Andhra News: రాజధాని రైతులపై పోలీసు జులుం
అన్నం పెట్టే రైతన్నకు అవమానం.. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పరాభవం.. న్యాయం కోసం పోరాడుతున్న అన్నదాతపై రాజకీయ దన్నుతో పోలీసులు ప్రతాపం చూపించారు.
తాళ్లు అడ్డుపెట్టి.. రైతులను వెనక్కి నెట్టి..
గుర్తింపు కార్డులు చూపాలని ఒత్తిళ్లు
పలువురు మహిళలకు గాయాలు
హైకోర్టు ఆదేశాలంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్తత
ఓ వైపు మంత్రి నిరసనకు అనుమతి.. మరో వైపు కర్షకులపై ప్రతాపం
40వ రోజు పాదయాత్ర రక్తసిక్తం
ఈనాడు, కాకినాడ- రాయవరం, రామచంద్రపురం, మండపేట గ్రామీణం: అన్నం పెట్టే రైతన్నకు అవమానం.. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పరాభవం.. న్యాయం కోసం పోరాడుతున్న అన్నదాతపై రాజకీయ దన్నుతో పోలీసులు ప్రతాపం చూపించారు. ముందుకు కదలకుండా తాళ్లు అడ్డుపెట్టి ఆపేసి, వెనక్కి నెట్టేసి బరబరా ఈడ్చేశారు. పోలీసు జులుం ప్రదర్శించారు. ఒక మంత్రి, వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మరో ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో పాదయాత్ర సాగుతుండడంతో అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వైకాపా అడ్డంకులు, నిరసనలను మనోబలంతో అధిగమిస్తూ ముందుకు సాగిన రాజధాని రైతుల మహాపాదయాత్ర 40వ రోజు శుక్రవారం పోలీసు బల ప్రదర్శనతో రక్తసిక్తమైంది. పాదయాత్ర రామచంద్రపురంలోకి వెళ్లే క్రమంలో ఉద్రిక్తత ఏర్పడింది. 600 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలన్న న్యాయస్థానం తీర్పు వెలువడిన కాసేపటికే పోలీసులు ఆంక్షల జులుం ప్రదర్శించారు. యాత్ర వెంట ఉన్న వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. యాత్రలోకి రాకూడదని, గుర్తింపు కార్డులు ఉన్నవారే పాల్గొనాలని, మిగిలినవారిని అనుమతించబోమని ఆంక్షలు విధించారు. మద్దతుదారులనూ వెనక్కి పంపించారు. కొందరు గుర్తింపు కార్డులు చూపారు. మరికొందరు చేతిసంచుల్లో కార్డులున్నాయని చెప్పారు. ఇంకొందరు కార్డులే ఇవ్వలేదని పేర్కొన్నారు. రేపటి యాత్ర నుంచి చూపిస్తామని బతిమాలినా పోలీసులు వినలేదు. దీంతో వాతావరణం వేడెక్కింది. యాత్రను అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.
మహిళలు, వృద్ధులని చూడకుండా తాళ్లు అడ్డుపెట్టి నెట్టేయడంతో పలువురు కిందపడి గాయపడ్డారు. పలువురిని ఈడ్చి పక్కన పడేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ దాడిలో తుళ్లూరుకు చెందిన జొన్నలగడ్డ అన్నపూర్ణ ముఖంపై రక్త గాయాలయ్యాయి. ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో రైతులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. మొన్న రాజమహేంద్రవరంలో వైకాపా ఎంపీ రాళ్లు, చెప్పులతో కొట్టిస్తే.. ఇప్పుడు రైతులను కొట్టడానికి జగన్ పోలీసులను పంపారా? అంటూ మండిపడ్డారు. అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి, కోకన్వీనర్ గద్దె తిరుపతిరావు ఎంత చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. లాఠీలు అడ్డంపెట్టి వారినీ తోసేశారు. నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి మాపైనే దాడికి దిగుతారా? అంటూ రైతులు అక్కడే బైఠాయించారు. పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వారికి మద్దతుగా స్థానికులు, రాజకీయ పక్షాలు, ముస్లింలు నిరసనకు దిగారు. ఆందోళన గంటన్నరపాటు ఉద్ధృతంగా సాగింది. పోలీసులు వెనక్కి తగ్గడంతో ఆ తరువాత యాత్ర రామచంద్రపురం వైపు కదిలింది. శనివారం నుంచి 600 మంది గుర్తింపు కార్డుల పరిశీలన పూర్తయ్యాకే యాత్ర ప్రారంభించాలని రైతు ఐకాసకు పోలీసులు తేల్చి చెప్పారు. సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. రామచంద్రపురంలో యేసు ప్రేమాలయం చర్చిలో ప్రార్థనలు చేసి ఆశీర్వదిస్తామంటూ చర్చి పెద్దలు రైతులను ఆహ్వానించారు. యాత్రలో భాగంగా చర్చిలోకి వెళ్లేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ సీఐ శ్రీనివాస్ అభ్యంతరం చెప్పారు. దీంతో రైతులు మరోమారు వాగ్వాదానికి దిగారు. ఎదురుతిరిగి కొద్దిమంది రైతులు లోనికి వెళ్లి ప్రార్థనలు చేశారు. మైక్కు అనుమతి లేదని కళాజాత బృందాన్ని, ట్రాక్టర్ల, ఎడ్లబళ్ల ప్రదర్శనలను ఊరిబయటే పోలీసులు ఆపేశారు.
రథంపైనా ప్రతాపం
యాత్రను అడ్డుకున్న పోలీసులు వెంకటేశుడి దివ్య రథం ముందుకు కదలకుండా కాసేపు కట్టడి చేశారు. వాహనంపైకి ఎక్కి తాళాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. స్వామి జోలికి వచ్చిన సీఎంతోపాటు వైకాపా నాయకులెవరూ బాగుపడరంటూ మహిళలు ఈ సందర్భంగా శాపనార్థాలు పెట్టారు. మరోవైపు రథం ఉన్న ట్రాక్టర్పైకి బూట్లతో ఎక్కేందుకు పోలీసులు ప్రయత్నించడంతో మహిళలు అడ్డుకున్నారు.
గొంతు నొక్కి.. చెయ్యి మెలిపెట్టి నెట్టేశారు
- జమ్ముల అన్నపూర్ణ, తుళ్లూరు
పోలీసులు అటుఇటు తోసేసి, పీక మీద రెండు చేతులు పెట్టి మాట రానీయకుండా నెట్టేశారు. నాపై నలుగురు పడ్డారు. 70 ఏళ్ల వృద్ధురాలినని కూడా చూడకుండా రక్తంకారేలా గాయపరిచారు. ఇదెక్కడి న్యాయం? అడుగడుగునా అడ్డుకోవడం ఎందుకు? పోలీసులకు చెప్పి రైతులందరినీ చంపేయండి. మీకు అడ్డే ఉండదు.
మా మీద ప్రతాపమా?
- కొమ్మినేని వరలక్ష్మి, మహిళా రైతు
రాజధాని కోసం పోరాడితే ఆడవాళ్లని చూడకుండా చీరలు లాగారు. మెడలో గొలుసు లాగారు. ఒక్కొక్కరిపై 20 కేసులు పెట్టారు. మొన్న చెప్పులు, రాళ్లు వేయిస్తారా? ఇప్పుడు పోలీసులతో దాడి చేయిస్తారా? యాత్రకు ఆటంకం కలిగించవద్దని కోర్టు చెప్పినా మా మీద ప్రతాపమా? మహిళలపై పోలీసులు దాడి చేస్తే మహిళా హోంమినిస్టర్ ఏం చేస్తున్నారు?
గుర్తింపు కార్డులున్న వారికే అనుమతి
- బాలచంద్రారెడ్డి, డీఎస్పీ, రామచంద్రపురం
రైతు మహాయాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనడానికి అనుమతి ఉంది. రైతులు 150 మంది వరకు పాల్గొంటున్నారు. మిగిలిన వారంతా రాజకీయ పక్షాలవారు, బయటివారు ఉంటున్నారు. నాలుగు వాహనాలకు అనుమతి ఉంటే 50కిపైనే వస్తున్నాయి. ఇవన్నీ అడ్డుకుంటున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నాం. గుర్తింపు కార్డులున్న రైతులకే యాత్రలో అనుమతిస్తాం.
ఐకాస నేతలపై పోలీసు దాడి అన్యాయం
- పెద్దాపురంలో విలేకరులతో మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
పోలీసులు చేయి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి ఏకపక్షంగా పని చేస్తోంది. రైతులు పాదయాత్ర చేస్తుంటే పోలీసులకు బాధేంటి? అమరావతే రాజధాని అన్న సంగతి ముఖ్యమంత్రి జగన్కు తెలిసీ కావాలని మూడు రాజధానులను తెరపైకి తెచ్చి రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు.
అమాత్యుడికి అనుమతి.. రైతులపై ఆంక్షలు
మహాపాదయాత్ర రామచంద్రపురంలోకి చేరే కొద్దిసేపటి ముందు మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ తమ శ్రేణులతో కలిసి నల్లబెలూన్లతో అమరావతికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పోలీసులు ఆంక్షలు విధించి రామచంద్రపురంలో యాత్ర వెళ్లే మార్గంలో మధ్యాహ్నం రెండింటినుంచి సాయంత్రం వరకు దుకాణాలు మూయించారు. ఆ మార్గంలో రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. రైతులకు పోటీగా ఆ మార్గంలో ఇతరులు నిరసన తెలపొద్దని కోర్టు చెప్పినా అధికారులు మంత్రి కార్యక్రమానికి భద్రత కల్పించడం గమనార్హం.
మండుటెండల్లో చైతన్యధార
ఈనాడు, రాజమహేంద్రవరం- న్యూస్టుడే, అనపర్తి, అనపర్తి గ్రామీణం: దీపావళి ముందే వచ్చేసింది.. ఊరూరా ఉత్సాహం వెల్లివిరిసింది. రాజధాని రైతులు చేపట్టిన అమరావతి-అరసవల్లి మహాపాదయాత్ర దారి పొడవునా బాణాసంచా కాలుస్తూ ఊరూవాడా సంఘీభావం తెలిపింది. రాజధాని కోసం భూములిచ్చి దగాపడ్డ రైతుల కల సాకారమై వారి బతుకుల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం నుంచి యాత్ర మొదలై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. పసలపూడిలో భోజన విరామం అనంతరం రామచంద్రపురానికి పయనమైంది. రాయవరం మండలం సోమేశ్వరంలో రైతుల పాదాలను స్థానికులు పాలతో కడిగారు. కోలాటాలు, గరగ నృత్యాలు, కర్రసాములు, తీన్మార్ వాయిద్యాల నడుమ వేలాదిగా ప్రజలు, పార్టీలు, ప్రజాసంఘాలు రైతుల వెంట నడిచాయి. యాత్రలో పాల్గొని తెదేపా నేతలు నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, గొల్లపల్లి సూర్యారావు, ఆదిరెడ్డి వాసు, వి.వి.వి.చౌదరి, గంటి హరీష్ మాధుర్, జనసేన, ఇతర పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.
కోర్టు ఉత్తర్వులు రాకముందే పోలీసుల జులుం
అమరాతి ఐకాస కోకన్వీనర్ తిరుపతిరావు
ఈనాడు, కాకినాడ- న్యూస్టుడే, రామచంద్రపురం: కోర్టు ఉత్తర్వులు రాకముందే రామచంద్రపురం వద్ద ఇష్టానుసారంగా రైతులను నిర్బంధించి పోలీసులు భయభ్రాంతుల్ని చేశారని అమరావతి ఐకాస కోకన్వీనర్ గద్దె తిరుపతిరావు ఆరోపించారు. అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులపై కేసు వేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. శుక్రవారం పాదయాత్ర ముగిశాక మీడియాతో ఆయన మాట్లాడారు. దుర్భాషలాడుతూ డీఎస్పీ మాధవరెడ్డి రైతులపట్ల ప్రవర్తించిన తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందని ఆరోపించారు. అధికారిలా కాకుండా ఆయన వైకాపా కార్యకర్తలా ప్రవర్తించారని విమర్శించారు. న్యాయస్థానం ఆదేశించినట్లు శాంతిభద్రతలు పరిరక్షించకుండా రైతులపై జులుం ప్రదర్శించడమేంటని ప్రశ్నించారు. చొక్కాలు పట్టుకుని మూతులపై పిడిగుద్దులేమిటని, మేమేమైనా రౌడీలమా? అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను గౌరవిస్తామని.. న్యాయస్థానాలన్నా, న్యాయమూర్తులన్నా మాకు దేవస్థానాలు, దేవుళ్లతో సమానమని పేర్కొన్నారు. మహాపాదయాత్రలో దేవుడి రథంపైకి పోలీసులు బూట్లతో ఎక్కారని అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి ఆరోపించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తామని, నిబంధనలను పరిశీలించి పోలీసులు చెబుతున్న అభ్యంతరాలపై అప్పీలుకు వెళతామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల