విలీన వేదన!
రకరకాల కారణాలతో పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులను బడులకు, విద్యకు దూరం చేస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు ఆంక్షలు.. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం పిల్లల అవసరాలు, వారి సమస్యలను గాలికి వదిలేస్తోంది.
ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడులకు దూరం
రవాణా సౌకర్యం లేదని చదువు మానేసినవారు 7,500 మంది
రకరకాల కారణాలతో పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులను బడులకు, విద్యకు దూరం చేస్తోంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు ఆంక్షలు.. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం పిల్లల అవసరాలు, వారి సమస్యలను గాలికి వదిలేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడి మానేశారని, వీరిని తిరిగి చేర్పించేలా చూడాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇటీవల లేఖ రాశారు. వారిలో 1-5 తరగతుల వారు 66,205 మంది, ఉన్నత పాఠశాలల వారు 1,07,211 మంది ఉన్నారు. పాఠశాల దూరంగా ఉన్నందున రవాణా సౌకర్యం లేక 7,789 మంది బడి మానేశారని విద్యాశాఖే పేర్కొంది. వీరిలో ఒకటి నుంచి పదో తరగతి వారు ఉన్నారు.
ఎమ్మెల్యేల నుంచీ వ్యతిరేకత!
గతేడాది 3,627 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను 250 మీటర్ల దూరంలోని 3,178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు.
ఈ ఏడాది 5,250 ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. ఇవికాకుండా ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి పిల్లల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రావడంతో 649 బడులను మినహాయించారు. దూరం పెరిగి దాదాపు 5,000 మంది బడి మానేస్తున్నా ప్రభుత్వం విలీనం ఎందుకు చేస్తోంది? మానవ వనరులపై చేసే ఖర్చు తగ్గించాలన్న ప్రపంచ బ్యాంకు నిబంధన కోసమేనా? ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి, పోస్టులు మిగుల్చుకునేందుకా? అనేది చర్చనీయాంశమైంది.
మూడు నెలలుగా నిరసనలు..
తరగతుల విలీనంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పలుచోట్ల ఆందోళనలు చేశారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మాయదార్లపల్లి పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా నిరసన తెలుపుతున్నారు. మాయదార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను 7 కిలోమీటర్ల దూరంలోని బసాపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. విలీనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పిల్లలు ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 3.50 లక్షల వరకు తగ్గింది. 1-5 తరగతుల్లో బడి మానేస్తున్న వారు లేరని కేంద్ర సమగ్ర శిక్ష అభియాన్కు అధికారులు నివేదికలు ఇస్తున్నారు. కానీ, ఈ ఏడాది 66 వేల మంది ప్రాథమిక స్థాయిలోనే చదువుకు దూరమయ్యారు.
మధ్యాహ్న భోజనం బాగోలేదని..
* పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, మెనూలోనూ మార్పులు చేశామని ముఖ్యమంత్రి జగన్ గొప్పగా చెబుతుండగా.. భోజనం సరిగాలేక 17 మంది చదువు ఆపేసినట్లు విద్యాశాఖ గణాంకాల్లో పేర్కొంది.
* బాల్య వివాహాల వల్ల కొందరు బడికి దూరమయ్యారు. 6-10 తరగతి స్థాయిలో 781 మందికి పెళ్లిళ్లు అయినట్లు విద్యాశాఖ పేర్కొంది.
* సీజనల్ వలసల కారణంగా 49,099 మంది బడి మానేశారు. విచిత్రమేమిటంటే వీరిలో సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గృహాలకు చెందిన వారు 1,144 మంది ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది. తల్లిదండ్రులు వలసలు వెళ్తే వసతి గృహంలో ఉన్న విద్యార్థులు ఎందుకు వెళ్లిపోతారనేది ప్రశ్న.
ఒక్క విద్యార్థి కోసం నడిచిన రైలు..
జపాన్లో అదొక మారుమూల ద్వీపం.. హక్వైడో ఉత్తర ద్వీపంలోని కమీ-షిరాటకి రైల్వేస్టేషన్లో ఒకే ఒక్క ప్రయాణికురాలి కోసం రైలు రోజుకు రెండుసార్లు ఆగుతూ ఉండేది. ఆ అమ్మాయి ఒక హైస్కూలు విద్యార్థి. ఒకసారి ఆమెను బడికి తీసుకువెళ్లడానికి.. మరోసారి పాఠశాల ముగిశాక ఆమె ఇంటికి వెళ్లడానికి!
మారుమూల ప్రాంతం కావడంతో చాన్నాళ్లుగా ఆ స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ఒకదశలో సర్వీసులు నిలిపివేద్దామని రైల్వే నిర్ణయించుకుంది. కానీ ఒక విద్యార్థి రోజూ బడికి వెళ్లి రావడం కోసం ఈ రైలును ఉపయోగించుకుంటోందని.. అదొక్కటే అమెకున్న రవాణా సదుపాయమని గుర్తించిన అధికారులు ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆ స్టేషనుకు రైలు నడపాలని నిర్ణయించి అలాగే కొనసాగించారు. అంతేకాదు.. ఆమె బడి వేళలకు అనుగుణంగా రైలు సమయాన్ని మార్చారు కూడా. మూడేళ్ల పాటు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు ఇదే కొనసాగించారు.
ఇదీ.. ఆ దేశంలో విద్యకు ఇచ్చే ప్రాధాన్యం. ఇదీ నాగరిక సమాజ లక్షణం!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?