TTD: అప్రమత్తతతోనే అరగంటలో పరిష్కారం
టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై
ఇక టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
ఈనాడు, తిరుపతి: టోకెన్లు లభిస్తాయో లేదోనన్న ఆతృతతో భక్తులు క్యూలైన్లలోకి దూసుకెళ్లడంతోనే మంగళవారం తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద గందరగోళం ఏర్పడిందని.. తాము అప్రమత్తమై అరగంటలోనే సమస్యను పరిష్కరించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం 15వేల టోకెన్లు జారీచేసే వరకూ ఇబ్బంది లేదని.. 10 గంటల సమయంలో మొదట శ్రీనివాసం కేంద్రం వద్ద సమస్య తలెత్తడంతో భక్తులను నియంత్రించడం కష్టమవుతోందని అధికారులు సమాచారమిచ్చారని తెలిపారు. వెంటనే టోకెన్ల జారీ నిలిపివేసి భక్తులను తిరుమలకు తరలించి వైకుంఠం-2లో పెట్టి దర్శనం చేయించాలని సూచించినట్లు వెల్లడించారు. అరగంటలోనే క్యూలైన్ల నుంచి భక్తులను తరలించినట్లు వెల్లడించారు. ఇకపై టోకెన్లు లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. బుధవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘సర్వదర్శన టైమ్స్లాట్ టోకెన్లను తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఇస్తున్నాం. అక్కడ ఇవ్వాలనుకున్న ప్రతిసారీ సమస్యలొచ్చాయి. ఒకేసారి మూడు నాలుగు రోజుల టోకెన్లను ఇచ్చినా మూడో రోజుకు టోకెన్లు ఉన్న భక్తులు వచ్చి తమకు అదేరోజు దర్శనం కల్పించాలని ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. కొవిడ్ సమయంలో రెండున్నర నెలలు ఎస్ఎస్డీ టోకెన్లను ఆన్లైన్లో ఇచ్చాం. దీనివల్ల గ్రామీణ, కంప్యూటర్ పరిజ్ఞానం లేని భక్తులు నష్టపోతున్నారని గుర్తించి, తిరిగి మార్చి 1 నుంచి ఏప్రిల్ 11 వరకు చక్కగా నిర్వహించాం. భక్తులు ఎస్ఎస్డీ టోకెన్లు తీసుకుని అరగంట ముందు తిరుమల వచ్చి గంటన్నరలో శ్రీవారి దర్శనం చేసుకునేవారు.
లక్ష టోకెన్ల జారీకి సిద్ధమయ్యాం
9, 10, 11 తేదీల్లో రద్దీ దృష్ట్యా 8వ తేదీనే టోకెన్లు జారీచేశాం. 3 రోజులు ఇచ్చినందునకౌంటర్లు మూసేశాం. తిరిగి మంగళవారం రోజున బుధ, గురు, శుక్రవారాలకు లక్ష టోకెన్లు ఇవ్వాలనుకున్నాం. శనివారం టోకెన్లు దొరకని కొందరు తిరుపతిలోనే ఉండిపోయారు. నాలుగు రోజులు సెలవులుండటంతో మరికొందరు వచ్చారు. మొత్తం మూడు ప్రదేశాల్లో 20వేల మంది ఉన్నారు. శ్రీనివాసంలో రెండు లైన్లున్నాయి. ఒక లైను నుంచి టోకెన్ తీసుకుని మరోలైను నుంచి బయటకు రావాలి. భక్తులు బయటకు వెళ్లే లైన్లోకి ప్రవేశించి టోకెన్ ఇవ్వాలన్నారు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. గాయాలయ్యాయి.. సొమ్మసిల్లి పడిపోయారని దుష్ప్రచారం చేయడం సరికాదు. అందరినీ తీసుకొస్తే 12 కంపార్ట్మెంట్లలోనే ఉన్నారు. మంగళవారం ఉక్కపోతకు 15-20 నిమిషాలు ఇబ్బందిపడి ఉంటారు. పాత పద్ధతిలో సర్వదర్శనాన్ని అమలుచేస్తే.. 20, 30, 40 గంటలు ఇబ్బంది పడాలి. కొవిడ్ ఇంకా పూర్తిగా పోలేదు. మరి ఒక్కో కంపార్ట్మెంట్లో 500 మందిని ఉంచడం మంచిదా?’
ముందు నుంచే సన్నద్ధం..
‘ముందస్తు ఏర్పాట్లు చేయకుంటే భక్తులను ఇలా తరలించి దర్శనం చేయించే ఏర్పాట్లు జరిగేవా? మార్చి 1వ తేదీ నుంచే వైకంఠం-2 కాంప్లెక్సులను సిద్ధంగా ఉంచుకున్నాం. తాగునీరు, ఆహారం, పాల సరఫరాకు చర్యలు చేపట్టాం. మధ్యాహ్నం నుంచి వచ్చినవాళ్లలో 35వేల మందికి ఎస్ఎస్డీ దర్శనం చేయించాం. భక్తులను భగవంతుడికి దూరం చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అలా అయితే ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టైమ్స్లాట్ టోకెన్ ద్వారా ఎప్పుడు దర్శనం ఉంటుందో తెలుస్తుంది. గతంలో ఒకోసారి దర్శనానికి 72 గంటలూ పట్టేది. అంతవరకూ క్యూ/కంపార్ట్మెంట్లలో ఉండాలి. భక్తులకు మరింత మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రయత్నించాం. భక్తులకు స్వామివారిని దూరం చేశామనడం తప్పు.’
తెల్లవారుజాము 2.15 గంటల వరకు దర్శనం
‘మంగళవారం జరిగిన చిన్న ఘటనను పెద్దగా చిత్రీకరించారు. అది తప్పు. బుధవారం దాదాపు 80 వేల మందికి దర్శనం చేయిస్తున్నాం. ఎక్కడా పొరపాటు జరగలేదు. మంగళవారం మధ్యాహ్నం తిరుమల చేరుకున్న భక్తులకు తెల్లవారుజామున 2.15 గంటల వరకు దర్శనం కల్పించాం. నిర్లక్ష్యం వహించలేదు. సమస్య వచ్చింది కాబట్టే పరిష్కరించగలిగాం. నవంబరులో వరదల సమయంలో శ్రీవారి మెట్టుమార్గం భారీగా దెబ్బతింది. దానికి యుద్ధప్రాతిపదికన టెండర్లు పిలిచాం. సిమెంటు, ఇసుక అంతా మనిషి మోసుకుని తీసుకురావాలి. అది కొంచెం ఆలస్యమైన పద్ధతి. ఈనెల 30న దాన్ని ప్రారంభిస్తాం. 17 రోజుల్లోగా దాన్ని పూర్తిచేస్తాం. వీఐపీ బ్రేక్లను రద్దుచేశాం. వ్యక్తిగతంగా వచ్చే ప్రముఖులకే ఇస్తున్నాం. బుధవారం గంటన్నరలోనే వీఐపీ బ్రేక్ పూర్తిచేశాం’ అని ధర్మారెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు