TDP: ఒక్క రోజు అసెంబ్లీ భేటీ.. పలాయనవాదానికి నిదర్శనం
వైకాపా ప్రభుత్వం చట్ట సభలను అవమానిస్తోందని, 151 మంది ఎమ్మెల్యేలున్నా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందని తెదేపా శాసనసభాపక్ష సమావేశం దుయ్యబట్టింది. అసెంబ్లీ
151 మంది ఎమ్మెల్యేలున్నా.. ప్రతిపక్షాన్ని చూసి వైకాపాకు భయం
తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో నేతల మండిపాటు
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ప్రభుత్వం చట్ట సభలను అవమానిస్తోందని, 151 మంది ఎమ్మెల్యేలున్నా ప్రతిపక్షాన్ని చూసి భయపడుతోందని తెదేపా శాసనసభాపక్ష సమావేశం దుయ్యబట్టింది. అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహించడం సరికాదని, కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండు చేసింది. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో.. పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించినా తాము తగ్గించబోమంటూ రాష్ట్రప్రభుత్వం మొండిపట్టు పట్టడాన్ని నేతలు ఖండించారు.
* 2021లో ఇప్పటివరకూ అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజే జరిగాయి. నానాటికీ పనిదినాలు తగ్గడం దారుణం. మే 20న ఒక్క రోజు బడ్జెట్ సమావేశం జరగ్గా.. నవంబరు 19తో ఆరు నెలలు పూర్తవుతున్నందున అనివార్యంగా ఒక్కరోజు సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ప్రభుత్వ పలాయనవాదానికి నిదర్శనం.
* ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేస్తానని చెప్పారు. అది చేయకపోగా రెండున్నరేళ్లయినా పీఆర్సీనీ అమలు చేయలేదు. దీనిపై ఉద్యోగులు తమ నిరసన గళాన్ని వినిపించగానే.. ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులపై ప్రజలను రెచ్చగొట్టడం సిగ్గుచేటు.
* ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించిన విద్యుత్తుకు రూ.9వేల కోట్లు, సబ్సిడీల కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.16వేల కోట్లు కలిపి దాదాపు రూ.25 వేలకోట్లు బకాయిలు ఉండగా.. విద్యుత్తు పంపిణీ సంస్థలకు నష్టాలొచ్చాయనే సాకుతో ట్రూఅప్ పేరుతో విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడం దారుణం.
* స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు, ప్రతిపక్షాలపై పోలీసులతో ప్రభుత్వం దాడి చేయించడం, వారి అండతోనే దొంగ ఓట్లు వేయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
* ఎయిడెడ్ విద్యాసంస్థలపై కుట్రను నిరసిస్తూ విద్యార్థులు ప్రదర్శన చేసినా, మద్దతు ధర కావాలని రైతులు రోడ్లమీదకు వచ్చినా వారిపై పోలీసులతో దాడులు చేయించడాన్ని ఖండిస్తున్నాం.
* అమరావతి రైతులు.. మహిళల మహా పాదయాత్రను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులను ప్రయోగించడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనం. అమరావతి రైతుల న్యాయపోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాం.
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, చెత్తపై పన్ను, ఆర్థిక సంక్షోభం, ఏపీపీఎస్సీ రీ నోటిఫికేషన్, మాదకద్రవ్యాలకు అడ్డాగా ఏపీ మారడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, జీవో 217, మత్స్యకారుల సమస్యలు, గనుల సీనరేజి వసూలు ప్రైవేటుసంస్థలకు అప్పగింత, అగ్రిగోల్డ్ బాధితుల ఇబ్బందులు, వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, అమరావతి ఉద్యమం, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం వంటి అంశాలపై సమావేశం చర్చించింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?