TDP Mahanadu: మహా జనసంద్రం
తెలుగు దేశం పార్టీ రెండు రోజుల మహానాడులో భాగంగా శనివారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన మహాసభలో అశేష జనవాహిని జయజయ ధ్వానాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల యుద్ధభేరి మోగించారు. ప్రభుత్వంపై పోరాటానికి,
తెదేపా మహానాడుకు తరలివచ్చిన ప్రజానీకం
చంద్రబాబు నినదిస్తే.. గళం కలిపిన లక్షల మంది
నిర్బంధాలు, ప్రతికూల పరిస్థితులు అన్నీ బేఖాతర్
బస్సులు ఇవ్వకున్నా.. రానివ్వకపోయినా ఆగలేదు
మండే ఎండలోనూ ఆద్యంతం తరగని ఉత్సాహం
మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి
జనం... జనం... రోడ్ల మీద జనం... ప్రాంగణమంతా జనం... కనుచూపు మేరలో కడలి తరంగాల్లా ఎటు చూసినా లక్షల్లో జనం. ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం వద్ద నిర్వహించిన మహానాడు సభకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు ఒక ప్రభంజనంలా తరలివచ్చారు. కట్టలు తెగిన వరదలా పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో కదలివచ్చారు.
మీరంతా తాడోపేడో తేల్చుకోవాలని వచ్చారు.. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఇంటికి పంపుదామా అన్న ఉత్సాహంతో వచ్చారు. చైతన్యం, పట్టుదల, కసితో పోరాటంలో పాలుపంచుకోవడానికి ముందుకొచ్చారు..
ఉన్మాదుల పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు కదలివచ్చారు.
- మహానాడుకు వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు
ఎంత ఇబ్బంది పెడితే అంత రాటుదేలతా.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడను.. బుల్లెట్లా దూసుకెళతా..
- వైకాపా ప్రభుత్వానికి చంద్రబాబు హెచ్చరిక
తెలుగు దేశం పార్టీ రెండు రోజుల మహానాడులో భాగంగా శనివారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన మహాసభలో అశేష జనవాహిని జయజయ ధ్వానాల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నికల యుద్ధభేరి మోగించారు. ప్రభుత్వంపై పోరాటానికి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కదనరంగంలోకి దూకేందుకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ సమరశంఖం పూరించారు. ‘క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని ఆయన నినదిస్తే, కొన్ని లక్షల మంది గళం కలిపారు. ఇదే స్ఫూర్తితో అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తామని ప్రకటించి, పార్టీశ్రేణుల్లో ఆయన మరింత సమరోత్సాహాన్ని నింపారు. చంద్రబాబు వేదిక మీదకు వచ్చినప్పుడు ఐదారు నిమిషాలు సభా ప్రాంగణమంతా కేకలు, నినాదాలు, ఈలలతో హోరెత్తిపోయింది. మళ్లీ మీరే సీఎం... అంటూ ప్రజలు పెద్దఎత్తున నినదించారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ అదేస్థాయిలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్పందించారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత ఇంత భారీస్థాయిలో ఒక రాజకీయపార్టీ సభ జరగడం, ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ ఇచ్చిన పిలుపుతో కొన్ని లక్షల మంది తరలిరావడం ఇదే మొదటిసారి. తెదేపా చరిత్రలో ఎన్నో మహానాడులు, భారీ సభలూ జరిగినా, అనేక నిర్బంధాలు, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ప్రవాహంలా జనం తరలిరావడం ఈ సభ ప్రత్యేకతని తెదేపా నాయకులు చెబుతున్నారు.
అడ్డంకులను అధిగమించి..
తెదేపా సభకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు వెళ్లేందుకు బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసీ నిరాకరించింది. స్కూల్ బస్సులు ఇవ్వకుండా యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం బెదిరించింది. వీటికితోడు మండే ఎండలు, వడగాలులు... ఇలాంటి ఇబ్బందులేవీ ప్రజల్ని నిరోధించలేకపోయాయి. లారీలు, ట్రాక్టర్లు, కార్లు ఇలా... ఏ వాహనం కుదిరితే దానిలో సొంత ఖర్చులు పెట్టుకుని మరీ తరలివచ్చారు. ‘పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నాయకుల ప్రసంగాలు మాకు కొత్తేమీ కాదు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో మేం అనేక అరాచకాలు ఎదుర్కొన్నాం. వేధింపులు, బెదిరింపులే భరించాం. స్థానికసంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ సాగించిన దురాగతాలకు అంతే లేదు. అందుకే ఆ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు, వచ్చే ఎన్నికల్లో తెదేపాను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలనే తరలివచ్చాం’ అని నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కార్యకర్త పేర్కొన్నారు. ‘ఈ మూడేళ్లలో ప్రభుత్వం వేయని భారం లేదు. పెంచని ఛార్జీలు లేవు. ఈ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పేందుకే ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించి, ఏ వాహనం దొరికితే దానిలో వచ్చాం’ అని అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఒక మహిళ తెలిపారు.
ఉదయం 7 గంటలకే వేల సంఖ్యలో రాక
తెదేపా మహాసభ సాయంత్రం 4 గంటల తర్వాత మొదలవుతుందని తెలిసినా ఉదయం 7 గంటలకే సమావేశ ప్రాంగణానికి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. ఆ సమయానికే 20 వేల మందికిపైగా రావడంతో ట్రాఫిక్కు అవరోధం ఏర్పడింది. అందరూ మధ్యాహ్నం తర్వాత వస్తారన్న ఉద్దేశంతో, అప్పటికి సిద్ధమయ్యేలా భోజన ఏర్పాట్లు చేసుకుంటున్న పార్టీ నాయకులు జనస్పందన చూసి అప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. వీలైనంత త్వరగా వారికి భోజన ప్యాకెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల సమయానికే 50-60 వేల మంది వచ్చేశారు. మధ్యాహ్నం 2-3 గంటల సమయానికి ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంది.
చాన్నాళ్ల తర్వాత మళ్లీ లారీలు, ట్రాక్టర్లలో...
దాదాపు 10-15 ఏళ్ల తర్వాత జనం మళ్లీ లారీలు, ట్రాక్టర్లలో తరలిరావడం తెదేపా మహానాడు సందర్భంగా కనిపించింది. ద్విచక్రవాహనాలైతే అసాధారణ సంఖ్యలో వచ్చాయి. తొలిరోజు కార్యక్రమానికి వచ్చినవారిలో చాలామంది బహిరంగసభలో కూడా పాల్గొనే వెళ్లాలన్న పట్టుదలతో ఉండిపోయారు. సుదూర ప్రాంతాలవారు శుక్రవారం రాత్రే ఒంగోలు చేరుకున్నారు. కొందరు శనివారం ఉదయం నుంచి రావడం ప్రారంభించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు అన్న తేడాలేకుండా అన్ని వర్గాలవారూ రెట్టించిన ఉత్సాహంతో కదిలివచ్చారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణను పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల అవరోధాలు సృష్టించడంతో కొన్ని కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో చాలామంది 5-6 కి.మీ.ల నుంచి కాలినడకనే వచ్చారు.
వెల్లువెత్తిన ఉత్సాహం
సాధారణంగా రాజకీయ సభలంటే పెద్దసంఖ్యలో జనాన్ని తరలించడం, నాయకుల ప్రసంగాలు మొదలవగానే వారు తిరుగుముఖం పట్టడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. కానీ మహానాడు అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారుల ఉత్సాహానికి అద్దం పట్టింది. యువత పెద్ద ఎత్తున తరలివచ్చి.. బారికేడ్లు తోసుకుని మరీ సభాప్రాంగణంలో ప్రవేశించారు. సభ జరుగుతున్నప్పుడు సౌండ్ బాక్స్లు, లైటింగ్ వ్యవస్థల మీదకు ఎక్కి కేరింతలు కొట్టారు. వాటిపై నుంచి దిగాలని పార్టీ నాయకులు చెప్పినా వారు వినకపోవడంతో... స్వయంగా చంద్రబాబు వారికి నచ్చజెప్పాల్సి వచ్చింది. చంద్రబాబు, బాలకృష్ణ వేదికపైకి రాగానే సమావేశ ప్రాంగణం హోరెత్తింది. చంద్రబాబు సహా ముఖ్యనాయకుల ప్రసంగాల్లో ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా విమర్శలు చేసినప్పుడు.. కార్యకర్తలు, ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. రాత్రి 8.30కు సభ ముగిసేవరకు కూడా ప్రాంగణంలో జనం అదే ఉత్సాహంతో ఉన్నారు. సభ ముగిశాకే అందరూ తిరుగుముఖం పట్టారు.
మండే ఎండలు కాదని..
శుక్రవారం మహానాడు తొలిరోజు కార్యక్రమాలకు జర్మన్ హ్యాంగర్ను ఏర్పాటుచేశారు. దానిలో 12వేల మందికి కుర్చీలు వేయగా... 60-70 వేలమంది వచ్చారు. శనివారం బహిరంగ సభ కోసం వేదికను అలాగే ఉంచేసి, జర్మన్ హ్యాంగర్ను చాలావరకు తొలగించారు. సభా ప్రాంగణానికి ఉదయానికే పెద్దసంఖ్యలో చేరుకున్న ప్రజలు.. ఎండ తీవ్రత పెరిగేసరికి అక్కడున్న షామియానాలు, రోడ్ల పక్కన చెట్ల కింద, బడ్డీకొట్ల దగ్గరా నీడలో సేదతీరారు. కొందరైతే కొన్ని గంటలపాటు ఎండలోనే గడిపారు. మధ్యాహ్నం 4 గంటలకు సభ మొదలయ్యేసరికి ప్రాంగణమంతా లక్షల మందితో నిండిపోయింది. కనుచూపు మేరలో ఇసుక వేసినా రాలనంత జనం కనిపించారు. ఆవరణలో ఎక్కడికక్కడ ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీన్ల సాయంతో.. కుర్చీలపైనా, నేల మీదా కూర్చుని ఆద్యంతం సభను వీక్షించారు.
ప్రసంగాల్లో గాఢత..
చంద్రబాబు సహా సమావేశంలో పాల్గొన్న నాయకుల ప్రసంగాలు ఆవేశంగా, ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా ఘాటైన విమర్శలతో సాగాయి. ఈసారి చాలామంది సీనియర్లు ప్రసంగాలకు దూరంగా ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ సభను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు, అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లు కొందరే మాట్లాడారు. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతున్నప్పుడు ప్రజల నుంచి పెద్ద స్పందన లభించింది. పార్టీ ప్రధానకార్యదర్శి లోకేశ్ కాసేపు మాట్లాడేసరికి గొంతుకు ఇబ్బంది ఏర్పడటంతో ప్రసంగం కొనసాగించలేకపోయారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 40% టికెట్లు ఇస్తామని ప్రకటించినందుకు కృతజ్ఞతగా పార్టీ యువనాయకుడు నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో సభా ప్రాంగణంలో చంద్రబాబు, లోకేశ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
వైకాపా పతనం ప్రారంభం
- సత్యవతి మాదాల, మురళీదేవి, చిరుమామిళ్ల లావణ్య, తెదేపా మహిళా నేతలు, విజయవాడ
మహానాడు వేదికగా వైకాపా రాజకీయ పతనం ప్రారంభమైంది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగించినా... ఎండా, వానలను లెక్క చేయకుండా మహానాడుకు తరలివచ్చాం. రానున్న ఎన్నికల్లో తెలుగు మహిళల సత్తా చూపిస్తాం. మేమంతా ఆడపులులుగా మారి ప్రభుత్వ పతనాన్ని శాసిస్తాం.
పోలీసులు అడ్డుకున్నారు
- మిరియాల శ్రీకాంత్, చింతపల్లి కాలేషా, దాచేపల్లి, గురజాల నియోజకవర్గం
దాచేపల్లి, రొంపిచర్ల నుంచి మహానాడుకు బయల్దేరాం. నకరికల్లు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటూ పత్రాలు చూపాం. అయినా వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వస్తున్నామని చెప్పడంతో మమ్మల్ని విడిచిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా