న్యాయమూర్తుల బదిలీలను పునఃపరిశీలించాలి

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీ సిఫారసులను వ్యతిరేకిస్తూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

Published : 09 Dec 2022 05:21 IST

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీ సిఫారసులను వ్యతిరేకిస్తూ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బదిలీలను తక్షణం నిలిపివేయాలని నినాదాలు చేశారు. సిఫారసులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేశారు. ఏపీ అడ్వొకేట్స్‌ ఐకాస కన్వీనర్లు వై.కోటేశ్వరరావు(వైకే), జడ శ్రావణ్‌కుమార్‌, డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు, జీవీ శివాజీ, వాసిరెడ్డి ప్రభునాథ్‌ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బేతపూడి మనోజ్‌కుమార్‌, బషీర్‌ అహ్మద్‌, వై.సోమరాజు, ఎం.శివకుమార్‌, పొట్లూరి సుదీప్తి, కోట కృష్ణదీప్తి, జి.స్వరాజ్యం, ఎన్‌.రజని, సలీంపాషా, కె.కె.దుర్గాప్రసాద్‌, దిల్లీబాబు, గంగిశెట్టి రాజేశ్వరరావు, ఎండీ సలీం, షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, కంచర్లపల్లి శివరామప్రసాదు, సైకం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని