Visakhapatnam: విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్‌

విశాఖ నగర పరిధి మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం వర్షంతో పాటు ఓ పిడుగు పడింది. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో భారీ మెరుపుతో పడిన పిడుగుపాటుకు ఓ సరుగుడు కర్ర ధ్వంసమై సుమారు 30 అడుగుల ఎత్తులో దుమ్ము పైకి లేచింది.

Updated : 02 Oct 2023 11:51 IST

విశాఖపట్నం (సింధియా), న్యూస్‌టుడే: విశాఖ నగర పరిధి మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం వర్షంతో పాటు ఓ పిడుగు పడింది. సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో భారీ మెరుపుతో పడిన పిడుగుపాటుకు ఓ సరుగుడు కర్ర ధ్వంసమై సుమారు 30 అడుగుల ఎత్తులో దుమ్ము పైకి లేచింది. అంతకు ముందు ఆహ్లాద వాతావరణాన్ని వీడియో చిత్రీకరిస్తున్న ఓ యువకుడు ఈ దృశ్యాన్ని కూడా తీయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని