AP 3 Capitals: మూడు రాజధానుల చట్టాల ఉపసంహరణ.. జగన్నాటకం
రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు, వైకాపాపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల చట్టాలను....
వైకాపాపై వ్యతిరేకత నుంచి... ప్రజల దృష్టి మరల్చేందుకే
తెదేపా వ్యూహకమిటీ సమావేశంలో చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి తప్పించుకునేందుకు, వైకాపాపై ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు నాటకమాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప.. ఈ రెండున్నరేళ్లలో ఆ మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి పైసా అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ వ్యూహాత్మక కమిటీ సోమవారం సమావేశమైంది. అందులో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు మెజార్టీ స్థానాల్లో వైకాపాను గెలిపించారు. నేడు వరదలతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా.. పక్క రాష్ట్రాల్లో పెళ్లి విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు. ‘మహిళలపై అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్నారు’ అని చంద్రబాబు విమర్శించారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప.. ఆయన చేసింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
కమిటీ నిర్ణయాలు ఇలా...
రాజధానిపై సీఎం జగన్ వ్యవహార శైలితో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని తెదేపా వ్యూహ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ఉపాధి అవకాశాలు కోల్పోవడంతోపాటు... రాష్ట్ర ఆదాయానికి పెద్దయెత్తున గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలు, అవినీతి, వివేకా హత్య వ్యవహారం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్షనేతను లక్ష్యంగా చేసుకొని, వ్యక్తిత్వహననానికి దిగుతున్నారని అభిప్రాయపడింది. జగన్ ఉన్మాద చర్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంతో సీఎం విఫలమయ్యారని, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏరియల్ రివ్యూ చేసి చేతులు దులిపేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా అప్రమత్తం కాలేదని, ఫలితంగానే భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని విమర్శించింది.
ఓటీఎస్కు డబ్బు చెల్లించొద్దు
* వివిధ పథకాల కింద నిర్మించిన గృహాలకు సంబంధించిన రుణాల్ని ఓటీఎస్ కింద పేదలెవరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓటీఎస్ ద్వారా వైకాపా ప్రభుత్వం ఆదాయం పొందాలనుకోవడం దుర్మార్గపు చర్య. ఓటీఎస్ కింద పేద కుటుంబాలపై ఈ భారం పడకుండా అవగాహన కల్పించాలి.
* వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్టీజీఎస్ను సరిగా వినియోగించుకోలేదు. తెదేపా బృందాలు బాధితులకు అండగా నిలవాలి.
* స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన రూ.3,594 కోట్ల నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లించి దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధం. ఇది అధికార వికేంద్రీకరణకు గండి కొట్టడమే.
* మాజీ మంత్రి వివేకానందరెడ్డిని.. ఆయన అల్లుడే చంపించాడని కట్టుకథలు అల్లిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ దుర్మార్గాన్ని ఎండగట్టాలి.
* కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో వైకాపా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. కోరం(తగిన ఆధిక్యం) ఉన్నా ఎన్నిక నిలిపివేయడం దుర్మార్గం. సమావేశంలో శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాలవ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్