Movie Ticket Rates: అనిశ్చితి తొలగింది
సినిమా టికెట్ల ధరలపై అనిశ్చితికి శుభం కార్డు పడిందని... వారం, పది రోజుల్లోనే శుభవార్త వింటారని తెలుగు సినీ ప్రముఖులు ప్రకటించారు. సీఎం జగన్తో చాలా సుహృద్భావ, సానుకూల వాతావరణంలో చర్చలు
వారం, పది రోజుల్లోనే శుభవార్త వింటారు
సీఎంతో చర్చల అనంతరం సినీ ప్రముఖులు
ఈనాడు, అమరావతి: సినిమా టికెట్ల ధరలపై అనిశ్చితికి శుభం కార్డు పడిందని... వారం, పది రోజుల్లోనే శుభవార్త వింటారని తెలుగు సినీ ప్రముఖులు ప్రకటించారు. సీఎం జగన్తో చాలా సుహృద్భావ, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని వెల్లడించారు. గత అయిదారు నెలలుగా నెలకొన్న గందరగోళానికి ఉపశమనం లభించిందని వివరించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో భేటీ సందర్భంలోనూ, అది ముగిసిన తర్వాత సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు విలేకర్లతో మాట్లాడారు. చర్చలకు పిలిచినందుకు ముఖ్యమంత్రికి, త్వరితగతిన సమస్య పరిష్కారమయ్యేలా చొరవ చూపినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలని తెలిపారు. చర్చలకు మార్గం సుగమం చేశారంటూ మిగిలిన సినీ ప్రముఖులు చిరంజీవికి ధన్యవాదాలు చెప్పారు.
ఎవరెవరు ఏమన్నారో వారి మాటల్లోనే...
ఈ నెల మూడో వారంలోగా ఉత్తర్వులు
సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన అనిశ్చిత వాతావరణానికి శుభం కార్డు పడింది. దీనిపై కమిటీ తుది ముసాయిదా నివేదిక న్యాయబద్ధంగా ఉంది. సీఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ఈ నెల మూడో వారంలోగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తెలుగు సినిమాను, తెలుగుతనాన్ని కాపాడే దిశలో జగన్ ఉన్నారు. ఆయన పరిశ్రమ వైపు చల్లని చూపు చూడాలి. ప్రేక్షకులకు, పరిశ్రమకు లాభదాయకంగా, ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం తీసుకున్న నిర్ణయం సంతృప్తి కలిగించింది. చిన్న సినిమాలు రోజుకు అయిదు షోలు ప్రదర్శించుకునేందుకు ఆమోదం తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఇచ్చే వెసులుబాట్లపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపీలోనూ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, విశాఖపట్నంలో చిత్రీకరణలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలు చూశాక మాకు సంతృప్తి కలిగింది.
- చిరంజీవి
పరిశ్రమకు పెద్ద ఉపశమనం
అయిదారు నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ గందరగోళంలో ఉంది. ఈ రోజు పరిశ్రమకు పెద్ద ఉపశమనం లభించింది. సీఎంతో చర్చలు చాలా బాగా జరిగాయి. వారం, పది రోజుల్లో అందరూ శుభవార్త వింటారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్యనున్న గ్యాప్ ఈ తరహా చర్చల వల్ల తొలగిపోతుంది.
- మహేశ్బాబు
ఓర్పుగా విన్నారు
సినిమా పరిశ్రమ కష్టాలన్నీ సీఎంకు తెలుసు. ఎంతో ఓర్పుతో అందరి అభిప్రాయాలు విన్నారు. పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అగాథం ఉందనే భ్రమ ఇప్పటివరకూ ఉండేది. అది తొలగిపోయింది. ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యంతో చిరంజీవి ఇంత పెద్ద సమస్యను పరిష్కారం దిశగా తీసుకొచ్చారు. ఆయన పరిశ్రమ పెద్ద అన్న విషయాన్ని ఆయన చర్యలే నిరూపించాయి.
- ఎస్.ఎస్.రాజమౌళి
సానుకూలంగా చర్చలు
చర్చలు చాలా సానుకూలంగా జరిగాయి. అయిదారు నెలల నుంచి గందరగోళ స్థితిలో ఉన్నాం.
- ప్రభాస్
ఐసీయూలో రోగిలా చిన్న సినిమా పరిస్థితి
తెలుగు రాష్ట్రాల్లో సగటు సినిమా మనుగడే కష్టమైపోయింది. ఐసీయూలో రోగిలా చిన్న సినిమా పరిస్థితి తయారైపోయింది. భారీ సినిమాలు విడుదలైనప్పుడు అన్ని థియేటర్లలోనూ వాటినే ప్రదర్శిస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకట్లేదు. అడుక్కునే పరిస్థితి వచ్చింది. దాన్ని రక్షించాలని ముఖ్యమంత్రికి విన్నవించాం. తగిన చర్యలు తీసుకుంటామని, పరిశ్రమలోనూ అంతర్గతంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నంది అవార్డులపైనా ప్రభుత్వం దృష్టిసారించాలి. ప్రభుత్వం ఇకపై చర్చలకు పిలిచేటప్పుడు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్నూ ఆహ్వానించాలి.
- ఆర్.నారాయణ మూర్తి
పరిశ్రమకు మేలు చేస్తే గుండెల్లో నిలిచిపోతారు
గతంలో సినిమాలు 50, 100 రోజులు ఆడేవి. పరిశ్రమలో వేలమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. పరిశ్రమకు మంచిచేస్తే వారి గుండెల్లో మీరు నిలిచిపోతారు.
- అలీ
చిన్న సినిమాలకు తోడుగా నిలబడండి
చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వట్లేదు. దానివల్ల సినిమా చచ్చిపోయింది. వాటికి మీరు తోడుగా నిలబడండి. కేరళలో చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. మీరు ఏదైనా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చేస్తారు.
- పోసాని కృష్ణమురళి
అందరూ సంతృప్తి చెందేలా సీఎం సమాధానం
చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్, మహేష్బాబు, పోసాని కృష్ణ మురళి తదితరులు మాట్లాడిన ప్రతి ఒక్క అంశాన్నీ ముఖ్యమంత్రి విన్నారు. వారు సంతృప్తి చెందేలా సమాధానం చెప్పారు. చిన్న సినిమాలకు స్థానం ఉండేలా చూడాలని, పండగల సీజన్, పెద్ద సినిమాల విడుదల సందర్భాల్లోనూ చిన్న సినిమాల విడుదలకు అవకాశమిచ్చేలా చూడాలని పరిశ్రమ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. విశాఖపట్నంలోనూ పెద్ద ఎత్తున షూటింగులు చేయాలని కోరారు. ఆ దిశగా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తామని, దానిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం వారితో చెప్పారు. మేము ఫిల్మ్ఛాంబర్ను విస్మరించలేదు. టికెట్ల రేట్ల పరిశీలన కోసం ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యులుగా వారినే నియమించాం. ఆ కమిటీ ప్రతిపాదనల్నే ఈ రోజు చర్చించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చిరంజీవి అవిరళ కృషి చేశారు.
-పేర్ని నాని, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా