
Corona Second Wave:కేంద్రం కీలక నిర్ణయం
ఆక్సిజన్, కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ మాఫీ
దిల్లీ: రెండో దశలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న వేళ.. వైద్యపరంగా ప్రజలపై పడుతోన్న భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్, కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్ను తక్షణమే మాఫీ చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. మూడు నెలల కాలానికి ఇది అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
తాజా నిర్ణయం వస్తువుల లభ్యతను పెంచడమే కాక చౌకగా లభించేలా చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే వాటికి త్వరగా కస్టమ్స్ అనుమతులు వచ్చేలా చూడాలని ప్రధాని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశలో ఏర్పడుతోన్న ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింగపూర్ నుంచి యుద్ధవిమానాల్లో ప్రాణవాయువు భారత్కు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అలాగే దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేసేందుకు భారత వైమానిక దళం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది.
కాగా, ప్రభుత్వం పేర్కొన్న జాబితాలో..ఆక్సిజన్, ఆక్సిజన్ క్యానిస్టర్, ఫిల్లింగ్ సిస్టమ్స్, కంటైనర్లు, ట్రాన్స్పోర్ట్ ట్యాంకులు, ఆక్సిజన్ జనరేటర్లు, వెంటిలేటర్లు(వెంటిలేటర్స్ విత్ నాజల్ క్యాన్యులా) ఉన్నాయి. వాటితోపాటు కొవిడ్ టీకాల దిగుమతిపై కూడా కస్టమ్ డ్యూటీని మూడు నెలల కాలానికి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయానికి నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3.46లక్షల మందికి కరోనా సోకగా..2,624 మంది మరణించారు. క్రియాశీల కేసులు 25లక్షల మార్కును దాటడమే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా పరిణమించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఇవి ముందే చూసుకోండి!
-
India News
India Corona: 4 శాతానికి పైగా పాజిటివిటీ రేటు..!
-
India News
Spicejet: క్యాబిన్లో పొగలు.. స్పైస్జెట్ విమానం వెనక్కి
-
Sports News
Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
-
Related-stories News
Ayodhya Ram Mandir: రామమందిర నిర్మాణానికి రూ.3,400 కోట్ల విరాళాలు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్ను విడిచిన రష్యా
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- Andhra News: నా చొక్కా, ప్యాంట్ తీసేయించి మోకాళ్లపై కూర్చోమన్నారు.. సాంబశివరావు ఆవేదన
- Udaipur murder: దర్జీ హత్యకేసులో మరో సంచలన కోణం.. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు!
- Naresh: ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య