వారం అన్నారు.. మూడేళ్లైనా వేతనం పెంచలేదు
చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. అయినా స్పందించకపోతే నేనే మీకు న్యాయం చేస్తా. భరోసా ఇస్తున్నా. మరో ఏడాది తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం
డీఏ రికవరీని ఆపలేదు
మండిపడుతున్న వీఆర్ఏలు
తెదేపా హయంలో రూ.6వేల నుంచి రూ.10,500కు పెంపు
చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. అయినా స్పందించకపోతే నేనే మీకు న్యాయం చేస్తా. భరోసా ఇస్తున్నా. మరో ఏడాది తర్వాత ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తరువాత మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వారం వ్యవధిలోనే మీ గౌరవ వేతనాన్ని రూ15,000కు పెంచుతా. సంఘం నేతలు పెద్దన్న, కాశన్నను పిలిపిస్తా.
- విజయవాడలో 2017 మార్చి 24న అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అన్నమాటలివి
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పని చేస్తున్న 22వేల మంది వీఆర్ఏలు (గ్రామ సహాయకులు)తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. వీరికి 2018 అక్టోబరు ముందు వరకు నెలకు రూ.6వేల గౌరవ వేతనం లభించేది. ఆనాటి తెదేపా ప్రభుత్వం రూ.6వేలుగా ఉన్న వేతనాన్ని రూ.10,500కు పెంచింది. ఈ చెల్లింపు 2018 అక్టోబరు నుంచి అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో కరవు భత్యం కింద నెలకు ఇచ్చే రూ.100ను రూ.300 చేసింది. రవాణా భత్యాన్ని రూ.20నుంచి రూ.100కు పెంచింది. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి వరకు చెల్లింపులు జరిగాయి.
ఉత్తర్వులు లేవని..!
డీఏ చెల్లింపుల విషయంలో వైకాపా ప్రభుత్వం మెలిక పెట్టింది. ‘డీఏ చెల్లింపు ఉత్తర్వుల్లో పేర్కొన్న గడువు 2018 జూన్ వరకు మాత్రమే ఉంది. పొరబాటున మీకు 2022 జనవరి వరకు చెల్లించాం. ఈ చెల్లింపులకు తగ్గట్లుగా ఉత్తర్వులు లేనందున తీసుకున్న డీఏను తిరిగి చెల్లించాలి’ అని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ట్రెజరీ అధికారులు జిల్లాలకు ఆదేశాలు పంపారు. పాత ఉత్తర్వులను అనుసరించి వీఆర్ఏలకు 2020 జనవరి వరకు డీఏ రూపంలో సుమారు రూ.10వేలు అందాయి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే వేతనాల చెల్లింపులు ఉంటాయని జిల్లాల అధికారులు వీఆర్ఏలపై ఒత్తిడి తెచ్చారు. డీఏ రికవరీ ఆపాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేనందున, వేతనాలు ఆగిపోతాయన్న భయంతో వీఆర్ఏలు రికవరీకి అంగీకరించారు. ఈ మేరకు ఫిబ్రవరి, ఏప్రిల్లో కలిపి రూ.6 వేలు చొప్పున చెల్లించారు. మిగిలిన రూ.4వేలను చెల్లించాల్సి ఉంది. అక్టోబరు వేతనం పొందాలంటే ముందుగా ఈ బకాయి చెల్లించాలని అధికారులు వీఆర్ఏలపై ఒత్తిడి తెస్తున్నారు.
దృష్టిపెట్టేవారు లేరు
కరవు భత్యం చెల్లింపునకు ఉత్తర్వులు లేవని ప్రభుత్వం పేర్కొంటుండటం విడ్డూరంగా ఉందని వీఆర్ఏలు మండిపడుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వీఆర్ఏలకు చెల్లించే డీఏలను ఆపడం ఎందుకు అన్న దానిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఉన్నత స్థాయిలో సమీక్ష జరిగితే వెంటనే పరిష్కారమయ్యే సమస్యపై ఏ స్థాయిలోనూ పట్టించుకోకపోవడంతో వీఆర్ఏలు తీవ్రంగా నష్టపోతున్నారు.
రూపాయి కూడా పెంచలేదు!
తమ కనీస వేతనం రూ.26వేలు చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. తమకు రూ.6వేల వేతనం ఉన్నప్పుడు వీఆర్ఏలకు జగన్ రూ.15,000 (అదనంగా రూ.9వేలు) ఇస్తామని చెప్పారు. ఆ మేరకు చూసినా రూ.10,500కు రూ.19,500 చెల్లించాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వం వీరి వేతనాన్ని 2018లో రూ.6వేల నుంచి రూ.10,500కు పెంచినప్పటికీ...అధికారంలోకి వచ్చిన తరవాత ముఖ్యమంత్రి జగన్ ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచలేదు. ఉత్తర్వులు లేవన్న కుంటిసాకుతో చెల్లించిన డీఏని రికవరీ చేస్తుండటం పట్ల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు పెద్దన్న, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.