రాష్ట్రంలో చిన్నారి తల్లులు!
రాష్ట్రంలో బాల్య వివాహాలు, గర్భిణుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం, తల్లిదండ్రుల అభద్రతా భావం, మూఢాచారాలవల్ల అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు.
బాల్య వివాహాల్లో ఐదో స్థానంలో ఏపీ
గర్భిణుల్లో 27 వేల మంది 15-19 ఏళ్ల మధ్య వయసు వారే
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బాల్య వివాహాలు, గర్భిణుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నిరక్షరాస్యత, పేదరికం, తల్లిదండ్రుల అభద్రతా భావం, మూఢాచారాలవల్ల అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. వయసు రాకముందే వివాహాలు చేయడంవల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఆ తర్వాత రక్తహీనత, పౌష్టికాహార లోపం వారిని వెంటాడుతోంది. గర్భిణులయ్యాక సమస్య ఎక్కువై తల్లీబిడ్డల ప్రాణాల మీదకు వస్తోంది. ముఖ్యంగా గర్భస్రావాలకు దారితీస్తోంది. బాల్య వివాహాల్లో జాతీయ సగటు వయసు 16.5 ఏళ్లు ఉండగా.. ఏపీలో 16.6గా ఉందని ఛైల్డ్ రైట్స్ అండ్ యూ (కేఆర్వై/క్రై) అనే స్వచ్ఛంద సంస్థ బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సర్వేలో తేలింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ అధ్యయనం-5 ప్రకారం.. బాల్య వివాహాల్లో పశ్చిమ బెంగాల్, బిహార్, త్రిపుర, అస్సాంల తర్వాత స్థానంలో ఏపీ ఉంది.
చిత్తూరులో జిల్లాలో గరిష్ఠం
నవంబరు 5 వరకు రాష్ట్రంలో 5.17 లక్షల గర్భిణుల వివరాలు వైద్య, ఆరోగ్యశాఖ వద్ద నమోదయ్యాయి. ఇందులో 27,062 మంది (5.23%) 15-19 ఏళ్ల మధ్య వయసువారే. జిల్లాల వారీగా చూస్తే గర్భం దాల్చిన బాలికలు అత్యధికంగా చిత్తూరులో 10.13%, తిరుపతిలో 8.31%, తూర్పుగోదావరిలో 6.53% ఉన్నారు.
అకస్మాత్తు గర్భస్రావాలు 3.09%
మహిళలకు గర్భసంచి వయసుకు తగ్గట్లుగా లేకపోవడం వల్ల గర్భస్రావాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొందరు నెలలు నిండక ముందే ప్రసవిస్తున్నారు. మరికొందరు కాన్పు సమయంలో అధిక రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళుతున్నారు. 5.17 లక్షల మంది (అన్ని రకాల వయసు వారు)లో ఇప్పటివరకు 18,999 గర్భస్రావాలు జరిగాయి. ఇందులో ఆరోగ్య రీత్యా, ఇతర కారణాలవల్ల 2,986 (0.58%), వైద్యుల సూచన మేరకు అకస్మాత్తు గర్భస్రావాలు 16,012 (3.09%) ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో తక్కువగా 0.07%, కడప జిల్లాలో అధికంగా 0.81% గర్భస్రావాలు జరిగాయి. అకస్మాత్తు గర్భస్రావాలు అధికంగా చిత్తూరు జిల్లా(4.49%), గుంటూరు జిల్లాలో (4.41%) నమోదయ్యాయి.
అత్యంత ప్రమాదకరంగా 7.91% గర్భిణులు
గర్భిణుల్లో 40,934 (7.91%) మంది గర్భిణులు అత్యంత ప్రమాదకర స్థితి(హైరిస్క్)లో ఉన్నారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22.34%, పార్వతీపురం మన్యం-13.40%, శ్రీకాకుళం-12.37%, విజయనగరం జిల్లాలో 11.48% మంది ఈ విభాగంలో ఉన్నారు. మహిళలకు 12-14 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. మొదటి సారి వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణుల్లో చాలామందికి 7 నుంచి 11 గ్రాముల మధ్యే ఉంటోంది. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. బిడ్డకు బిడ్డకు మధ్య విరామం లేనందువల్ల రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు