ్యవస్థకు దూరం చేస్తున్నాయి. అందువల్ల ధైర్యంగా కోర్టులను ఆశ్రయించే నమ్మకాన్ని ప్రజల్లో నెలకొల్పాల్సి ఉంది. కక్షిదారులు న్యాయప్రక్రియలో నేరుగా పాల్గొనప్పుడు మాత్రమే వ్యవస్థపై వారికి నమ్మకం ఏర్పడుతుంది. అనవసరమైన అడ్డంకులను తొలగించి మొత్తం న్యాయప్రక్రియను సరళీకృతం చేయాలి. స్థానిక భాషల వినియోగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డారు.
వారి అధికారాల్లో జోక్యం లేదు
రాజ్యాంగం పెట్టుకున్న నమ్మకాన్ని ఒక వ్యవస్థగా న్యాయస్థానాలు నిలబెట్టాయని జస్టిస్ రమణ అన్నారు. ‘‘కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు రాజ్యాంగం నిర్దేశించిన మార్గానికి అతీతంగా మళ్లితే అది న్యాయవ్యవస్థకు అదనపు భారంగా పరిణమిస్తుంది. న్యాయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాలు దృష్టిసారించాల్సిన విధిలేని పరిస్థితులు ఉత్పన్నమవుతుంటాయి. కొన్ని అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం వెనుక ఉద్దేశం కార్యనిర్వాహక వ్యవస్థను కదిలించడమే తప్ప దాని పరిధిలోకి జొరబడటంకాదు. రాజ్యాంగబద్ధంగా అవసరమైన ఇలాంటి జోక్యాన్ని అధికారాల ఆక్రమణగా అభివర్ణించడం పూర్తిగా అసంబద్ధం’’ అని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడం కేవలం న్యాయ వ్యవస్థ పని మాత్రమే కాదని; చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలకు కూడా బాధ్యత ఉందని అన్నారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య రాజ్యాంగపరమైన లక్ష్మణ రేఖ ఉందని, ఇది చాలా పవిత్రమైనదని అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని కార్యనిర్వాహక వ్యవస్థను కాస్త ముందుకు తోయడానికే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయే తప్ప వాటి అధికారాలను లాక్కోవడానికి కాదని అన్నారు.
పెండింగ్ కేసులు ఆందోళనకరం
కోర్టుల్లో ఏళ్లతరబడి కేసులు పెండింగ్లో ఉండడంపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కేవలం పోస్టు కార్డు ఆధారంగా పరిష్కారాలు చూపే న్యాయవ్యవస్థే మరోవైపు ఏళ్లతరబడి కొనసాగుతున్న కేసులకు సంక్లిష్టమైన కారణాలవల్ల పరిష్కారాలను చూపలేకపోతోంది. ఇలాంటి వాటికి పరిష్కారం ఎలా అన్నదే ఇప్పుడు ప్రశ్న. పెండింగ్ కేసులను తగ్గించడానికి సుప్రీంకోర్టులో సాంకేతికతను ఉపయోగించుకోవడం ప్రారంభించాం. కిందిస్థాయిలో ఇప్పుడున్న న్యాయాధికారుల ఖాళీలను భర్తీచేయాలి. మరిన్ని పోస్టులు సృష్టించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంటు ప్లీడర్లు, స్టాండింగ్ కౌన్సిళ్ల ఖాళీలను వేగంగా భర్తీచేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. కింది కోర్టుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించాలి’’ అని ప్రధానిని కోరారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్