Sajjala Ramakrishna reddy: ఆ రోజు అవినాష్ ఇంట్లో సునీల్ లేరు
‘వివేకానందరెడ్డి హత్యకు ముందు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారనేది అబద్ధం. అందుకు పక్కా ఆధారాలే ఉంటే గతంలో రెండు సిట్ల విచారణలో బయటకొచ్చేది కదా?’
శివశంకర్రెడ్డి మా పార్టీ కార్యదర్శి
ఆయన కోసం అవినాష్ వెళితే తప్పా?
వివేకా రెండో పెళ్లి, కుటుంబకలహాల కోణంలో సీబీఐ ఎందుకు చూడట్లేదు?
చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై విచారించరేం?
ఈనాడు, అమరావతి: ‘వివేకానందరెడ్డి హత్యకు ముందు సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారనేది అబద్ధం. అందుకు పక్కా ఆధారాలే ఉంటే గతంలో రెండు సిట్ల విచారణలో బయటకొచ్చేది కదా?’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘గూగుల్ టేకౌట్ అంటూ చంద్రబాబు కొత్తగా మాట్లాడుతున్నారు. భౌగోళికంగా చూస్తే సీఎం జగన్ (వైఎస్ రాజశేఖరరెడ్డి), వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిల ఇళ్లు దగ్గర దగ్గరనే సుమారు 50- 100 మీటర్ల దూరంలోనే ఉంటాయి. గూగుల్ టేకౌట్లో ఏం చూపిస్తుందో తెలియదు. అతను (సునీల్) ఎక్కడున్నాడో తెలియదు’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం సజ్జల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్లతో మాట్లాడారు. ‘సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లో అసలు విషయాలను వదిలేసి వారు (సీబీఐ) విచారించిన వారి వాంగ్మూలాలను మార్చి కేసును ఒకవైపుగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సీబీఐలోని కిందిస్థాయి అధికారులు ఇదే పనిగా పెట్టుకున్నారు. అవినాష్ వైపే మొత్తమంతా ఎందుకు చూపిస్తున్నారు? వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్రెడ్డే తనకు చెప్పారని శశికళ అనే మహిళ వెల్లడించినట్లు సీబీఐ పేర్కొంది. కానీ, తానలా చెప్పనే లేదని ఆమే ఖండించారు. వివేకా హత్యపై రెండు సిట్ల విచారణ నివేదికలను సీబీఐ ఎందుకు బయటపెట్టడం లేదు? వాటిని పట్టించుకోకుండా మరో దారిలో ఎందుకు వెళుతోంది? అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వివేకాను వైకాపా అభ్యర్థిగా ఎంపిక చేసిన సమావేశంలో శివశంకర్రెడ్డి కూడా ఉన్నారు. కానీ ఆ టికెట్ విషయంలోనే శివశంకర్రెడ్డి, భాస్కరరెడ్డి వివేకాపై కక్ష పెంచుకున్నారని సీబీఐ పేర్కొంది. మా పార్టీ కార్యదర్శి అయిన శివశంకర్రెడ్డిని అరెస్టు చేస్తే ఎంపీగా అవినాష్ ఆయన వద్దకు వెళ్లడం తప్పా? వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని, ఆ విషయంలో ఆయన్ను కుటుంబమంతా పక్కన పెట్టిందన్న విషయాన్నీ సీబీఐ చూడాలి కదా? వివేకా బావ శివప్రకాష్రెడ్డే తనకు ఫోన్ చేసి బావ గుండెపోటుతో చనిపోయాడని చెప్పారని ఆదినారాయణరెడ్డి సీబీఐని కలిసిన తర్వాత వెల్లడించలేదా? దాన్ని పరిగణనలోకి తీసుకోలేదేం? హత్య జరిగిన సమయంలో చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై సీబీఐ ఎందుకు విచారించదు? ఇక్కడ (వివేకా ఇంట్లో) ఓ లేఖ ఉందని ఆయన పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి చెబితే.. ఆ లేఖ బయటపెట్టొద్దు, ఫోన్ కూడా ఎవరికీ ఇవ్వద్దు. మేం వచ్చేవరకు వాటిని దాచిపెట్టాలని చెప్పలేదా? తర్వాత ఆ ఫోన్లో సందేశాలను డిలీట్ చేసి విచారణాధికారులకు ఎందుకిచ్చారు? వివేకా హత్య జరిగినప్పుడు అవినాష్ జగన్ ఇంటికి ఫోన్ చేశారన్న విషయం చంద్రబాబు హయాంలోని సిట్ విచారణలో ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడే ఎందుకొచ్చింది? కల్పిత కథనాలు సిద్ధం చేసి, వాటి ఆధారంగానే ఎంపీ అవినాష్ను అరెస్టు చేస్తామంటే అంత కంటే ఘోరం మరోటి ఉండదు’ అని అన్నారు.
సీబీఐ తీరుపై కేంద్రం దృష్టికి
సీబీఐ విచారణ సరిగా జరగడం లేదనుకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేయొచ్చు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. సజ్జల స్పందిస్తూ ‘సరైన సమయంలో సరైన పద్ధతిలో చేస్తాం. విచారణకు పిలిచినప్పుడు వచ్చినవారు చెప్పిందీ చెప్పనిదీ కూడా సీబీఐ రిపోర్ట్ చేస్తోంది. అదే మీడియాలో వస్తోంది. వివేకా కేసులో సీబీఐ విచారణపై చంద్రబాబు ప్రభావం కచ్చితంగా ఉంది. చంద్రబాబు కోరుకుంటున్న దారిలో సీబీఐ విచారణను తోయడమే పనిగా ఆ సంస్థలోని కింది స్థాయి అధికారులు చేస్తున్నారని విస్పష్టంగా కనిపిస్తోంది. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’ అని జవాబిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్