తిరుమలలో భక్తుల తోపులాట

శ్రీవారి దర్శనార్థం ఆస్థాన మండపం సమీపంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. గంటకుపైగా జరిగిన తోపులాటలో

Published : 22 May 2022 05:58 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం ఆస్థాన మండపం సమీపంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుంది. గంటకుపైగా జరిగిన తోపులాటలో వృద్ధులు, పిల్లలు,మహిళలు ఇబ్బందిపడ్డారు.  

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే శనివారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.  దాదాపు 13,35,000 టికెట్లు విడుదల చేయగా..  2.78 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని