విషమ పరీక్ష
రాష్ట్రంలో బోధనాసుపత్రుల స్థాయిని బట్టి ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్లు కలిపి రోజూ 2-3 వేల మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటోంది.
సర్కారీ ఆసుపత్రుల్లో అరకొర సేవలే
వేధిస్తున్న పరికరాలు, రసాయనాల కొరత
చాలాచోట్ల రోగులకు ప్రైవేట్ ల్యాబులే దిక్కు
పేదలపై ఆర్థిక భారం
రాష్ట్రవ్యాప్తంగా ‘ఈనాడు’ పరిశీలన
ఈనాడు-అమరావతి, యంత్రాంగం
రాష్ట్రంలో బోధనాసుపత్రుల స్థాయిని బట్టి ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్లు కలిపి రోజూ 2-3 వేల మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటోంది. ఉచిత చికిత్స అందుతుందని ఇక్కడికి వచ్చే పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. ల్యాబ్లలో కిట్ల కొరత, పాడైన పరికరాలకు మరమ్మతులు చేయకపోవడం, కొత్తగా వచ్చినవి వాడకపోవడం వల్ల రోగులు పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో వైద్యులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే మందులు రాసిచ్చి సరిపెడుతున్నారు. అనివార్యమైనప్పుడు బయట చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. రాష్ట్రంలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును ‘ఈనాడు’ ప్రతినిధులు నవంబరు 20-30 తేదీల మధ్య పరిశీలించగా, పలుచోట్ల నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. థైరాయిడ్, మూత్రపిండాలు, కాలేయం పనితీరు పరీక్షలు, అల్ట్రా సౌండ్, సీటీ స్కాన్ వంటివి అరకొరగా అందుతున్నట్లు వెల్లడైంది. వీటికి రూ.300 నుంచి రూ.2,000 వరకు రోగులపై భారం పడుతోంది. ఆసుపత్రుల్లో ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి, ఏవి లేవన్న సమాచారం తెలియడం లేదు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం. ఖాళీలను భర్తీ చేస్తాం. సౌకర్యాలు సమకూరుస్తున్నాం.
2021 జూన్ 21న వైద్యారోగ్యశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్
అనంతపురంలో ఇన్పేషంట్ల తిప్పలు
అనంతపురం జీజీహెచ్లో థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, సీరం క్రియాటినైన్, కాల్షియం స్థాయిలను పరీక్షించే పరికరాలు నెలలుగా పనిచేయడంలేదు. ఇందులో నాలుగు సెమీ ఆటో ఎనలైజర్లు ఉన్నాయి. పరీక్షల ఖర్చును ప్రభుత్వమే భరిస్తున్నా, ఇన్పేషెంట్లు, కదల్లేని స్థితిలో ఉన్నవారు ప్రైవేట్ ల్యాబ్లకు రెండు మూడుసార్లు వెళ్లిరావడానికి అవస్థలు పడుతున్నారు. ‘అల్ట్రాసౌండ్’ అవసరమైన గర్భిణులకు ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. వీరిపై రవాణా ఖర్చుల భారం పడుతోంది. దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు మాత్రమే రోగులను బయటకు పంపుతున్నామని, సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. మంగళవారం కొన్ని యంత్రాలు వచ్చాయని, వీటిని వాడకంలోకి తెస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు.
పనిచేయని యంత్రాలు
కాకినాడ జీజీహెచ్లో ఎంఆర్ఐని ఏడాదిన్నరగా పక్కన పెట్టారు. పిల్లల ఐసీయూ వార్డులోని వెంటిలేటర్లు, ఫొటోథెరపీ పరికరాలు, వార్మర్లలో కొన్ని పనిచేయడంలేదు. ఒంగోలులో గ్యాస్ట్రోస్కోపీ యంత్రం ఉన్నా వైద్యులు, సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో వాడకంలో లేదు. అల్సర్ల గుర్తింపునకు రోగులు ఎండోస్కోపీకి రూ.1,000 వరకు వెచ్చిస్తున్నారు. తిరుపతిలోని రుయా-అత్యవసర విభాగం, ప్రసూతి, చిన్నపిల్లల విభాగాల్లో 8 అల్ట్రాసౌండ్ యంత్రాల్లో రెండు పనిచేయడంలేదు. శ్రీకాకుళం జీజీహెచ్లో ఎలక్ట్రోలైట్ మెషిన్, బయోకెమిస్ట్రీ ఎనలైజర్లదీ అదే పరిస్థితి. ఇక్కడున్న మూడు లిఫ్టులూ పనిచేయనందున రోగులు వార్డులు, ల్యాబ్స్కు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. దీనిపై సూపరింటెండెంట్ స్వామినాయుడు మాట్లాడుతూ సమస్యలపై ఏజెన్సీల వారికి చెప్పామని, త్వరలో పరిష్కారమవుతాయని తెలిపారు. నెల్లూరు జీజీహెచ్లో థైరాయిడ్ పరీక్షలు జరగడంలేదు. డీ-డైమర్ కొవిడ్ రెండో దశ నుంచి ఆపేశారు. ఈ విషయమై సూపరింటెండెంట్ సిద్ధానాయక్ స్పందిస్తూ త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చేలా చూస్తామన్నారు.
జిల్లా ఆసుపత్రుల్లోనూ అంతే!
రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో రేడియాలజిస్టుల కొరతతో అల్ట్రాసౌండ్, 2డీ ఎకో చేయడంలేదు. నెల రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని సూపరింటెండెంట్ రమేష్ తెలిపారు. తణుకులో అల్ట్రా స్కానింగ్ యంత్రాలు ఉన్నా, రేడియోలజిస్ట్ లేక రోగులు ప్రైవేట్ ల్యాబ్స్కు వెళ్తున్నారు. అనకాపల్లిలో సీటీస్కాన్ యంత్రం రెండేళ్లుగా పనిచేయడంలేదు. ఈ పరీక్ష అవసరమైన ఇన్పేషెంట్లను కేజీహెచ్కు పంపిస్తున్నారు. మచిలీపట్నంలో దాతలిచ్చిన డిజిటల్ ఎక్స్రే యంత్రం అలంకారప్రాయంగా ఉంది. చిత్తూరులో థైరాయిడ్ పరీక్షల యంత్రాన్ని అమర్చనందున ఒక్కో రోగిపై రూ.500 వరకు భారం పడుతోంది. మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని ఎక్స్రే విభాగంలో 300 ఎంఏహెచ్ యంత్రం నిరుపయోగంగా ఉంది. రూ.కోటి విలువ చేసే పరికరాలతో ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను ఏర్పాటుచేసినా ప్రారంభించలేదు. వైరల్ పరీక్షల నమూనాలను తిరుపతి వైరాలజీ ల్యాబ్కు పంపుతున్నారు. ఇక్కడి రక్తనిధి కేంద్రంలో రక్తం నుంచి సెల్స్ వేరుచేసే యంత్రం లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.
కీలక రక్తపరీక్షలు అయినా..
* విజయవాడ జీజీహెచ్లో లివర్ ప్రొఫైల్, రక్తంలోని యూరియా శాతాన్ని గుర్తించే పరీక్షలు, మధుమేహ బాధితులకు చేసే హెచ్బీఏ1సీ, థైరాయిడ్ పరీక్షలు రోగుల అవసరాలకు తగ్గట్లు జరగడంలేదు. గుండె జబ్బుల బాధితులకు నిర్వహించే ట్రోపోనిన్-ఐ పరీక్షలనూ ఆపేశారు. ఒంగోలు, కర్నూలులో థైరాయిడ్ టెస్ట్కు రసాయనాల కొరత ఉంది.
* విజయవాడ ప్రసూతి ఆసుపత్రిలో థైరాయిడ్, బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవీ, హెచ్బీ పర్సంటేజీ, జాండిస్, లివర్ ఫంక్షన్, యూరిన్, ఈఎస్ఆర్ పరీక్షలు చేయడం లేదు. కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులోని బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
* తిరుపతి రుయాలో కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు అరకొరగా చేస్తున్నారు. ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్ష జరగడంలేదు. ఎస్వీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వెంకట్ మాట్లాడుతూ కిట్ల కొరతతో నిర్వహణలో సమస్యలొస్తున్నాయని, జిల్లా కలెక్టర్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
* మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో థైరాయిడ్, ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు చేయడంలేదు. కాలేయానికి సంబంధించి రెండు మాత్రమే చేస్తున్నారు. ఏలూరులో నిపుణులు, కిట్లు లేకపోవడంతో శరీరంలో గడ్డల ప్రభావాన్ని గుర్తించలేకపోతున్నారు. హెపటైటిస్-బీ చేయడం లేదు. తణుకులో ఆటో ఎనలైజర్ లేక కిడ్నీ, లివర్, థైరాయిడ్ పరీక్షలు ఆగిపోయాయి.
సమస్యకు మూలాలేంటి?
* ఆసుపత్రుల్లో పరీక్షల నిర్వహణ, ఫలితాల విశ్లేషణ, రికార్డుల నిర్వహణను పరిశీలించే వ్యవస్థ అచేతనంగా ఉండటం.
* ఆరోగ్యశ్రీ కేసుల ద్వారా వచ్చే నిధులకు భారీ కోత, ల్యాబ్లలో అవసరమైన రసాయనాలు, ఇతరాలకు సకాలంలో బిల్లులు రాకపోవడం. నిధుల్లేవంటూ సూపరింటెండెంట్లు చేతులెత్తేయడం.
* యంత్రాలు, పరికరాలు చాలాచోట్ల పడకేశాయి. మరమ్మతుల కోసం ఈ ఏడాది జూన్లో ప్రభుత్వం ఎంపికచేసిన సంస్థ ఈ మధ్యే వాటి వివరాల సేకరణ ప్రారంభించింది.
ఎవరెవరికి ఎలాంటి పరీక్షలంటే?
* ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న మహిళల్లో 30-40% మందికి థైరాయిడ్ పరీక్షలు అవసరం. ఇటీవల పురుషులకూ ఎక్కువగానే చేయాల్సి వస్తోంది.
* పక్షవాతం, గుండెపోటుతో వచ్చేవారికి లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2డీ ఎకో చేస్తారు.
* దీర్ఘకాల మధుమేహ బాధితులకు మూత్రపిండాలు, కాలేయ పరీక్షలు (రీనల్ ఫంక్షన్ టెస్టు- క్రియాటినైన్, ఎలక్ట్రోలైట్, బ్లడ్ యూరియా) చేస్తారు.
* ఎంఆర్ఐతో పూర్తి శరీరం, పొత్తికడుపు, ఛాతీ, ఎముకలను పరీక్షిస్తారు.
* కడుపులో అల్సర్లను గుర్తించడానికి ఎండోస్కోపీ అవసరం.
కడపలో ప్రైవేట్ ల్యాబ్లే దిక్కు
సీఎం జగన్ సొంత జిల్లా వైయస్ఆర్ లోని జీజీహెచ్లో ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు మకాంవేశారు. ఫోన్ చేస్తే నిమిషాల్లో రోగుల వద్ద ప్రత్యక్షమవుతున్నారు. వీరి సెల్నంబర్లు ప్రధాన వార్డుల్లో ప్రదర్శిస్తున్నారు. వారు థైరాయిడ్కు రూ.400, హెచ్బీఏ1సీ పరీక్షకు రూ.500, ఆర్బీఎస్కు రూ.300, ఎల్ఎఫ్టీకి రూ.600 చొప్పున వసూలు చేస్తున్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావును ప్రశ్నిస్తే ప్రైవేట్ ల్యాబ్ల వ్యక్తులు వార్డుల్లోకి రాకుండా చూడాలని ఆదేశాలిస్తామని తెలిపారు.
నెరవేరని మంత్రి హామీ
విశాఖ కేజీహెచ్లో ఎంఆర్ఐ యంత్రం తొమ్మిది నెలలుగా పని చేయడంలేదు. ప్రైవేటుగా చేయించుకుంటే వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కో రోగికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్యశ్రీ వర్తించే వారికి ప్రైవేట్ ల్యాబ్లో ఉచితంగా చేయిస్తున్నప్పటికీ, ఇతరులపై భారం పడుతోంది. ఎంఆర్ఐ యంత్రాన్ని బాగు చేయిస్తామని విశాఖ జిల్లాకు ఇన్ఛార్జిగా కూడా ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఇచ్చిన హామీ ఆచరణలోకి రాలేదు.
సమస్యలు పరిష్కరిస్తాం
వ్యాధి నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరుపై మరో వారంలో నిశితంగా పరిశీలించి, గుర్తించిన లోపాలను అధిగమిస్తాం. అనకాపల్లి నుంచి అదనపు బడ్జెట్ కోసం విజ్ఞప్తులు రాగా, ప్రభుత్వ అనుమతులు రాగానే నిధులు కేటాయించాం. ఇందులో రియజెంట్స్ వంటి పదార్థాల కొనుగోలుకు కేటాయించిన నిధులూ ఉన్నాయి. జేసీల ఆధ్వర్యంలోని జిల్లా కొనుగోళ్ల కమిటీలు ఆసుపత్రుల్లో అవసరమైన రియజెంట్స్, రసాయనాలను స్థానికంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో సమస్యలుంటే పరిష్కరిస్తాం. విశాఖ కేజీహెచ్, కాకినాడ జీజీహెచ్లో కొత్తగా ఎంఆర్ఐలు పెట్టేందుకు టెండర్లు పిలిచాం.
- డాక్టర్ వినోద్కుమార్
కమిషనర్, వైద్య విధాన పరిషత్, ఇన్ఛార్జి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ