Yadadri: భక్తజన.. నారసింహా
ఆరేళ్లుగా ఎదురుచూసిన మహోత్తర ఘట్టం రానే వచ్చింది.. కొండంతా ‘నమో నారసింహ’ మంత్రంతో మారుమోగింది.. ఆకాశమంతా అరుణ కాంతులు ప్రసరిస్తున్నవేళ యాదాద్రి క్షేత్రం దేదీప్యమానమైంది.. ఆలయమంతా పచ్చని తోరణాలు, పుష్పాలు, అరటి బోదెల అలంకరణలతో శోభాయమానమైంది.. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులంతా తరలి వచ్చారు.. రుత్వికులు మంత్రపఠనం చేశారు.. మహా సంప్రోక్షణ మొదలైంది.. బంగారు వాకిళ్లు తెరుచుకున్నాయి.. మూలవరుల పునర్దర్శనంతో భక్తులంతా తన్మయత్వం చెందారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వంతో మొదలైన క్రతువు సాయంత్రం జరిగిన శాంతికల్యాణంతో పరిపూర్ణమైంది.
శోభాయమానంగా యాదాద్రి సమారోహం
మహాకుంభ సంప్రోక్షణ క్రతువులో సతీసమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్
విమానగోపురంపై శ్రీచక్ర ప్రతిష్ఠాపన
స్వయంభువుల దర్శనాలు ప్రారంభం
స్వామి సేవలో రాష్ట్ర మంత్రివర్గం, అధికార యంత్రాంగం
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, యాదగిరిగుట్ట
ఆరేళ్లుగా ఎదురుచూసిన మహోత్తర ఘట్టం రానే వచ్చింది.. కొండంతా ‘నమో నారసింహ’ మంత్రంతో మారుమోగింది.. ఆకాశమంతా అరుణ కాంతులు ప్రసరిస్తున్నవేళ యాదాద్రి క్షేత్రం దేదీప్యమానమైంది.. ఆలయమంతా పచ్చని తోరణాలు, పుష్పాలు, అరటి బోదెల అలంకరణలతో శోభాయమానమైంది.. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులంతా తరలి వచ్చారు.. రుత్వికులు మంత్రపఠనం చేశారు.. మహా సంప్రోక్షణ మొదలైంది.. బంగారు వాకిళ్లు తెరుచుకున్నాయి.. మూలవరుల పునర్దర్శనంతో భక్తులంతా తన్మయత్వం చెందారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వంతో మొదలైన క్రతువు సాయంత్రం జరిగిన శాంతికల్యాణంతో పరిపూర్ణమైంది.
స్వయంభు దర్శనం.. సాకారం
స్తంభోద్భవుడైన నరసింహుడి లక్ష్మీ సమేత ఆవాసమైన యాదాద్రి ఆలయ ఉద్ఘాటన మహాక్రతువు సోమవారం శోభాయమానంగా జరిగింది. వేద మంత్ర ఘోషతో కొండంతా ఆధ్యాత్మికత ఉట్టిపడింది. వారం రోజులుగా సాగిన పంచకుండాత్మక మహాయాగంలో పూజించిన నదీజలాలతో కూడిన మహాకుంభ సంప్రోక్షణ పర్వం ఆలయ శిఖరాలపై ఏకకాలంలో కొనసాగింది. స్వామి విమానంపై శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారులకు పూజలు నిర్వహించి మహాకుంభ సంప్రోక్షణ పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రధానార్చకులు నల్లంథిగల్ లక్ష్మీనరసింహాచార్యులు జరిపించారు. మిగతా ఆరు గోపురాలు, అష్టభుజ మండప విమానాలపై ఉన్న కలశాల సంప్రోక్షణను ముఖ్యమంత్రి కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ సహా రాష్ట్ర మంత్రులు వారి కుటుంబ సభ్యులతో నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు ఈ మహాక్రతువు కొనసాగింది. హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా పాల్గొనడం ఇదే ప్రథమమని ఆలయవర్గాలు పేర్కొన్నాయి.
కనుల పండువగా శోభాయాత్ర
అంతకుముందు బాలాలయంలో వారంరోజుల పాటు జరిగిన పంచకుండాత్మక మహాయాగం మహాపూర్ణాహుతితో ముగియగా.. సరిగ్గా ఉదయం 9.56 గంటలకు ఆ ప్రాంగణం నుంచి స్వామివారి శోభాయాత్ర మొదలైంది. ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ అనంతరం మూర్తులను గర్భాలయంలోకి చేర్చారు. సీఎం కేసీఆర్ స్వయంగా స్వామి ప్రతిష్ఠామూర్తులను భుజానెత్తుకుని సేవలో పాల్గొన్నారు. నిర్ణయించిన ముహూర్తం మిథునలగ్నం, ఏకాదశి, సోమవారం ఉదయం 11.55 గంటలకు విమానంపై శ్రీ సుదర్శన చక్రం ప్రతిష్ఠాపన అనంతరం గర్భాలయంలో స్వయంభువుల దర్శనాలు మొదలయ్యాయి. సాయంత్రం జరిగిన శాంతికల్యాణంతో క్రతువు పరిపూర్ణమైంది.
తొలిపూజలో సీఎం దంపతులు
ప్రధానాలయ మహాముఖ మండపంలో మంత్రులు, ఇతర ముఖ్యులను, వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ గర్భాలయం వద్దకు చేరిన సీఎం సమక్షంలో అర్చకులు స్వర్ణ ద్వారాలను తెరిచారు. అనంతరం చేపట్టిన గడప పూజను సీఎం సతీమణి శోభ, కుమార్తె కవిత, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు నిర్వహించారు. అనంతరం పూజారులు నిర్వహించిన తొలి ఆరాధనలో పాల్గొని మూలవరులను సీఎంతో పాటు కుటుంబసభ్యులు దర్శనం చేసుకొని, ఆశీస్సులు పొందారు. అనంతరం ముఖమండపంలో వేచి ఉన్న వారంతా మూలవరుల దర్శనం చేసుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ పర్వంతో మొదలైన క్రతువు సాయంత్రం శాంతికల్యాణంతో పరిపూర్ణమైంది.
క్షేత్రాభివృద్ధిలో పాల్గొన్నవారిని సత్కరించిన కేసీఆర్
యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో శ్రమించిన వివిధ రంగాలకు చెందిన 44 మంది నిపుణులను సీఎం కేసీఆర్, మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి తదితరులు సన్మానించారు. ప్రధాన స్థపతులు సుందర్రాజన్, ఆనందాచారి వేలు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ఈవో గీతతో పాటు ఇంజినీర్లు, శిల్పులు, ప్రభుత్వ అధికారులు, వాస్తు నిపుణులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వైస్ ఛైర్మన్ కిషన్రావును ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ తన మెడలో ఉన్న కండువాతో సన్మానించారు. అనంతరం ఆలయం తరఫున సీఎం కేసీఆర్ను మంత్రులు ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి సహా ఆలయ ఈఓ గీత, వైటీడీఏ కిషన్రావు సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
భక్తులకు నిజదర్శనాలు ప్రారంభం
మధ్యాహ్నం 3 గంటల నుంచి భక్తులకు మూలవరుల నిజదర్శనాలు మొదలయ్యాయి. ఉదయం నుంచి కొండ కింద వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా ఆలయానికి చేరుకోగా.. దర్శనానికి టోకెన్తోనే రావాలని పోలీసులు వెనక్కు పంపేశారు. దీంతో వారంతా కొండ దిగి కల్యాణకట్ట వద్దకు వెళ్లి అక్కడ ఇస్తున్న టోకెన్లు తీసుకుని వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు.
భద్రత బాధ్యత ఆక్టోపస్కు?
ఈనాడు, నల్గొండ: యాదాద్రి ఆలయ భద్రతను ప్రత్యేక పోలీసు విభాగమైన ఆక్టోపస్కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా సోమవారం ఆక్టోపస్ కమాండోలు ఆలయానికి భద్రత కల్పించారు. క్షేత్రాభివృద్ధికి సంకల్పించిన సమయంలోనే ఆలయానికి ప్రత్యేక విభాగం ద్వారా భద్రత కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సైతం ఆక్టోపస్ బలగాలే భద్రత బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం క్షేత్రంలో జరుగుతున్న పనులతో పాటు ఆలయ నిర్వహణ బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారికి అప్పగించనున్నట్లు సమాచారం.
జీవితంలో మరచిపోలేని రోజు
- ఆనంద్సాయి, ఆర్కిటెక్ట్
ఇంతపెద్ద భవ్య ఆలయ నిర్మాణంలో నేనూ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ఉద్ఘాటన సందర్భంగా సీఎం కేసీఆర్ సన్మానించిన ఈ రోజును నేను జీవితంలో మరచిపోలేను. ఈ జన్మకిది చాలు.
నారసింహుడి దయ
- కిషన్రావు, వైటీడీఏ వైస్ ఛైర్మన్
అద్భుత శిల్పాకళాసంపదతో కట్టిన ఈ ఆలయం అభివృద్ధి కమిటీకి సీఎం కేసీఆర్ ఛైర్మన్గా.. నేను వైస్ఛైర్మన్గా ఉండటం ఆ నారసింహుడి దయవల్లే అనుకుంటున్నా.
పూర్వజన్మ సుకృతం
- గీత, ఈవో, యాదాద్రి దేవస్థానం
ఆలయ ఉద్ఘాటన పర్వం నేను ఈవోగా ఉన్న సమయంలో జరగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సీఎం కేసీఆర్ వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. పునర్నిర్మాణం నుంచి ఉద్ఘాటన వరకు ఈవోగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ