సీఎంను కలిసిన క్రికెటర్‌ అంబటి రాయుడు

రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు క్రికెటర్‌ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు.

Updated : 09 Jun 2023 05:11 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు క్రికెటర్‌ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఫ్రాంచైజీ యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్‌, రాయుడు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఐపీఎల్‌లో ఇటీవల సీఎస్‌కే జట్టు గెలుచుకున్న ట్రోఫీని వారు సీఎంకు చూపించారు. సీఎస్‌కే జట్టు సభ్యుల ఆటోగ్రాఫ్‌లతో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహూకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని