విలీన వేదన!
రకరకాల కారణాలతో పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులను బడులకు, విద్యకు దూరం చేస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు ఆంక్షలు.. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం పిల్లల అవసరాలు, వారి సమస్యలను గాలికి వదిలేస్తోంది.
ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడులకు దూరం
రవాణా సౌకర్యం లేదని చదువు మానేసినవారు 7,500 మంది
రకరకాల కారణాలతో పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులను బడులకు, విద్యకు దూరం చేస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు ఆంక్షలు.. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం పిల్లల అవసరాలు, వారి సమస్యలను గాలికి వదిలేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడి మానేశారని, వీరిని తిరిగి చేర్పించేలా చూడాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇటీవల లేఖ రాశారు. వారిలో 1-5 తరగతుల వారు 66,205 మంది, ఉన్నత పాఠశాలల వారు 1,07,211 మంది ఉన్నారు. పాఠశాల దూరంగా ఉన్నందున రవాణా సౌకర్యం లేక 7,789 మంది బడి మానేశారని విద్యాశాఖే పేర్కొంది. వీరిలో ఒకటి నుంచి పదో తరగతి వారు ఉన్నారు.
ఎమ్మెల్యేల నుంచీ వ్యతిరేకత!
గతేడాది 3,627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను 250 మీటర్ల దూరంలోని 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.
ఈ ఏడాది 5,250 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. ఇవికాకుండా ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి పిల్లల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రావడంతో 649 బడులను మినహాయించారు. దూరం పెరిగి దాదాపు 5,000 మంది బడి మానేస్తున్నా ప్రభుత్వం విలీనం ఎందుకు చేస్తోంది? మానవ వనరులపై చేసే ఖర్చు తగ్గించాలన్న ప్రపంచ బ్యాంకు నిబంధన కోసమేనా? ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి, పోస్టులు మిగుల్చుకునేందుకా? అనేది చర్చనీయాంశమైంది.
మూడు నెలలుగా నిరసనలు..
తరగతుల విలీనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పలుచోట్ల ఆందోళనలు చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా నిరసన తెలుపుతున్నారు. మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను 7 కిలోమీటర్ల దూరంలోని బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. విలీనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పిల్లలు ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 3.50 లక్షల వరకు తగ్గింది. 1-5 తరగతుల్లో బడి మానేస్తున్న వారు లేరని కేంద్ర సమగ్ర శిక్ష అభియాన్కు అధికారులు నివేదికలు ఇస్తున్నారు. కానీ, ఈ ఏడాది 66 వేల మంది ప్రాథమిక స్థాయిలోనే చదువుకు దూరమయ్యారు.
మధ్యాహ్న భోజనం బాగోలేదని..
* పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, మెనూలోనూ మార్పులు చేశామని ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెబుతుండగా.. భోజనం సరిగాలేక 17 మంది చదువు ఆపేసినట్లు విద్యాశాఖ గణాంకాల్లో పేర్కొంది.
* బాల్య వివాహాల వల్ల కొందరు బడికి దూరమయ్యారు. 6-10 తరగతి స్థాయిలో 781 మందికి పెళ్లిళ్లు అయినట్లు విద్యాశాఖ పేర్కొంది.
* సీజనల్ వలసల కారణంగా 49,099 మంది బడి మానేశారు. విచిత్రమేమిటంటే వీరిలో సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గృహాలకు చెందిన వారు 1,144 మంది ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. తల్లిదండ్రులు వలసలు వెళ్తే వసతి గృహంలో ఉన్న విద్యార్థులు ఎందుకు వెళ్లిపోతారనేది ప్రశ్న.
ఒక్క విద్యార్థి కోసం నడిచిన రైలు..
జపాన్లో అదొక మారుమూల ద్వీపం.. హక్వైడో ఉత్తర ద్వీపంలోని కమీ-షిరాటకి రైల్వేస్టేషన్లో ఒకే ఒక్క ప్రయాణికురాలి కోసం రైలు రోజుకు రెండుసార్లు ఆగుతూ ఉండేది. ఆ అమ్మాయి ఒక హైస్కూలు విద్యార్థి. ఒకసారి ఆమెను బడికి తీసుకువెళ్లడానికి.. మరోసారి పాఠశాల ముగిశాక ఆమె ఇంటికి వెళ్లడానికి!
మారుమూల ప్రాంతం కావడంతో చాన్నాళ్లుగా ఆ స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ఒకదశలో సర్వీసులు నిలిపివేద్దామని రైల్వే నిర్ణయించుకుంది. కానీ ఒక విద్యార్థి రోజూ బడికి వెళ్లి రావడం కోసం ఈ రైలును ఉపయోగించుకుంటోందని.. అదొక్కటే అమెకున్న రవాణా సదుపాయమని గుర్తించిన అధికారులు ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆ స్టేషనుకు రైలు నడపాలని నిర్ణయించి అలాగే కొనసాగించారు. అంతేకాదు.. ఆమె బడి వేళలకు అనుగుణంగా రైలు సమయాన్ని మార్చారు కూడా. మూడేళ్ల పాటు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు ఇదే కొనసాగించారు.
ఇదీ.. ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యం. ఇదీ నాగరిక సమాజ లక్షణం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు అపరిమితంగా శ్రీవాణి టికెట్ల జారీ!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో శనివారం నుంచి వీఐపీ సిఫారసు లేఖలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. -
జగన్ సర్కారును పెకలించేేద్దాం
రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. -
ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు!
అవినీతి అక్రమాలపై చెడుగుడు ఆడే పాశుపతాస్త్రం.. ఓటు. పరమ పవిత్రమైన ఓట్లు జగనన్న పాలనలో పప్పుబెల్లాలు అయ్యాయి. వక్రబుద్ధి మరవని జగన్.. తన పాలనకు మడుగులొత్తే అధికారుల అండతో లెక్కకు మిక్కిలి దొంగ ఓట్లను నమోదు చేయించి.. ఓటు విలువను అభాసుపాలు చేశారు. -
ప్రశ్నలను తెలుగులో అను‘వధించారు’
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేెలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. -
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
టెట్ ఫలితాల విడుదల ఎప్పుడో?
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి. -
ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. మైకుల మొరాయింపు
బొప్పూడి ‘ప్రజాగళం’ సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలోనే నాలుగుసార్లు మైకులు మొరాయించాయి. సౌండ్ సిస్టం ఉన్న ప్రాంతంలో జనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా ఈ అంతరాయాలు చోటుచేసుకున్నాయి. -
విశాఖలో ‘భారత్ నివేష్ రన్’
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ రోడ్డులో ‘భారత్ నివేష్ రన్’ పేరిట 5కే రన్ నిర్వహించారు. -
మోదీజీ.. అమరావతిని కాపాడండి
అయిదు సంవత్సరాల నుంచి చస్తూ బతుకుతున్న అమరావతి... మోదీజీ రాజధానికి రండి.. ఆంధ్రాను రక్షించండి.. అమరావతి రైతుల జీవితాలను కాపాడండి.. మా బాబు, మన మోదీ, మా పవన్... ఇకపై ఆంధ్రాకు, అమరావతికి అమృతమే.. -
జజ్జనకరి జనారే.. సభంతా హుషారే
‘ప్రజాగళం’ సభ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ‘పసుపు దళపతి.. చీకటిని పారదోలే అధిపతి’ అంటూ సాగే పాటకు జనం ‘జై బాబు.. జైజై బాబు’ అంటూ నినాదాలు చేశారు. -
ఉప్పొంగిన జన సంద్రం
ఎటు చూసినా జనం.. కోటప్పకొండ జాతరను మించిన జన జాతర.. సభా ప్రాంగణంలోని గ్యాలరీల్లో జనం.. రోడ్లపైనా వెల్లువలా ప్రజలు.. తెదేపా, జనసేన, భాజపాల మధ్య పొత్తు కుదిరాక మూడు పార్టీలూ సంయుక్తంగా బొప్పూడి వద్ద నిర్వహించిన తొలి సభ దిగ్విజయమైంది.. -
ప్రధాని సభలో భద్రతా వైఫల్యం
ప్రజాగళం సభలో పోలీసుల వైఫల్యం అడుగడుగునా కనిపించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్రెడ్డి తన యంత్రాంగంతో బందోబస్తు విధులు సమర్థంగా చేయించటంలో విఫలమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. -
ప్రేక్షకపాత్రకే పరిమితమైన పోలీసులు
ప్రధాని రాకకు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న ఎన్ఎస్జీ, ఎస్పీజీ బృందాలు సైతం సభ నిర్వహణలో బందోబస్తుపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేశాయి. అప్పుడూ పోలీసులు స్పందించలేదు. -
మీ ప్రాణాలు మాకెంతో విలువైనవి.. టవర్లు దిగిరండి
‘ప్రజాగళం’ బహిరంగ సభలో సౌండ్ సెట్టింగ్కు ఏర్పాటుచేసిన టవర్లను ఎక్కిన యువకులంతా వాటిని దిగి కిందికి రావాలని ప్రధాని మోదీ పదేపదే విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగించే సమయంలో టవర్లపై కొందరు యువకులున్న విషయాన్ని గమనించిన మోదీ.. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చీరల పంపిణీ
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ వైకాపా నాయకులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆదివారం అమరావతిలో ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
రాఘవాచారి సంపాదకీయాలు సమకాలీన పరిస్థితులకు దర్పణం
సమకాలీన రాజకీయాలు, పరిస్థితులకు చక్రవర్తుల రాఘవాచారి సంపాదకీయాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.గిరిజాశంకర్ అన్నారు. -
నామిని రచనల్లో సామాన్యుల జీవితాలు
‘‘నామిని రచనల్లో ‘మిట్టూరోడి కథలు’ సామాన్యుల జీవనాన్ని ప్రతిబింబించాయి. నేటి రచయితలు అనేకమంది నాన్న ప్రేమను, ఆయన శ్రమను కథలుగా రాస్తే, నామిని మాత్రం తన రచనల్లో అమ్మ శ్రమను ఆవిష్కరించారు’’ అని మాజీ మంత్రి, రాజన్న ఫౌండేషన్ డైరెక్టర్ గల్లా అరుణకుమారి అన్నారు. -
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామా
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసేపల్లిపాడుకు చెందిన లింగంగుంట రవిబాబు తన పదవికి, వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
ఏపీ ఫైబర్నెట్లో సీఎం జగన్ ప్రత్యక్షం.. ఎన్నికల కోడ్ వర్తించదా?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేస్తున్నారు. ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సీఎం జగన్ చిత్రపటాలను తీసేస్తున్నారు. -
రాజకీయ పార్టీల హోర్డింగ్లు వెంటనే తొలగించండి
ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ పార్టీల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. -
ఒకసారే మూల్యాంకనం చేశాం
గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ వెల్లడించారు. గ్రూపు-1 ప్రధాన పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కు వెళ్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
Arvind Kejriwal: దిల్లీ జల్బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
-
Uber: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం
-
Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్
-
IPL 2024: గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్స్టెన్
-
MLC Kavitha: ‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
-
Russia: మమ్మల్ని విడిపించండి ప్లీజ్: రష్యా నుంచి భారతీయుల మరో వీడియో