‘ఈనాడు’ చొరవతో తాగునీటి ట్యాంకులు శుభ్రం

నెలల తరబడి శుభ్రతకు నోచుకోని తాగునీటి ట్యాంకులకు ‘ఈనాడు’ చొరవతో మోక్షం లభించింది. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు,

Published : 08 Aug 2022 05:12 IST

ఈనాడు, అనంతపురం: నెలల తరబడి శుభ్రతకు నోచుకోని తాగునీటి ట్యాంకులకు ‘ఈనాడు’ చొరవతో మోక్షం లభించింది. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బందిని ‘ఈనాడు’ బృందం ఏకతాటిపైకి తెచ్చింది. ప్రస్తుత సీజన్‌లో కలుషిత నీటితో వచ్చే అనారోగ్య సమస్యలను స్థానికులకు వివరించి వారినీ ఈ క్రతువులో భాగస్వామ్యం చేసింది. ఫలితంగా శని, ఆదివారాల్లో ఉద్యమ స్ఫూర్తితో జరిగిన కార్యక్రమంలో మొత్తం 42 ట్యాంకులు శుభ్రమయ్యాయి. ట్యాంకుల్లో పాత నీరు తీసేసి.. కడిగి.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి శుభ్రం చేశారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని