Gundlakamma Reservoir: గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది.
ఏడాది కిందట ఒక గేటు ధ్వంసం
ఇప్పటికీ బాగు చేయించలేకపోయిన ప్రభుత్వం
ఇప్పుడు మరోదానికీ చేటు
జలాశయంలో నీళ్లన్నీ సముద్రంపాలు
గేట్లన్నీ కొట్టుకుపోతే కానీ పట్టదా జగన్?
ఈనాడు- ఒంగోలు, న్యూస్టుడే - సంత నూతలపాడు: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు(Gundlakamma Reservoir) చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఇప్పటికే ఒక గేటు కొట్టుకుపోయి ఏడాది గడిచిపోయినా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేయలేదు. మిగిలిన గేట్ల మరమ్మతుల్నీ జగన్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో శుక్రవారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో మరో (2వ నంబరు) గేటు విరిగి కొట్టుకుపోయింది. ప్రాజెక్టులో నీళ్లన్నీ వృథాగా సముద్రం పాలవుతున్నాయి. గుండ్లకమ్మ జలాశయం కింద కుడి, ఎడమ కాలువల పరిధిలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. రిజర్వాయర్లో చేపల వేటతో 2వేలకు పైగా మత్స్యకార కుటుంబాలు బతుకుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జలాశయాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది.
విలువైన జలాలు కడలిపాలు
గుండ్లకమ్మ జలాశయం పూర్తి సామర్థ్యం 3.8 టీఎంసీలు. గతేడాది ఆగస్టులో 3వ గేటు కొట్టుకుపోయే నాటికి జలాశయంలో 3 టీఎంసీల నీళ్లున్నాయి. గేటు కొట్టుకుపోవడంతో 1.5 టీఎంసీలు సముద్రంలోకి వృథాగా పోయాయి. గేటు మరమ్మతులు చేయాలంటే మొత్తం జలాశయం ఖాళీ చేయాలని ఇంజినీరింగ్ అధికారులు సూచించారు. తాత్కాలికంగా మరమ్మతు చేసిన తర్వాత జలాశయంలో నిల్వను 1.7 టీఎంసీలకే పరిమితం చేశారు. మిగ్జాం తుపానుకు ముందు జలాశయంలో 1.3 టీఎంసీలే ఉన్నాయి. తుపాను నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5 టీఎంసీల నీరు చేరింది. బుధవారం రెండు గేట్లు ఎత్తి కొంత నీరు దిగువకు వదిలారు. ఉద్ధృతి తగ్గిందనుకొని తిరిగి మూసివేశారు. పైనుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో మరమ్మతులకు నోచక తుప్పుపట్టి ఉన్న రెండో గేటులోని అడుగు భాగం కొంత శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. శుక్రవారం రాత్రి వరకు అర టీఎంసీ నీళ్లు వృథాగా పోయాయి. గేటు కొట్టుకుపోయిందని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటుండటంతో అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. వరద నీరు దిగువకు పెద్ద ఎత్తున వస్తుండటంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మూడేళ్ల కిందటే గుర్తించినా..
- గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి 15 ఏళ్లు పూర్తి కాకముందే గేట్లు తుప్పు పట్టేశాయి. మొత్తం 15 గేట్లలో చాలావరకు పాడయ్యాయని, వాటిని మార్చాలని మూడేళ్ల కిందటే నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. 6, 7 నెంబరు గేట్లు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటికి తక్షణ మరమ్మతులు చేయాలని భావించారు. మొత్తంగా మరమ్మతులకు రూ.3 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
- 2022 జూన్ నెలలో రూ.98 లక్షలు మంజూరు చేశారు. సకాలంలో నిధులందక ఆ సీజనులో పనులు చేపట్టేందుకు ఆస్కారం లేకపోయింది.
- గత ఏడాది ఆగస్టు 31న రాత్రి మూడో నంబరు గేటు కొట్టుకుపోయింది. స్టాప్ లాగ్ గేటు పెట్టేలోపు ప్రాజెక్టులోని నీళ్లన్నీ వృథాగా కడలిలో కలిసిపోయాయి.
- ఆ గేటు కొట్టుకుపోయిన తర్వాత కేంద్ర ఆకృతుల సంస్థ అధికారులు ప్రాజెక్టును సందర్శించారు. మొత్తం 12 గేట్లు బాగు చేయాలని తేల్చి చెప్పారు. రూ.9.4 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటికీ మొదట కొట్టుకుపోయిన గేటునే పెట్టలేకపోయారు.
- ఈ ప్రాజెక్టులో 12 గేట్లు బాగు చేయాలని మూడేళ్ల కిందటే గుర్తించినా జగన్ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు. ఫలితంగా శుక్రవారం రాత్రి మరో గేటు కొట్టుకుపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని ససాక్ష్యంగా నిరూపించింది.
తరచూ తప్పులు.. అయినా మారని తీరు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసిన జగన్ ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు మట్టి కట్ట తెగిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో గేటు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మలో ఇలా గేటు కొట్టుకుపోవడం ఇది రెండోసారి. ఇంత జరుగుతున్నా జగన్ సర్కార్ మేల్కోలేదని, ముఖ్యమంత్రి హామీలు మాటలకే పరిమితమవుతున్నాయని తాజా గుండ్లకమ్మ ఉదంతం రుజువు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
-
సాయంత్రం హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో భారీ వర్షం: ఐఎండీ
-
స్వాతీమాలీవాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనం సిగ్గుచేటు: నిర్మలా సీతారామన్
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే