CBI: వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారంటూ సీబీఐ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు (పీఏలు) రాఘవరెడ్డి, రమణారెడ్డి,
ఎంపీ అవినాష్రెడ్డి పీఏలను విచారించిన సీబీఐ అధికారులు
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారంటూ సీబీఐ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు (పీఏలు) రాఘవరెడ్డి, రమణారెడ్డి, అప్పటి సాక్షి పత్రిక జిల్లా విలేకరి బాలకృష్ణారెడ్డిని ఆరా తీశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా సమాచారం అందించారని రాఘవరెడ్డిని అడిగినట్లు తెలిసింది. ఎంపీ పీఏలు ఇద్దరిని మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్యకు వాడిన మారణాయుధాలను పడేసినట్లుగా అనుమానిస్తున్న రెండు ప్రాంతాల్లో వెలికితీత చర్యలను సీబీఐ అధికారులు మంగళవారం తాత్కాలికంగా నిలిపేశారు. పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహంలో సీబీఐ అధికారులు మంగళవారం 12 మందిని విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల పట్టణ సీఐగా పనిచేసిన శంకరయ్య, హోంగార్డు నాగభూషణంరెడ్డిని ప్రశ్నించారు. శంకరయ్య హత్యాస్థలంలో ఉండగానే రక్తపుమరకలు, ఇతర సాక్ష్యాధారాలను తుడిచేశారనే అభియోగాలపై ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన అనుమానితుల జాబితాలో ఈయన పేరుంది. వివేకా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన ఇనయతుల్లా, వివేకా పీఏ జగదీశ్వర్రెడ్డి తమ్ముడు ఉమాశంకర్రెడ్డి, చక్రాయపేట మండలానికి చెందిన వైకాపా నాయకులు ఆదిరెడ్డి, అంజిరెడ్డి, వేంపల్లె మండలానికి చెందిన చెన్నకేశవ, మల్లి, రహ్మతుల్లాఖాన్ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
జీతాలు ఎప్పుడు పడతాయో తెలియట్లేదని చెప్పినందుకు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణను సస్పెండ్ చేయడం సరికాదని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకాల కొండయ్య మండిపడ్డారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!