వీటికెలా ముసుగేస్తారు?
సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఎన్నికల కోడ్ కూసిందని ఎన్నికల అధికారులు అప్రమత్తమై రాజకీయపార్టీ ఫ్లెక్సీలు పీకేసి.. విగ్రహాలకు ముసుగులు వేసేసి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు ప్రాంగణాల్లో రాజకీయ నాయకుల చిత్రాలు ఉండకూడదని.. జెండాలు ఎగరకూడదని హకుం జారీ చేస్తున్నారు.
స్కూలు పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకూ అన్నింటిపైనా జగన్ చిత్రాలే
వైకాపా జమానాలో అంతేలేని ప్రచార యావ
ఎన్నికల సంఘానికి సవాలుగా సర్కారు సిత్రాలు
ప్రచార యావతో గత అయిదేళ్లూ ఎక్కడ వీలుంటే అక్కడ సీఎం జగన్ ఫొటోలు ముద్రించేశారు. చిన్నారులకు ఇచ్చే చిక్కీలు... పిల్లలు చదివే పుస్తకాలు, ట్యాబ్లు... స్కూలు బ్యాగులు... రోగులకు చీటీలు... పేదలకిచ్చే ఇళ్ల పట్టాలు.. ఆస్తిపత్రాలు.. ఇలా ఎక్కడ చూసినా జగన్ బొమ్మే.. వైకాపా రంగుల హంగులే. చివరకు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ప్రజలు కూర్చునే బల్లలు మొదలుకొని చిన్నచిన్న నిర్మాణాలకూ వైకాపా రంగులు వేసేశారు. ఇప్పడు ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఈ అడ్డగోలు ప్రచారానికి ఎన్నికల సంఘం ఎలా కట్టడి చేస్తుందన్నదే పెద్ద ప్రశ్నగా తయారైంది.
ఈనాడు, అమరావతి. కాకినాడ, గుంటూరు : సార్వత్రిక ఎన్నికల ప్రకటన వచ్చేసింది. ఎన్నికల కోడ్ కూసిందని ఎన్నికల అధికారులు అప్రమత్తమై రాజకీయపార్టీ ఫ్లెక్సీలు పీకేసి.. విగ్రహాలకు ముసుగులు వేసేసి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేటు ప్రాంగణాల్లో రాజకీయ నాయకుల చిత్రాలు ఉండకూడదని.. జెండాలు ఎగరకూడదని హకుం జారీ చేస్తున్నారు. అయితే.. జగన్ జమానాలో వ్యవస్థలు జరిపిన అతిక్రమణలపైనా.. ఎన్నికల సంఘానికే సవాల్గా మారిన కోడ్
ఉల్లంఘనలపైనా ఇప్పుడు అధికారులు ఏ రీతిన స్పందిస్తారన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.
ప్రవీణ్ ప్రకాశ్ స్వామి భక్తి.. ఉపాధ్యాయులకు తలనొప్పి
వైకాపా ప్రభుత్వ హయాంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. వీటి తయారీలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ చూపిన స్వామి భక్తి.. ఇప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది నోటుపుస్తకాలపై సీఎం జగన్ ఫొటోతో పాటు విద్యా కార్యక్రమాల ఫొటోలను ముద్రించేలా ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశించారు. దీన్ని ఓ అధికారి వ్యతిరేకించినా వినకుండా అమలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఇప్పుడు జగన్ ఫొటో కనిపించకుండా ఉండేందుకు నోటుపుస్తకాలకు అట్టలు వేయాలంటూ ప్రధానోపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.దీంతో ఏం చేయాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.
- విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బ్యాగ్లపైన ‘జగనన్న విద్యాకానుక‘ అని రాశారు. ఉపాధ్యాయులు ఫిర్యాదులు చేస్తుండటంతో బెల్టులు ధరించకుండా చూడాలని చెబుతున్నారు. బ్యాగ్లపైనా ఇదే విధంగా ఉందని, వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
- పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా ఇస్తున్న చిక్కీలపై ఉండే కవర్లపైనా సీఎం జగన్ ఫొటోను ముద్రించారు. ఇప్పటికే చాలా బడులకు వీటిని పంపిణీ చేశారు. బడుల్లోని నిల్వలు 15 రోజుల వరకు వస్తాయి.
- పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లపైనా ‘జగనన్న గోరుముద్ద’ అని స్టాంపులు వేశారు. ఇప్పుడు ఇవి బడుల్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినందున వీటిని ఏం చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
- బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లపైనా జగన్ ఫొటో ముద్రించారు. వీటిపై వేసిన స్టిక్కర్లను తొలగించడం లేదు. ఉపాధ్యాయులు వీటిని తొలగించాలా లేదా అనేదానిపై స్పష్టత లేదు.
- బడుల్లో జగనన్న గోరుముద్ద, విద్యాకానుక ఇతరత్రా ఇలాంటి కార్యక్రమాలు, జగన్ ఫొటోలను చాలా బడుల్లో పెయింట్లు వేశారు. ఇప్పుడు వీటిని మూసివేసేందుకు రూ.లక్షల్లో వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
- విద్యార్థులకు అందించిన డిక్షనరీలపైనా జగన్ బొమ్మతో నవరత్నాల వివరాలు ముద్రించారు. పదో తరగతి విద్యార్థులకు అందించే స్టడీ మెటీరియల్పైనా జగన్తోపాటు, మంత్రుల చిత్రాలు ముద్రించారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కళ్లకు కనిపించవా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
బెల్లంపొడి.. రాగిపిండి.. బియ్యం సంచులపై స్టిక్కర్లు వేయాలని ఆదేశం
బెల్లం పొడి.. రాగిపిండి.. బియ్యం సంచులు.. సీఎం ఫొటో కన్పించకుండా స్టిక్కర్/టేప్ అంటించాలని సూచిస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్కుమార్ సోమవారం ఆదేశాలిచ్చారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వాహనాలపైనున్న జగన్, నవరత్నాల స్టిక్కర్లు కన్పించకుండా చూడాలని.. అయితే ఆ స్టిక్కర్లు, వాహన రంగు దెబ్బతినకుండా చూడాలని పేర్కొన్నారు. ఎండీయూ వాహనాలను రేషన్ పంపిణీకి తప్ప మరే ఇతర అవసరాలకూ ఉపయోగించకూడదని సూచించారు.
లక్షల ప్యాకెట్లపై స్టిక్కర్లు
మహిళా శిశు సంక్షేమశాఖ పరిధిలో టేక్ హోం రేషన్ కింద.. ప్రతి నెలా 17 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బెల్లం పొడి, రాగిపిండి, బియ్యం సంచులతో కూడిన పౌష్టికాహార ప్యాకెట్లు అందిస్తున్నారు. వాటన్నింటిపైనా ఉన్న సీఎం జగన్ బొమ్మలు కన్పించకుండా స్టిక్కర్ అంటించాలి. అదనపు ఖర్చు అవుతుంది. ఇవన్నీ మళ్లీ పౌర సరఫరాలశాఖే భరించాలి.
ప్రతిపక్ష హోర్డింగులే కనిపిస్తాయా
ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచ్చి 48 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా చోట్ల ముఖ్యమంత్రి జగన్, వైకాపా నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలు అలాగే కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫొటోలను యుద్ధ ప్రాతిపదికన తొలగించిన యంత్రాంగం...సీఎం ఫొటోలున్న వాటిని తొలగించే అంశంలో మీనమేషాలు లెక్కిస్తోంది. తూర్పుగోదావరి సహా పలు జిల్లాల్లో.. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే వాహనాలు (ఎండీయూ వెహికల్స్)పై ఉన్న నవరత్నాలు లోగో, ముఖ్యమంత్రి బొమ్మలు తొలగించలేదు.
జగన్ ఫొటోతో ఉన్న సిద్ధం హోర్డింగులు బహిరంగ ప్రదేశాల్లో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ‘‘మా నమ్మకం నువ్వే జగన్’’ పేరిట దుకాణాలు, ఇళ్లపై ఏర్పాటు చేసిన హోర్డింగులు తీయలేదు. అదే సమయంలో తెదేపా నాయకుల ఇళ్లు, ప్రైవేటు స్థలాలపై ఉన్న వాటిని మాత్రం తొలగించేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇళ్లపై కట్టుకున్న తెదేపా జెండాలను తొలగించిన అధికారులు.. వైకాపా నాయకుల ఇళ్లపై ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను మాత్రం తీయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలపై ఉన్న జగన్ బొమ్మలకు చాలా చోట్ల ముసుగు వేయలేదు. శిలాఫలకాలపై ఉన్న జగన్, మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల ఫొటోలను కనిపించకుండా చేయలేదు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వెంకటే గౌడ ఆయన ఫొటోలతో ఉన్న రైటింగ్ ప్యాడ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులు వాటిని తీసుకుని సోమవారం పరీక్షలకు హాజరయ్యారు. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చంద్రబాబు నివాసం వద్ద అధికారుల ‘అతి’
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్దకు వచ్చే పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు, ఇతర సందర్శకులు కూర్చునేందుకు వీలుగా కరకట్ట రోడ్డు పక్కన గతంలో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశారు. వాటికి పసుపు రంగు ఉందంటూ అధికారులు సోమవారం ఆ బల్లలను కూల్చేశారు. వాటికి పసుపు రంగు ఉండటం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని భావిస్తే తెలుపు సున్నం వేయిస్తే సరిపోతుంది.
లేదంటే ఆ రంగు కనిపించకుండా కాగితాలైనా అతికించొచ్చు. కానీ మున్సిపల్ అధికారులు ఏకంగా వాటిని ధ్వంసం చేసేశారు. రాష్ట్రంలోని ఊరూరా విద్యుత్తు స్తంభాలు, చెత్తకుండీలు, తోపుడు బండ్లు, తాగునీటి ట్యాంకులు, టిడ్కో గృహాలకు వైకాపా రంగులు ఉన్నా వాటిని తొలగించలేదు.
కోడ్ అమల్లో పక్షపాతం
గుంటూరు కార్పొరేషన్ సిబ్బంది తీరుపై తెదేపా ధ్వజం
ఎన్నికల కోడ్ అమలు చేయడంలో గుంటూరులో నగరపాలక సంస్థ అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. మంత్రి విడదల రజిని పేరుపై గుంటూరు పశ్చిమలోని పలు ప్రాంతాల్లో సిమెంటు బెంచీలు వేయించారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఆ బెంచీలకు ఆమె పేరు, వైకాపా రంగులు కనిపించకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని చూసీచూడనట్లుగా వదిలేశారు. అదే సమయంలో సోమవారం తెదేపా గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర కార్యాలయం వద్ద ప్రహరీకి ఉన్న తెదేపా జెండాలు, ఫ్లెక్సీలను తొలగించేందుకు మాత్రం అత్యుత్సాహం చూపారు. పబ్లిక్ ప్రాంతంలో లేనప్పటికీ సొంత ఇళ్లకు ఉన్న జెండాలు, ఫ్లెక్సీలు ఏవిధంగా తొలగిస్తారని తెలుగు యువత నాయకులు పట్టణ ప్రణాళిక సిబ్బందిని నిలదీశారు. మంత్రి రజిని ఏర్పాటు చేసిన బెంచీలకు రంగులు, ఆమె పేరు కనిపించకుండా చేశాక.. ఇక్కడకు రావాలని పట్టుబట్టడంతో వారు వెళ్లిపోయారు. అధికారులు పక్షపాత ధోరణితో అవలంబిస్తున్న విషయంపై ఎన్నికల సంఘం ఫిర్యాదుల విభాగానికి తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో సాయంత్రానికి మంత్రి రజిని ఏర్పాటు చేసిన బెంచీలకు కంటితుడుపు చర్యగా తెలుపు రంగు వేసి చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు రవీంద్ర కార్యాలయం వద్ద తెదేపా జెండాలను తొలగించేందుకు మళ్లీ కార్పొరేషన్ అధికారులు పోలీసులతో కలసి చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్