CM Jagan: నా వెంట్రుక కూడా పీకలేరు
విద్యుత్ కోతలు, కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు, ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, కల్తీ సారా మరణాలు, వివేకా హత్యపై సీబీఐ విచారణలో వెలుగుచూస్తున్న అంశాలు, దూరమవుతున్న కుటుంబసభ్యులు,...
నంద్యాల సభలో.. జగన్ నోట కొడాలి నాని భాష
ప్రతిపక్షాలు, మీడియాపై సీఎం జగన్ ధ్వజం
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపాటు
వసతి దీవెన రెండో విడతగా రూ.1,024 కోట్లు జమ
రాష్ట్రంలో మంచి మార్పులతో పాలన జరుగుతున్నా చంద్రబాబు, ఆయన పార్టీ, ఆయన దత్తపుత్రుడు, ఆయనను సమర్థించే మీడియాకు ఇవేవీ కనిపించవు. రోజుకో కట్టుకథ, రోజుకో వక్రీకరణ, రోజుకో విధంగా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ అబద్ధాలు సరిపోవని పార్లమెంట్ను వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి బురద జల్లుతూ ప్రభుత్వ పరువు తీస్తున్న గొప్ప చరిత్ర వీళ్లది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా ఇలా ఎక్కడైనా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అవన్నీ ఏకమవుతాయి. ముఖ్యంగా పార్లమెంట్లో రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలని ఆరాటపడతారు. ఇక్కడ దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు, దౌర్భాగ్య మీడియా ఇవీ మన రాష్ట్రం చేసుకొన్న కర్మలు. మన రాష్ట్ర పరువును తాకట్టు పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా.. ఇన్ని సమస్యలు, కష్టాలు ఇవేవీ నన్ను కదిలించలేవు, నన్ను బెదిరించలేవు. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఉన్నంతకాలం వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు’
- నంద్యాల సభలో సీఎం జగన్
ఈనాడు డిజిటల్ - కర్నూలు
విద్యుత్ కోతలు, కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు, ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, కల్తీ సారా మరణాలు, వివేకా హత్యపై సీబీఐ విచారణలో వెలుగుచూస్తున్న అంశాలు, దూరమవుతున్న కుటుంబసభ్యులు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమస్యలతో సతమతమవుతున్న ముఖ్యమంత్రి తీవ్రమైన నిరాశా నిస్పృహలతో సహనం కోల్పోతున్నారు. ఈ విషయం శుక్రవారం నంద్యాల బహిరంగ సభలో స్పష్టమైంది. జగనన్న వసతి దీవెన పథకం నిధులు జమ చేసే కార్యక్రమం కోసం శుక్రవారం నంద్యాల వచ్చిన సీఎం జగన్ స్థానిక ఎస్పీజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలు, మీడియాపై తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఊగిపోయారు.
ఏదో ఒకరోజు గుండెపోటుతో టికెట్టు కొంటారు..
‘పిల్లలకు మంచి జరగాలని, భోజనం తర్వాత ‘చిక్కీ’ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ చిక్కీ పాకం పిల్లల చేతికంటి, వాళ్లు మళ్లీ ఆ చేతిని నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదేమోనని, ఆ చిక్కీకి మంచి కవర్ తొడిగి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పిల్లలకు పోషకాహారం ఇచ్చేంద]ుకు చంద్రబాబు హయాంలో ఖర్చు చేసింది కేవలం రూ.500 కోట్లు. ప్రస్తుత జగనన్న గోరుముద్దకు రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అవన్నీ వదిలేసి కేవలం చిక్కీ కవర్పై జగనన్న చిత్రం ఉందని మాత్రం వీళ్లందరూ రాస్తారు. ఈ అసూయ, కడుపు మంటకు మందే లేదు. అవి ఇంకా ఎక్కువైతే కచ్చితంగా వీళ్లందరికీ బీపీ వస్తుంది. కచ్చితంగా ఏదో ఒకరోజు గుండెపోటు వచ్చి టికెట్ కొంటారు. కాబట్టి అసూయను ఇప్పటికైనా తగ్గించుకోకపోతే ఆరోగ్యానికి చేటని ప్రతిపక్షానికి సలహా ఇస్తున్నా’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక కుటుంబంలో ఒకరికే పథకం పరిమితం కాదు
‘పేదరికంతో విద్యార్థులు ప్రాథమిక విద్య, ఉన్నత విద్యకు దూరమవకూడదు. బిడ్డల్ని చదివించడానికి ఏ తల్లిదండ్రీ అప్పులపాలవకూడదు. నా పాదయాత్రలో ఇలాంటి గాథలెన్నో విన్నా. అందుకే విద్యారంగంలో సంస్కరణలు తెచ్చి, సమూల మార్పులు చేశాం’ అని జగన్ అన్నారు.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేసి, పరిపాలనను ప్రజలకు మరింత చేరువలోకి తెస్తానని తొలిసారి నంద్యాలలోనే మాటిచ్చానన్నారు. దాన్ని నిలబెట్టుకొన్న తర్వాత తొలిగా నంద్యాలకే వచ్చానని చెప్పారు. ‘గతంలో వైఎస్సార్ హయాంలో పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ చూశాం. తర్వాత అందరూ ఆ పథకాన్ని నీరుగార్చారు. పేద పిల్లల చదువుల కోసం నాన్న ఒక అడుగు వేస్తే, నేను రెండడుగులు వేశాను. అందులో భాగంగానే ఫీజు రీఎంబర్స్మెంట్కు పూర్వ వైభవం తీసుకువచ్చాం. జగనన్న వసతి దీవెన పథకం 2021-22 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నగదును రాష్ట్రంలోని 10,68,150 మంది విద్యార్థులకు మేలు చేసేలా, 9,61,140 మంది తల్లుల ఖాతాల్లోకి రూ.1024 కోట్లు నేరుగా జమ చేశాం. ఒక కుటుంబంలో ఒకరికే పథకం పరిమితం చేయడం లేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరినీ చదివించండి. మీ అన్నగా మీకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. నాడు- నేడు’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. తొలిసారిగా ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చాం. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం వైపు అడుగులు వేశాం’ అని సీఎం తెలిపారు.
గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం
‘2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు బకాయిలు రూ.1,778 కోట్లను చంద్రబాబు వదిలేస్తే వాటిని కూడా కలిపి జగనన్న విద్యాదీవెన కింద రూ.6,969 కోట్లు ఇచ్చాం. జగనన్న వసతి దీవెన పథకంలో ఇప్పటి వరకు రూ.3,329 కోట్లు అందజేశాం. ఇదంతా పిల్లల కోసం వాళ్ల మేనమామగా నేను చేసిన ఖర్చు అని అక్కచెల్లెళ్లందరికీ చెబుతున్నా’ అని సీఎం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో విద్యారంగంలో డ్రాప్అవుట్లు గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారి సంఖ్యకు సంబంధించి జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 32.4 శాతం ఉంటే, ఏడాదిలో 35.2 శాతానికి చేరిందని చెప్పారు. ఆడపిల్లలకు సంబంధించి జీఈఆర్ జాతీయస్థాయిలో కేవలం 2.28 శాతం పెరిగితే, రాష్ట్రంలో 11.03 శాతం వృద్ధి నమోదవడం హర్షణీయమని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచే నంద్యాలలో సీపీఎం, సీపీఐ, వ్యవసాయ, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
ఇంతకు ముందూ నంద్యాలలోనే..
గతంలో ఉపఎన్నికల సమయంలో నంద్యాలలోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2017 ఆగస్టు 3న ఇదే ఎస్పీజీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా పర్వాలేదు’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై అప్పట్లో ఆయన ఎన్నికల సంఘానికి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత 8రోజులకే ఆగస్టు 11న మరోసారి రోడ్షోలో మాట్లాడుతూ ‘చంద్రబాబుకు కళ్లు నెత్తికెక్కాయి.. ఉరిశిక్ష వేసినా తప్పు లేదు’ అని జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్