వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు.
వాలంటీర్ల జగన్ అనుకూల ప్రచారం
యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన
ప్రేక్షకపాత్రకు పరిమితమవుతున్న కలెక్టర్లు
ఈనాడు, అమరావతి, యంత్రాంగం: ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. ప్రజాధనాన్ని వేతనాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు.. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అధికార పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు కలెక్టరైనా, ఎన్నికల అధికారైనా తమ ముందు దిగదుడుపే అనేలా బరితెగిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 3 రోజులవుతున్నా, ఇప్పటికీ బహిరంగంగానే జగన్కు ఓటేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ‘మా ఇష్టం.. మేం ఏమైనా’ చేస్తామంటూ ఎదురు తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్లు, ఎన్నికల సంఘం అధికారులు చేష్టలుడిగి చూస్తుండటం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
వైకాపా అభ్యర్థి ప్రచారంలో వాలంటీర్లు: మళ్లీ వైకాపాకు పట్టం కట్టాలంటూ ఆ పార్టీ అభ్యర్థితో వాలంటీరు కూడా ప్రచారం చేసిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది. సోమవారం పట్టణంలోని 99వ పోలింగ్ కేంద్రం పరిధిలోని 29వ వార్డులో వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆ వార్డుకు చెందిన వాలంటీరు నరసింహులు ఆమె వెంట ప్రచారం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని తెదేపా నాయకులు కృష్ణ, డి.నరసింహులు, పందికోన ఈరన్న ఆరోపించారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన వాలంటీరుపై చర్య తీసుకోవాలని వారు ఆర్వోకు ఫిర్యాదు చేశారు.
- అన్నమయ్య జిల్లా పీలేరు మండలం అగ్రహారం పంచాయతీ పరిధిలో ఆదివారం రాత్రి వైకాపా స్థానిక నాయకులు నిర్వహించిన ప్రచారంలో వాలంటీర్లు శివ, సతీష్లు పాల్గొన్నారు.
- శ్రీకాకుళం జిల్లాలో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17న 589 కార్డులు అందజేశారు. రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 104, 18న 209 కార్డులు పంపిణీ చేశారు. వీటిని గతంలోనే అందజేయాల్సి ఉంది. ఓటర్లను ప్రభావితం చేసేలా మొత్తం 798 మంది లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయడం గమనార్హం.
సిద్ధం సభల్లో వాలంటీర్లు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండ గ్రామాల్లో సోమవారం వైకాపా నిర్వహించిన సిద్ధం గ్రామస్థాయి సమావేశాల్లో ఆయా గ్రామాలకు చెందిన కొందరు వలంటీర్లు పాల్గొని ‘మేము సిద్ధం’ అంటూ నినాదాలు చేశారు.
వైకాపాకు ఓటేయాల్సిందేనని ఒత్తిడి
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ మండలం కొత్తమల్లంపేట సచివాలయ పరిధిలో మహిళా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పథకాల పేర్లు చెప్పి, మళ్లీ జగన్కే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. ఇదేంటి మీ పని పథకాల గురించి చెప్పడం వరకే కదా.. ఏ పార్టీకి ఓటేయాలో మీరెలా చెబుతారని స్థానికుడొకరు ప్రశ్నించారు. దీంతో మా ఇష్టం అంటూ వాలంటీర్లు ఎదురుతిరిగారు. వాలంటీర్ల బరితెగింపు వెలుగులోకి రావడంతో స్థానిక ఎంపీడీవో రత్నకుమారి సోమవారం విచారణ చేపట్టారు. వైకాపాకు ఓటేయాలని చెప్పిన వాలంటీరు ప్రస్తుతం అందుబాటులో లేరని, వీడియోలో ఉన్న మిగతా ముగ్గురు వాలంటీర్లు మేం అలా చెప్పలేదనే వివరణతో మొక్కుబడి నివేదికను కలెక్టర్కు పంపించేశారు.
కొత్తమల్లంపేటలో నలుగురు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వైకాపాకు ఓటేయాల్సిందేనని గ్రామస్థులపై ఒత్తిడి తెస్తున్నారంటూ గొలుగొండ మండలం లింగంపేటకు చెందిన తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకుడు శ్రీకాంత్ సోమవారం నర్సీపట్నం ఆర్డీవో జయరాంకు ఫిర్యాదు చేశారు.
ప్రశ్నిస్తే కేసులు పెట్టండి
‘వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే వారిపై ఎదురు తిరగండి.. కేసులు పెడతామని బెదిరించండి. ఆ తరువాత మేం చూసుకుంటాం’ అని వైకాపా నేతలే వారికి అభయం ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వాలంటీర్లతో తెదేపా, జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించాలని అంతర్గతంగా వారికి మార్గదర్శనం చేసినట్లు సమాచారం. ఒకరిద్దరు అలా చేస్తే మిగతా ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించడానికి ముందుకురారని మాడుగులకు చెందిన ఓ నేత వాలంటీర్లకు ఇటీవల సూచించినట్ల్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్