తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్పై సీబీఐ కేసు
నిట్ డైరెక్టర్గా అధికారిక దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో అనర్హులను నియమించారంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్-ఏపీ డైరెక్టర్
అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు
ఈనాడు, అమరావతి: నిట్ డైరెక్టర్గా అధికారిక దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ ఆ ప్రతిష్ఠాత్మక సంస్థలో అనర్హులను నియమించారంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్-ఏపీ డైరెక్టర్ సీఎస్పీ రావుపై సీబీఐ రెండు కేసులు నమోదుచేసింది. వివిధ పోస్టుల్లో చేరేందుకు అనర్హులైనా... నియమితులై అనుచిత లబ్ధి పొందారంటూ... పీఆర్వో, లైజనింగ్ అధికారి రామ్ప్రసాద్, సూపరింటెండెంట్లు చెక్కలపల్లి అన్నపూర్ణ, కప్పక గోపాలకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ వి.వి.సురేష్బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేష్కుమార్లను నిందితులుగా చేర్చింది. ‘తాడేపల్లిగూడెం నిట్కు పీఆర్వో పోస్టు మంజూరుకాలేదు. అయినా నియమించారు. సూపరింటెండెంట్/జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో చేరేవారి వయసు 30 ఏళ్లు దాటకూడదు. కానీ అన్నపూర్ణ, గోపాలకృష్ణ, సురేష్బాబుకు నిబంధనలకు విరుద్ధంగా వయోపరిమితి సడలింపు ఇచ్చారు. సీఎస్పీ రావు పూర్వ విద్యార్థి అయిన వీరేష్కుమార్కు వయోపరిమితి సడలింపు ఇచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించారు. ఇలాంటి చర్యల ద్వారా అధికారిక దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడ్డారు’ అని సీబీఐ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది.
లంచాల్ని వేరే ఖాతాల్లో వేయించి...
నిట్కు క్యాటరింగ్ సర్వీస్ చేసే ఎస్ఎస్ క్యాటరర్స్ సంస్థ నుంచి లంచాలు తీసుకున్నారని సీబీఐ మరో కేసు నమోదుచేసింది. ‘సీఎస్పీ రావు వరంగల్లో పనిచేసేటప్పుడు ఎన్.విష్ణుమూర్తి అనే వ్యక్తికి పీహెచ్డీ గైడ్గా వ్యవహరించారు. ఆయన నుంచి రూ.1.50 లక్షల నగదు, ట్రెడ్ మిల్లు లంచంగా పొందారు. ఎస్ఎస్ క్యాటరర్స్ సంస్థ ప్రతినిధి నేరెళ్ల సుబ్రమణ్యం.. సీఎస్పీ రావు ఆదేశాల మేరకు విష్ణుమూర్తి స్నేహితుడి భార్య ఖాతాలో రూ.2.04 లక్షలు జమచేశారు. ఆ సొమ్మును తెలంగాణలోని కాజీపేటలో ఉండే సీఎస్పీ రావు భార్యకు అందజేసేవారు. నాగాలాండ్లోని నిట్లో అసొసియేట్ ప్రొఫెసర్ ధనలక్ష్మి... నిట్, పుదుచ్చేరిలో పోస్టింగు పొందడానికి సీఎస్పీ రావుకు రూ.5.55 లక్షలు చెల్లించారు’ అంటూ సీబీఐ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది.
కాజీపేటలో ఇల్లు సీజ్
సీఎస్పీ రావుకు తెలంగాణలోని వరంగల్లో ఉన్న ఇంటిని సీబీఐ అధికారులు బుధవారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేట రహమత్నగర్లోని ఆయన నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆరాతీయగా సీఎస్పీ రావు భార్య డాక్టర్ పద్మజ ఇంట్లో లేరని, తాడేపల్లిగూడెం వెళ్లారని డ్రైవర్ బాలాజీ తెలిపారు. అధికారులు ఇంటి షట్టరును సీజ్చేసి నోటీసులు అంటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!