Womens day: రాజధాని రుద్రమలు
వారంతా సాధారణ గ్రామీణ మహిళలు. కానీ... అసాధారణ పటిమతో రాజధాని అమరావతి పోరాటాన్ని కొనసాగించారు. చిన్న శిబిరంతో ప్రారంభించిన నిరసనను... ఎనిమిది వందల రోజులకు పైగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని..
అమరావతి ఉద్యమంలో అనితర పోరాటం
సుదీర్ఘ పాదయాత్రతో ఉద్యమ విస్తరణ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
వారంతా సాధారణ గ్రామీణ మహిళలు. కానీ... అసాధారణ పటిమతో రాజధాని అమరావతి పోరాటాన్ని కొనసాగించారు. చిన్న శిబిరంతో ప్రారంభించిన నిరసనను... ఎనిమిది వందల రోజులకు పైగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని... అది అమరావతే కావాలని స్పష్టం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో.. లక్ష్య సాధన దిశగా ముందడుగు వేశారు. నిరసనలు, పాదయాత్ర సందర్భంగా ఎదుర్కొన్న కష్టాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు-ఈటీవీ’కి వెల్లడించారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: ఐదు కోట్ల మంది ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం తమకు అన్నం పెడుతున్న నేలతల్లినిస్తే ఆ కన్నతల్లులకు మిగిలింది కన్నీరే. ఫలితంగా ఊరే దాటని ఆ మహిళలు... తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తడానికి ఊరూరా తిరిగారు. అడుగేస్తే అరెస్టు... కూర్చుంటే కేసు... ప్రశ్నిస్తే గృహ నిర్భందంతో ఎంత కట్టుదిట్టం చేసినా మొక్కవోని పటిమ చూపారు. 800 రోజులకుపైగా సాగుతున్న రాజధాని అమరావతి ఉద్యమంలో స్థానిక మహిళలు ఎదుర్కోని అకృత్యం, అరాచకం లేదు. కానీ... వీటన్నింటినీ పంటి బిగువన భరించి ఉద్యమాన్ని ముందుండి నడిపించి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. సత్య సంకల్పంతో, శాంతి మార్గంలో ఎల్లలు దాటిన వారి సుదీర్ఘ పోరాటానికి ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. ఆ స్పూర్తిని కొనసాగిస్తూ అమరావతిని రాజధానిగా కొనసాగించడం కాదు... రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించేదాకా మా ఉద్యమం కొనసాగిస్తామంటున్నారా ధీర వనితలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలతో ‘ఈనాడు-ఈటీవీ’ ‘రాజధాని రుద్రమలు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళలు తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.
అమ్మా...! నన్ను మర్చిపోయావా అన్నాడు
- రాయపాటి శైలజ, గుంటూరు
ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీదికి ఈడ్చడంతో అమరావతి ఉద్యమంలో భాగస్వామినయ్యా. 45 రోజుల పాదయాత్రలోనూ పాల్గొన్నా. నా ఇద్దరు పిల్లల్ని బంధువుల ఇంట్లో ఉంచా. ఇంటికి తిరిగొచ్చాక ‘అమ్మా నన్ను మర్చిపోయావా’ అని మా అబ్బాయి అడిగినప్పుడు... నా కళ్లలో నీళ్లు తిరిగాయి.
హేళన చేసిన వారే ముక్కున వేలేసుకున్నారు
- నాగమల్లేశ్వరి, మందడం
వీరా ఉద్యమం చేసేది... రెండు రోజుల్లో ముగిస్తారని హేళన చేసినవారే ముక్కున వేలేసుకునేలా చేశాం. ఏదైనా శుభకార్యానికి ఒంటరిగా వెళ్లడానికే వెనుకాడే మేము రాజధాని కోసం వేదికలెక్కి నిరసన తెలిపాం. గతంలో పోలీసులంటేనే ఎరగని మమ్మల్ని వైకాపా ప్రభుత్వం పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టింది.
మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు
- షేక్ మాలింబీ, రాయపూడి
ఉద్యమంలో పాల్గొన్నందుకు మమ్మల్ని ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. పోలీసులతో కొట్టించింది. మన పిల్లలు చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతూ... అక్కడ నానా అవస్థలు పడుతున్నారని భావించి రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చాం.
కుమారుడు అస్వస్థతకు గురైనా వెనుకాడలేదు
- కొమ్మినేని వరలక్ష్మి, మందడం
పది రోజుల్లో దీక్ష ముగుస్తుందనుకున్నా. వందల రోజులుగా సాగుతోంది. కన్న కుమారుడు అస్వస్థతకు గురై ఇంటికొచ్చిన మరుసటి రోజే నిరసనల్లో పాల్గొన్నా. పిల్లలకు గోరుముద్దలు తినిపించాల్సిన మా చేతులను లాఠీ దెబ్బలకు అడ్డుపెట్టాం. నువ్విచ్చింది ఎకరంన్నర భూమేగా నీకెందుకు ఉద్యమం అన్నారు. భూమి కోసం కాదు భావితరాల కోసం అని ఉద్యమంలో కొనసాగా.
ఉద్యమంలో ఉన్నామని వైద్యం చేయలేదు
-పులి సువార్త, ఉద్దండరాయునిపాలెం
ఉద్దండరాయునిపాలెంలో దీక్షా శిబిరం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి మాపై వేధింపులు, దాడులు పెరిగాయి. నా భర్తపై కొందరు దాడి చేస్తే కేసు పెట్టడానికి పోలీసు స్టేషన్కు వెళ్తే ఫిర్యాదు తీసుకోలేదు. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే పడక ఇవ్వలేదు. ‘పై నుంచి ఫోన్లు వస్తున్నాయి. వేరే ఆసుపత్రికి వెళ్లండి’ అని వైద్యం చేయకుండానే పంపించేశారు.
ఉన్న ఒక్క రాజధానిని అభివృద్ధి చేయండి
-కంచర్ల పార్వతీదేవి, వెలగపూడి
ఇప్పటికే ఉన్న ఒక్క రాజధానిని అభివృద్ధి చేయలేని ఈ ప్రభుత్వానికి మూడు రాజధానులెందుకు? మూడేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? ప్రభుత్వం ఇప్పటికీ నిర్దయగానే వ్యవహరిస్తోంది. మూడు రాజధానులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటనలు చేస్తోంది. ఇది హైకోర్టు తీర్పును అవహేళన చేసినట్లే. రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ అవసరం. అమరావతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యం.
రైతులకు కౌలు చెల్లించడం లేదు
- గోవిందమ్మ, తుళ్లూరు
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రాజధాని కోసం భూములిస్తే కౌలు చెల్లించకుండా వేధిస్తున్నారు. మా జీవనాధారమైన కౌలు గురించి అడగటానికి సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే భయానక వాతావరణం సృష్టించారు. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలతో విలసిల్లిన మా ప్రాంతంలో ఇప్పుడు పోలీసుల బూటు కాళ్ల చప్పుళ్లు వినిపిస్తున్నాయి.
నా భర్త ప్రోత్సాహంతోనే పోరాడుతున్నా
- ఎన్.పద్మావతి, తుళ్లూరు
నా భర్త ఇచ్చిన ధైర్యంతోనే పోరాడుతున్నా. న్యాయస్థానం, న్యాయమూర్తులు లేకుంటే మా భూములు నిజంగా శ్మశానంగానే మారేవి. మా మీద లేనిపోని ఆరోపణలు చేశారు. కోర్టు తీర్పు వాటన్నింటినీ కడిగేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్