వాహనాల ద్వారా... రేషన్ పంపిణీ సరిగా లేదు
వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ... క్షేత్రస్థాయిలో సరిగా జరగడం లేదని వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు.
బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవడంలో విఫలం
తూనికలు, కొలతల శాఖ ఎక్కడుంది?
శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేలు మహీధర్రెడ్డి, రామచంద్రారెడ్డి
ఈనాడు, అమరావతి: వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ... క్షేత్రస్థాయిలో సరిగా జరగడం లేదని వైకాపా ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి అన్నారు. ‘ఒక్కో వాహనంపై నెలకు రూ.18 వేలకు పైగా ఖర్చు పెడుతున్నాం. అన్నింటినీ కేంద్రీయ వ్యవస్థ ద్వారా సీసీ కెమెరాలతో అనుసంధానించామంటున్నా.. తగినంత సిబ్బంది లేని కారణంగా పంపిణీ సరిగా జరగడం లేదు. దీన్ని సరిచూసుకోవాలి. రాష్ట్రంలో శాశ్వత చౌక దుకాణ డీలర్లు తక్కువ మంది ఉన్నారు. ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలి’ అని సూచించారు. ‘రేషన్ బియ్యం తరలింపుదారులపై కఠిన చర్యలకు విధి విధానాల్లేవు. ఈ వ్యవస్థను అడ్డుకోవడంలో విఫలం అవుతున్నాం. 100% కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరాన్ని పరిశీలించాలి’ అని కోరారు. ‘మండల, జిల్లా స్థాయి ఆహార సమీక్ష సమావేశాలు జరగడం లేదు. అడిగేవారు లేరనే ధోరణి ప్రబలక ముందే వాటిని పునరుద్ధరించాలి. మండలానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దారు ఉండేలా చూడాలి’ అని మహీధర్రెడ్డి సూచించారు.
అక్రమార్కుల్ని చూస్తే హడల్
‘15 ఏళ్ల కిందట తూనికలు, కొలతలశాఖ అంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇప్పుడు అక్రమార్కుల్ని చూస్తే ఆ శాఖ గుండెల్లోనే రైళ్లు పరిగెత్తుతున్నాయనే భావన ప్రజల్లో ఉంది’ అని మహీధర్రెడ్డి పేర్కొన్నారు. ‘తూనికలు, కొలతల శాఖ ఎక్కడుందో... తెలియడం లేదు, పెట్రోలు బంకుల్లో తక్కువ పరిమాణంలో ఇంధనం వస్తోంది. దీనిపై ఫిర్యాదు చేయాలన్నా అధికారులు ఎక్కడుంటారో తెలియదు. ఈ శాఖ ఉన్నట్లు సగం మందికి తెలియదు’ అని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. ‘సస్పెండ్ అయిన చౌకదుకాణ డీలర్లు... హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారు. హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? వారిని ఎలా తొలగించాలనే విషయాన్ని పరిశీలించాలి’ అని కోరారు.
గడప గడపలో ఈ సమస్యలే అధికం
‘గడప గడప కార్యక్రమంలో ఎక్కువగా పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చడం లేదు. చేర్పులు, తొలగింపుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి నిర్దేశిత సమయం పెట్టి పరిష్కరించాలి’ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ‘వివిధ కారణాలతో రాజీనామా చేసిన మొబైల్ వాహన ఆపరేటర్లకు వారు చెల్లించిన డిపాజిట్ను వెనక్కి ఇచ్చేలా చూడాలి. వడ్లను ఎక్కువ రోజులు నిల్వచేసి మర పట్టిస్తే బియ్యం నాణ్యత పెరుగుతుంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి’ అని ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు.
భయాన్ని తెచ్చాం...
రేషన్ పంపిణీలో అవకతవకలు జరగకుండా కమాండ్ కంట్రోల్ వ్యవస్థ చూస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వివరించారు. తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో వరుస దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం ద్వారా అక్రమార్కుల్లో భయాన్ని తెచ్చామని చెప్పారు. బడ్జెట్ పద్దులపై ఓటింగ్ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పెట్రోలు బంకులు, బంగారం దుకాణాలు, ఎరువుల దుకాణాలపై తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశామన్నారు. ‘చిరుధాన్యాల పంపిణీకి 10 వేల టన్నుల రాగులు, 5 వేల టన్నుల జొన్నలను సేకరిస్తున్నాం. కర్ణాటక నుంచి వీటిని కొనుగోలు చేసి కార్డుదారులకు ఇవ్వబోతున్నాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ గోధుమ పిండి పంపిణీ చేస్తాం’ అని తెలిపారు. న్యాయస్థానాల నుంచి స్టే తెచ్చుకుని కొనసాగుతున్న రేషన్ డీలర్ల విషయంలో జిల్లా యంత్రాంగం అచేతనంగా ఉంటోందని, దీనిపై ప్రభుత్వ న్యాయవాదులతో సమీక్షించాలని సభాపతి తమ్మినేని సీతారాం మంత్రికి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?